కరస్పాండెంట్పై లైంగిక వేధింపుల ఆరోపణ
నెల్లూరు నగరంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో నాలుగో తరగతి బాలికపై లైంగిక వేధింపుల ఘటన మరువక ముందే.. మరో దారుణం చోటు చేసుకుంది.
పాఠశాల ఎదుట బాలిక తల్లి ఆందోళన
నెల్లూరు(నేర విభాగం), న్యూస్టుడే: నెల్లూరు నగరంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో నాలుగో తరగతి బాలికపై లైంగిక వేధింపుల ఘటన మరువక ముందే.. మరో దారుణం చోటు చేసుకుంది. స్థానిక మాగుంట లేఅవుట్లోని మరో ప్రైవేటు స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికపై కరస్పాండెంట్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ తల్లి పాఠశాల ఎదుట ధర్నాకు దిగారు. తమకు అన్యాయం జరిగిందంటూ.. కరస్పాండెంట్ వాహనం ఎదుట విద్యార్థి తల్లి బైఠాయించి ఆందోళన చేపట్టడం తీవ్ర చర్చనీయాంశమైంది. తమ కుమార్తె పరీక్షల్లో మాస్ కాపీయింగ్ చేస్తూ పట్టుబడిందనే నెపంతో కరస్పాడెంట్ బ్లాక్మెయిల్ చేస్తూ వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఆయనతో పాటు వాహన డ్రైవరు సైతం అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ కన్నీరుమున్నీరయ్యారు. ఈ సందర్భంగా తోటి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఏకమవడంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. తమ బిడ్డ పరిస్థితి ఏమిటంటూ ప్రశ్నించారు. న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పాఠశాల నుంచి ఏ ఒక్కరూ బయటకు రాలేదు. కరెస్పాండెంట్ తన వాహనంలో వెళ్లిపోతుండగా.. బాధిత బాలిక తల్లి దాని ఎదుట కూర్చొని ఆందోళన చేశారు. ఇంతలో పోలీసులు రంగప్రవేశం చేసి.. పరిస్థితిని చక్కదిద్దారు. నగర డీఎస్పీ శ్రీనివాసరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని జరిగిన విషయంపై ఆరా తీశారు. ఇన్స్పెక్టరు రాములు నాయక్, సీతారామయ్య ఘటనా స్థలానికి చేరుకున్నారు. డీఎస్పీ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. దర్యాప్తులో వాస్తవాలు పరిశీలిస్తామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యుత్ నియంత్రణ అవసరం
[ 28-03-2024]
విద్యుత్ నియంత్రణ అవసరమని కొండాపురం మోడల్ స్కూల్ ఉపాధ్యాయుడు ఎస్కే ఖాదర్ బాషా తెలిపారు. -
పొగాకు బ్యారెన్లు దగ్ధం
[ 28-03-2024]
కొండాపురం మండలంలో ఆదిమూర్తిపురం గ్రామంలో ప్రమాదవశాత్తు 4 పొగకు బ్యారెన్లు దగ్ధమైన సంఘటన గురువారం జరిగింది. -
నాయకుల రాజీనామా
[ 28-03-2024]
కావలి టౌన్ 29వ వార్డ్ తెదేపాకు చెందిన యువనేత నరేంద్ర, మాజీ కౌన్సిలర్ శెట్టిపల్లి మధు పార్టీకి రాజీనామా చేశారు. -
ప్రచారం ప్రారంభించిన కావలి వైకాపా ఎమ్మెల్యే
[ 28-03-2024]
కావలి నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే, రానున్న ఎన్నికల్లో వైకాపా తరఫున పోటీ చేయనున్న ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి ప్రచారం ప్రారంభించారు. -
29న కావలి, వింజమూరుల్లో చంద్రబాబు పర్యటన
[ 28-03-2024]
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా పర్యటన ఖరారైంది. ఈ నెల 29వ తేదీ కావలి, ఉదయగిరి నియోజకవర్గాల్లో రోడ్షో, బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. -
ఆ మూడే.. తుపాకులు ఇవ్వాల్సిందే
[ 28-03-2024]
ఎన్నికలు వచ్చాయంటే.. లైసెన్సు కలిగిన ప్రతి ఆయుధం పోలీసుశాఖకు అప్పగించాలన్నది నిబంధన. బ్యాంకుల భద్రత కోసం ముందస్తు అనుమతితో సెక్యూరిటీ సిబ్బంది మినహాయించి.. మిగిలిన వారంతా ఆయా స్టేషన్ల పరిధిలో వాటిని అప్పగించాల్సిందే -
అధనం.. నీదే భారం!
[ 28-03-2024]
ఎన్నికల సమయం ఎక్కువగా ఉంది. ప్రచార ఖర్చులు పెరగడంతో పాటు గెలుపోటములను ప్రభావితం చేసే కార్యకర్తలు, నాయకుల వ్యయాలను అభ్యర్థులే భరించాల్సి వస్తోంది. -
తెరచుకోని పాఠం
[ 28-03-2024]
మూలాపేటలోని రామయ్య బడి(మున్సిపల్ హైస్కూల్)లో 44 మంది విద్యార్థులు, అయిదుగురు ఉపాధ్యాయులకు ట్యాబ్లు అందించారు -
ఇద్దరు వాలంటీర్లు, క్షేత్ర సహాయకుడి తొలగింపు
[ 28-03-2024]
నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఇద్దరు గ్రామ వాలంటీర్లు, ఒక క్షేత్రసహాయకుడిని తొలగించడంతో పాటు వారిపై కేసులు నమోదు చేసినట్లు ఆర్వో ఓబులేసు తెలిపారు. -
ఓటరన్నా.. మేలుకో!
[ 28-03-2024]
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ఈనెల 16వ తేదీన విడుదలైంది. ఐదేళ్లకు ఓసారి పాలకులను ఎన్నుకునే సమయం కూడా ఆసన్నమైంది. మనం వేసే ఓటు గెలుపోటములను నిర్ణయిస్తోంది. -
జిల్లాకే తలమానికం.. పునాదులకే పరిమితం
[ 28-03-2024]
-
కన్నీటి శృతి
[ 28-03-2024]
తల్లి మరణవార్త తెలిస్తే బిడ్డ భవిష్యత్తు అంధకారమవుతుందనే ఆలోచనతో ఒక రోజంతా మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచిన హృదయ విదారక సంఘటన కందుకూరులో చోటుచేసుకుంది. -
గొంతుకోసి మహిళ హత్య
[ 28-03-2024]
మహిళను గొంతుకోసి కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన మూడో మైలులో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ
-
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
-
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!