వాట్సాప్ ప్రశ్నపత్రాలు.. ఇబ్బందులు
ప్రభుత్వ పాఠశాలల్లో ఎఫ్ఏ-2 పరీక్షను వాట్సాప్ ఆధారంగా నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశించింది. జిల్లాలో శుక్రవారం పరీక్షలు ప్రారంభమయ్యాయి.
పరీక్షకు హాజరైన విద్యార్థులు
సంగం, న్యూస్టుడే: ప్రభుత్వ పాఠశాలల్లో ఎఫ్ఏ-2 పరీక్షను వాట్సాప్ ఆధారంగా నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశించింది. జిల్లాలో శుక్రవారం పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కొన్ని ఇబ్బందులు తలెత్తాయని విద్యార్థులు, ఉపాధ్యాయులు వాపోతున్నారు. పరీక్షకు గంట ముందుగా ఉపాధ్యాయుల ఫోన్లోని వాట్సాప్కి ప్రశ్నపత్రం విడుదల చేస్తున్నారు. దీంతో ఉపాధ్యాయులు తరగతి గదిలోని బోర్డుపై రాయాల్సి వస్తోంది. విద్యార్థులు దాన్ని ప్రత్యేకంగా ప్రశ్నపత్రం రూపంలో నమోదు చేసుకుని ఆ తరువాత సమాధానాలు రాయాలని సూచించారు. ఇక్కడే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రశ్నపత్రాన్ని బోర్డుపై రాయడం ప్రాథమిక బడుల్లో సాధ్యపడటంలేదు. తొలి పరీక్ష అయిన తెలుగు ప్రశ్నపత్రం పరిశీలిస్తే అందులో వివిధ రకాల బొమ్మలున్నాయి. వాటిని సరిగా గుర్తించి జత చేయాలని సూచించారు. రెండోతరగతి తెలుగు ప్రశ్నపత్రంలో గులాబీ పుష్పం, తేలు, సూది, బెండకాయ తదితర చిత్రాలున్నాయి. వాటిని చిత్రలేఖన ఉపాధ్యాయులు మాత్రమే సక్రమంగా గీయగలరు. మిగిలిన వారికి కష్టమే. ఈ నేపథ్యంలో కొందరు ఉపాధ్యాయులు తమ సొంత ఖర్చుతో ప్రశ్నపత్రాలను ప్రింటు తీయించి పరీక్ష నిర్వహించారు. ఈ విద్యాసంవత్సరంలో నిర్వహించిన ఎఫ్ఏ-1 పరీక్ష సందర్భంగా విద్యాశాఖ ఆర్భాటం ప్రదర్శించింది. వోఎంఆర్ విధానంలో పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులకు అవగాహన కలుగుతుందని ప్రకటించారు. ప్రస్తుతం ఆ విధానానికి తిలోదకాలిచ్చారు. ప్రస్తుత వాట్సాప్ విధానానికి స్వస్తి పలికి ప్రశ్నపత్రాల ఆధారంగా పరీక్ష నిర్వహించాలని విద్యార్థులు, వారి తల్లితండ్రులు కోరుతున్నారు.
విద్యార్థులకు అసౌకర్యం
- జి.జె. రాజశేఖర్, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు
వాట్సాప్ ద్వారా ప్రశ్నపత్రం ఇవ్వటం, దాన్ని బోర్డుపై ఉపాధ్యాయుడు రాస్తే విద్యార్థులు రాసుకుని సమాధానాలు ఇవ్వటం తీవ్ర అసౌకర్యంగా ఉంది. పరీక్ష వ్యవధి 45 నిమిషాలు. ఇందులో ప్రశ్నపత్రం రాసుకునేందుకే సమయం సరిపోతోంది. సమాధానాలు ఎప్పుడు రాయాలి. ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఒక ఉపాధ్యాయుడు అయిదు తరగతుల విద్యార్థులకు ఏవిధంగా ప్రశ్నపత్రం రాయాలో అధికారులు ఆలోచించాలి. ప్రభుత్వం ఈ విధానాన్ని మార్చాలి. ప్రశ్నపత్రాలు ఇచ్చి రాయించాలి. పాత పద్ధతినే అమలు చేయాలి.
ఇబ్బందులు లేకుండా చేస్తున్నాం
- జానకీం రాం, మండల విద్యాశాఖాధికారి
ప్రభుత్వ విధానం కొనసాగిస్తున్నాం. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చేస్తున్నాం. ఉపాధ్యాయులతో సమన్వయం చేసుకుని అవసరమైన చోట విద్యార్థులకు ప్రశ్నపత్రాలు అచ్చు వేసి ఇచ్చాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెక్పోస్టులను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
[ 18-04-2024]
జిల్లాలో ఎస్పీ కె.ఆరీఫ్ నైట్ బీట్, చెక్పోస్టులను తనిఖీ చేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రత దృష్యా బీవీ నగర్ పరిధిలోని నైట్బీట్లను తనిఖీ చేసి, గస్తీ ఎలా ఉందో పర్యవేక్షించారు. -
వైకాపాకు షాక్.. తెదేపాలో చేరిన కీలక నేతలు
[ 18-04-2024]
తెదేపాలో చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నవేళ డివిజన్లలో అత్యంత కీలకంగా పనిచేస్తున్న ముఖ్య నాయకులు వైకాపాను వీడి తెదేపాలో చేరుతున్నారు. -
జగదభిరామ.. జానకిరామ
[ 18-04-2024]
జిల్లా వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలను ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. నెల్లూరు దర్గామిట్టలోని శబరి శ్రీరామక్షేత్రం ఆధ్వర్యంలో బుధవారం శ్రీరామ స్థూపం ప్రాంగణంలో వేలాది మంది సమక్షంలో సీతారాముల కల్యాణోత్సవం నిర్వహించారు. -
20న సర్వేపల్లికి చంద్రబాబు రాక
[ 18-04-2024]
ప్రజాగళం పర్యటనలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు జిల్లాకు రానున్నారు. ఈ నెల 20వ తేదీ శనివారం మధ్యాహ్నం 3 గంటలకు సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరులో జరిగే సమావేశంలో పాల్గొననున్నారు. -
జిల్లాకు చేరుకున్న వ్యయ పరిశీలకులు
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల వ్యయ పరిశీలకులుగా నియమితులైన జ్యోతిమోయ్ బయ్లంగ్, కంచన్ రామ్ మీనా నెల్లూరుకు విచ్చేశారు. బుధవారం రాత్రి నగరంలోని ఓ హోటల్కు చేరుకున్నారు. -
పరిశ్రమలేమోగానీ.. తిప్పలు గుల్ల
[ 18-04-2024]
ఆత్మకూరు పారిశ్రామిక వాడలో పరిశ్రమల మాటేమోగానీ.. అది వైకాపా మట్టి మాఫియాకు కాసుల పంట పండిస్తోంది. ప్రస్తుతం ఇక్కడ రూ. 23.4 కోట్లతో రెండో విడత అభివృద్ధి పనులు చేపడుతున్నారు. -
అధికార అహం.. అరాచక పర్వం!
