logo

కార్యకర్తలతోనే అతిపెద్ద పార్టీగా అవతరణ

సుశిక్షితులైన కార్యకర్తల వల్లే భాజపా ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీగా అవతరించిందని రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.

Published : 03 Dec 2022 02:23 IST


భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజును సన్మానిస్తున్న నాయకులు

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట), న్యూస్‌టుడే: సుశిక్షితులైన కార్యకర్తల వల్లే భాజపా ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీగా అవతరించిందని రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. శుక్రవారం నగరంలోని రామ్మూర్తి నగర్‌లోని ఓ కల్యాణ మండపంలో భారతీయ జనతా కిసాన్‌ మోర్చా రాష్ట్ర స్థాయి శిక్షణ ముగింపు కార్యక్రమం ముగింపు కార్యక్రమం జరిగింది. ఇందులో సోము వీర్రాజు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. పార్టీ ప్రస్థానాన్ని వివరించారు. జాతీయవాదం, సుపరిపాలన, పేదల అభ్యున్నతి కోసమే పార్టీ పనిచేస్తోందన్నారు. మోదీ ప్రభుత్వం రైతులకు చేస్తున్న పనుల గురించి విస్తృత ప్రచారం చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మోదీ పథకాలను తమవిగా స్టికర్‌ వేసుకోవడం సిగ్గుచేటన్నారు. పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ మాట్లాడారు. భారతీయ జనతా కిసాన్‌ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శశిభూషణ్‌రెడ్డి, నాయకులు సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి, సురేంద్రరెడ్డి, ఆంజనేయరెడ్డి, బుజ్జిరెడ్డి, సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని