అక్రమం చేయి తడిపితే సక్రమం
కల్తీ జరిగిందనో.. నాణ్యత లేదనో తేలితే తమ నివేదికను ఆహార తనిఖీ అధికారులకు అందజేస్తారు. దాని ఆధారంగా యంత్రాంగం సంబంధిత హోటల్ను సీజ్ చేస్తుంది.
ఆహార తనిఖీ విభాగంలో ఇంటి దొంగలు
కళ్లు మూసుకుంటున్న ఇతర విభాగాలు
సింహపురిలో నిత్యావసర సరకుల్లో కల్తీ జరిగితే ఎవరు గుర్తించాలి?
ఇంకెవరు జిల్లాలోని ఫుడ్ ఇన్స్పెక్టర్లే (ఆహార తనిఖీ అధికారులు)
మరి.. హోటళ్లలో నాణ్యత లేని ఆహార పదార్థాలను విక్రయిస్తే ఎవరు
పట్టుకోవాలి?
అడిగేదేముంది.. అదీ వారే..
తనిఖీ చేసి స్వాధీనం చేసుకున్న నమూనాలను ఎక్కడ పరీక్షిస్తారు?
హైదరాబాద్లోని ఐడీఏ నాచారంలోని రాష్ట్ర ఆహార ప్రయోగశాల(ఎస్ఎఫ్ఎల్)లో.. అక్కడ నిపుణులు రసాయన పరీక్షలు నిర్వహించి.. కల్తీ, నాణ్యతలను విశ్లేషిస్తారు. ప్రస్తుతం కొన్ని గుంటూరుకు పంపిస్తున్నారు.
కల్తీ ఉన్నట్లు తేలితే?
కల్తీ జరిగిందనో.. నాణ్యత లేదనో తేలితే తమ నివేదికను ఆహార తనిఖీ అధికారులకు అందజేస్తారు. దాని ఆధారంగా యంత్రాంగం సంబంధిత హోటల్ను సీజ్ చేస్తుంది.
ఈనాడు డిజిటల్, నెల్లూరు: నగరపాలక సంస్థ, న్యూస్టుడే అంతా బాగానే ఉంది? జిల్లాలో.. మరీ ముఖ్యంగా నెల్లూరు నగరంలో అలాంటి చర్యలు కనిపించడం లేదే? తీసుకున్నా.. ఆ ప్రభావం కనిపించడం లేదే? నకిలీ ఉత్పత్తుల కార్ఖానాలు, మాంసం దుకాణాలపై ఇటీవల నగరపాలక సంస్థ అధికారులు దాడులు చేస్తూనే ఉన్నారు. ఆ క్రమంలో అనేక సరకుల్లో బండారం బయటపడుతూనే ఉంది. మరి ఇన్నాళ్లు ఆహార తనిఖీ అధికారులు ఏం చేశారు. అడపాదడపా దాడులు చేసినా కల్తీ లేదా? నకిలీ కేంద్రాలు మూతెందుకు పడటం లేదు అంటే.. అంతా చిదంబర రహస్యం.
అనుమతుల్లోనూ అడ్డదారే!
ఆహార నియంత్రణ పరిరక్షణ ప్రమాణాల చట్టం ప్రకారం.. ఆహార పదార్థాల తయారీదారుల మొదలు వీధుల్లో అమ్మే తోపుడు బండ్ల వరకు అందరూ అనుమతి, రిజిస్ట్రేషన్ పొందాల్సిందే. రూ. 12 లక్షల లావాదేవీలు జరిగే వ్యాపార సంస్థ కేవలం.. రూ. 100 చెల్లించి అనుమతులు తీసుకోవచ్చు. రూ. 12 లక్షల నుంచి రూ. 20 కోట్ల వరకు.. రూ. 2వేల నుంచి రూ. 3వేలతో ఏడాది లైసెన్సు పొందాల్సి ఉంది. జిల్లాలో ఇలా అనుమతి పొందిన వ్యాపారుల సంఖ్య తక్కువగానే ఉంది. దీనికోసం కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని.. సంబంధిత పత్రాలు జత చేస్తే సరిపోతుంది. దీంతో అక్రమాలకు తెరలేపిన అధికారులు.. గతంలో కార్యాలయంలో పనిచేసిన పొరుగుసేవల సిబ్బందినే బినామీగా మార్చుకున్నారు. అనుమతి చేసుకునేందుకు ఎవరు వెళ్లినా.. మీరే ఆన్లైన్లో చేసుకోవచ్చని చెబుతూనే.. ఫలానా చోటకు వెళితే చేసి పెడతారని అసలు విషయం బయటపెడుతున్నారు. అతడి ఫోన్ నంబరు ఇస్తున్నారు. రూ. రెండు, మూడు వేల నుంచి రూ. 10వేల నుంచి రూ.15వేల వరకు ఇలా వసూలు చేస్తున్నారు. దీంతో తీసుకునేందుకు చాలా మంది ముందుకు వెళ్లడం లేదు.
కొత్తగా వచ్చా..తనిఖీలు చేసి చర్యలు తీసుకుంటాం
- వెంకటేశ్వరరావు, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్, నెల్లూరు
జిల్లాకు ఇటీవలే కొత్తగా వచ్చా. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలియదు. వెంటనే పరిశీలిస్తాం. అన్ని దుకాణాలను తనిఖీలు చేస్తాం. అనుమతి తీసుకోని వారిపై చర్యలు తీసుకుంటాం. అనుమతి కోసం ఎవరూ డబ్బు అదనంగా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైనా అడిగితే.. నేరుగా ఫిర్యాదు చేయండి. కఠిన చర్యలు తీసుకుంటాం.
వారే మధ్యవర్తులు
ఆహార తనిఖీ విభాగంలో పనిచేసే కొందరు ఫుడ్ ఇన్స్పెక్టర్లు, గతంలో పనిచేసిన పొరుగు సేవల సిబ్బంది హోటళ్లు, నిత్యావసర సరకుల తయారీ యూనిట్లపై దాడులు చేస్తున్నారంటేనే ఏదో మతలబు ఉండే ఉంటుందనే పరిస్థితి నెలకొంది. మూడు నెలల కిందట నగరంలోని ఓ బేకరీని తనిఖీ చేశారు. కేకులు, కుకీస్ నమూనాలు సేకరించారు. ప్రయోగశాలకు పంపగా.. నాణ్యత లేదనే విషయం రూఢీ అయింది. వాస్తవానికి నమూనాలు సేకరించేటప్పుడు నాలుగు భాగాలుగా తీసుకుంటారు. ఒక భాగాన్ని రాష్ట్ర ఆహార ప్రయోగశాలకు పంపుతారు. నాలుగో భాగాన్ని రిజర్వుగా ఉంచుతారు. ఈ క్రమంలోనే కొందరు అక్రమానికి తెరలేపుతున్నారు. తొలుత రాష్ట్ర ఆహార ప్రయోగశాలలో కల్తీగా తేలితే చాలు.. ఆ నివేదికను బూచిగా చూపి యజమానులను బుట్టలో వేసుకుంటున్నారు. హోటల్నో.. తయారీ యూనిట్లనో మూసేస్తామని బెదిరిస్తున్నారు. దాంతో గండం గట్టెక్కించేలా చేయాలని యజమానులు వీరినే ఆశ్రయిస్తుండగా- క్లీన్చిట్ ఇప్పించే బాధ్యతను వీరే తీసుకుని సొంత లాభం చూసుకుంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వెంకటేశ్వరలో టీవీఎస్ ప్రాంగణ ఎంపికలు
[ 25-04-2024]
కొడవలూరులోని వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం జరిగిన క్యాంపస్ ప్లేస్మెంట్లో 21 మంది ఎంపికయ్యారని కళాశాల ఛైర్మన్ డాక్టర్ గుణశేఖర్ తెలిపారు. -
చంద్రబాబు పాలనలో రాష్ట్ర యువతకు ఉపాధి
[ 25-04-2024]
తెదేపా అధినేత చంద్రబాబు పాలనలో రాష్ట్ర యువతకు ఉపాధి, మంచి రోజులు రానున్నాయని కోవూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థిని శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. -
గడప గడపన జగన్నాటకం!
[ 25-04-2024]
అధికారంలోకి వచ్చిన మూడేళ్లపాటు దోచుకోవడమే విధిగా వైకాపా సాగించిన పాలనతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపించడంతో ‘గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రజలను నేరుగా కలుసుకోవడం.. వారి సమస్యలను తెలుసుకోవడం.. -
జలహిత మెరుగరు? జనఘోష పట్టదు!