[ 18-04-2024]
వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో అరాచకాలు, ఆగడాలు నిత్యకృత్యమయ్యాయి. దౌర్జన్యాలు, దాడులు, వేధింపులు సర్వసాధారణంగా మారాయి. అధికార పార్టీ నేతలన్న అహంతో కొందరు వైకాపా నాయకులు చెలరేగిపోగా- వారి దందాలు, దౌర్జన్యాలకు కొందరు అమాయకులు బలైపోయారు. -
నామినేషన్లకు వేళాయే
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాలో ఒక లోక్సభ స్థానంతో పాటు ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు నోటిఫికేషన్ వెలువడనుంది. -
పోలీస్ బందోబస్తు
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ పర్యవేక్షణలో జిల్లా పోలీసు యంత్రాంగం నామినేషన్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. -
రైతు జపం.. ఏదో నెపం
[ 18-04-2024]
కౌలు రైతులకు కొత్త చట్టం తెచ్చామని జగన్మోహన్రెడ్డి చెబుతున్నా.. భూ యజమాని అంగీకారం లేనిదే సాగుదారు హక్కుపత్రాలు లభించని పరిస్థితి క్షేత్రస్థాయిలో కనిపిస్తోంది. -
కడలికి తూట్లు.. అక్రమార్కులకు కాసులు
[ 18-04-2024]
ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చింది. సహజ వనరులను ఇతర ప్రాంతాలకు తరలించడానికి వీల్లేదు. కానీ కొందరు సముద్రపు ఇసుకను తీసుకొచ్చి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. -
బేల్దారీ బేజారు
[ 18-04-2024]
భవన నిర్మాణ సామగ్రి ధరలు అసాధారణంగా పెరగడంతో వందల మంది అసంఘటిత రంగ కార్మికులు రోడ్డున పడుతున్నారు. ఒక పక్క వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో గ్రామాల్లో వ్యవసాయ పనులు దొరికే పరిస్థితి లేదు. -
వేసవి ప్రణాళిక లేదు.. అధికారి లేరు
[ 18-04-2024]
ఎండలు మండి పోతున్నాయి. జిల్లాలో బావులు, నీటి వనరులు అడుగంటుతున్నాయి. జనం దాహార్తితో అల్లాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో యుద్ధప్రాతిపదిక పనిచేయాల్సిన గ్రామీణ నీటి సరఫరా అధికారులు.. బదిలీపై వెళ్లిపోతున్నారు. -
అరాచకాల్లో దిట్ట జగన్: బీద
[ 18-04-2024]
హత్యలు, దాడులు, కబ్జాలు, అరాచకాల్లో దిట్ట జగన్ అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర విమర్శించారు. నెల్లూరు తెదేపా కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. -
మూడేళ్ల చదువు ఉపాధికి ఆదరువు
[ 18-04-2024]
పదో తరగతి తరువాత మూడేళ్ల చదువు.. అనంతరం ఉపాధి.. ఉన్నత చదువులు చదవాలనుకునే వారికి నేరుగా రెండో సంవత్సరంలో బీటెక్లో చేరే అవకాశం.. ఇది పాలిటెక్నిక్లో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు. -
చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యం: తెదేపా
[ 18-04-2024]
చంద్రబాబు సీఎం అయితే అభివృద్ధి జరుగుతుందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర పేర్కొన్నారు. బుధవారం రాత్రి బోగోలు మండలంలోని చెంచులక్ష్మీపురంలో యోహాన్ అతని అనుచరులు పార్టీలో చేరారు.
తాజా వార్తలు (Latest News)
-
డేవన్ కాన్వే ఔట్.. మరో సీనియర్ ప్లేయర్కు చెన్నై అవకాశం
-
గత పదేళ్లలో తెలంగాణకు రూ.10 లక్షల కోట్లు: కిషన్రెడ్డి
-
గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం: వాతావరణ శాఖ
-
ఇన్నేళ్లుగా ‘రాహుల్’యాన్ను లాంచ్ చేయలేకపోయింది: రాజ్నాథ్ సింగ్
-
లింక్ క్లిక్ చేస్తున్నారా? ఆగండి..! మెసేజ్ మూలాలు చెక్ చేయండి..
-
మొన్న కంగనపై.. నేడు ఎన్కౌంటర్పై.. వరుస వివాదాల్లో సుప్రియ శ్రీనేత్