200 రోజులకు చేరిన పవనన్న ప్రజాబాట
జనసేన నగర నాయకుడు కేతంరెడ్డి వినోద్రెడ్డి చేపట్టిన పవనన్న ప్రజాబాట గురువారానికి 200 రోజులు పూర్తయింది.
వినోద్రెడ్డిపై పూలుచల్లుతున్న కార్యకర్తలు
నెల్లూరు (వీఆర్సీ సెంటరు), న్యూస్టుడే : జనసేన నగర నాయకుడు కేతంరెడ్డి వినోద్రెడ్డి చేపట్టిన పవనన్న ప్రజాబాట గురువారానికి 200 రోజులు పూర్తయింది. ఈ సందర్భంగా స్థానిక ఏబీఎం కాంపౌండు నుంచి ర్యాలీ చేపట్టారు. తొలుత సర్వమత ప్రార్థనలు చేశారు. స్థానిక ఆత్మకూరు బస్టాండు ఫ్లైఓవరు బ్రిడ్జి వద్ద భారీస్థాయిలో మురుగు ఉన్నా వెనుకాడకుండా ర్యాలీ కొనసాగింది. అనంతరం పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించారు. డప్పుల కళాకారులు, చప్పుళ్లతో ప్రజాబాట కొనసాగింది. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్రెడ్డి మాట్లాడుతూ తన 200 రోజుల ప్రజాబాటలో ఎన్నో సమస్యలు గుర్తించానన్నారు. ఆయా సమస్యలను జనసేనాని పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. తనపై నగర ప్రజలు చూపించిన ప్రేమ, ఆప్యాయతలు ఎనలేనిదన్నారు. కార్యక్రమంలో నాయకులు పావుజెన్ని చంద్రశేఖర్రెడ్డి, కనకేశ్వర్రావు, కార్తిక్ హేమంత్, రాయల్ ప్రభాకర్, జీవన్, రాము, వరప్రసాద్, వినయ్, జాఫర్, శ్రీకాంత్, చరణ్తేజ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!