[ 25-04-2024]
జగన్ ప్రభుత్వ పాలనలో సహజ వనరుల దోపిడీ ఎంత విశృంకళంగా సాగిందో... జిల్లా జీవనాడిగా వినుతికెక్కిన సోమశిల జలాశయ సంరక్షణపై అంతే నిర్లక్ష్యం చూపింది. పాలనలో డొల్లతనానికి. -
వైకాపా ‘మందు’చూపు
[ 25-04-2024]
నిబంధనల ప్రకారం ఒక్కోమనిషికి మూడు సీసాలకు మించి మద్యం అమ్మకూడదు. ఒక వేళ పలుమార్లు వెళ్లి కొనుగోలు చేసినా.. పది, ఇరవైకి మించి ఉండవు. అలాంటిది.. -
కావలి సమీపంలో ఘోర ప్రమాదం
[ 25-04-2024]
వారంతా స్నేహితులు.. ఫ్యాన్సీ దుకాణంలోకి అవసరమైన ఇమిటేషన్ ఆభరణాల కొనుగోలుకు చెన్నై వెళ్లారు. అనంతరం కారులో వస్తున్నారు. అందరూ గాఢ నిద్రలోకి జారుకున్నారు. -
ఎన్నికల సందేహాలా.. కాల్ చేయండి
[ 25-04-2024]
ఎన్నికలకు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా నివృత్తి చేసుకోవచ్చని జిల్లా పోలీసు పరిశీలకులు అశోక్ టి దుధే ఒక ప్రకటనలో తెలిపారు. -
మే 2 నుంచి ఓటరు సమాచార స్లిప్పులు
[ 25-04-2024]
మే నెల రెండు నుంచి ఎనిమిదో తేదీ వరకు ఓటరు సమాచార స్లిప్పులు పంపిణీ చేయాలని కలెక్టర్ ఎం.హరినారాయణన్ అధికారులకు సూచించారు. -
తాగునీటి సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూమ్
[ 25-04-2024]
జిల్లాలో తాగునీటి సమస్యలు పరిష్కరించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఎం.హరినారాయణన్ ప్రకటనలో తెలిపారు. -
సర్వేపల్లిలో ప్రతిఘటనకు సిద్ధం
[ 25-04-2024]
సర్వేపల్లిలో మంత్రి కాకాణి ఆగడాలను ప్రతిఘటించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అన్నారు. వెంకటాచలంలో బుధవారం నామినేషన్ దాఖలు అనంతరం మాట్లాడారు. -
ప్రభుత్వం చెంతే ప్రతిపాదనలు
[ 25-04-2024]
ఎలాంటి విపత్తు ఎదురైనా ముందు గుర్తుకొచ్చేది అగ్నిమాపకశాఖ.. ఆ శాఖనే ప్రభుత్వం పట్టించుకుకోలేదు. వేసవిలో పెద్దసంఖ్యలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటుంటాయి. -
జగనన్న ఇల్లు.. రాలేదన్నా!
[ 25-04-2024]
నవరత్నాలు.. పేదలందరికీ ఇళ్లు. ఇదీ ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీ. ఇందుకు జగనన్న కాలనీలు నిర్మిస్తున్నామని ఘనంగా ప్రకటించారు. అధికారంలోకి వచ్చి అయిదేళ్లయింది. ఈ హామీ అమలుకాలేదు. -
దక్షిణ బజారు.. సమస్యలతో బేజారు
[ 25-04-2024]
పట్టణంలోని ప్రధాన కాలనీల్లోనూ మౌలిక వసతుల సమస్యలు స్థానికులను వేధిస్తున్నాయి. గత నాలుగేళ్లుగా మున్సిపాలిటీ అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదనేందుకు ఆయా... -
గుంతల రోడ్లు... పూడిన కాలువలు
[ 25-04-2024]
షబ్బీర్ కాలనీలో సీసీ రోడ్లు రాళ్లు తేలడటంతో చీకటిలో నడవాలంటే ఎక్కడ అదుపుతప్పి పడిపోతామోనని ఆందోళన చెందుతున్నారు. మురుగు కాలువలు చెత్తతో నిండినా సిబ్బంది శుభ్రం చేయటంలేదని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!