ప్రభుత్వ తీరుతో ఆక్వా రంగం కుదేలు
రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో ఆక్వా రంగం సంక్షోభంలో చిక్కుకుందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
కోడూరులో ర్యాలీ నిర్వహిస్తున్న మాజీ మంత్రి సోమిరెడ్డి, బీద రవిచంద్ర, అబ్దుల్ అజీజ్, పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి తదితరులు
కోడూరు (తోటపల్లిగూడూరు), న్యూస్టుడే: రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో ఆక్వా రంగం సంక్షోభంలో చిక్కుకుందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మండలంలోని కోడూరులో శనివారం ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. మహాలక్ష్మీపురం కూడలి నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగసభలో సోమిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. దేశంలో 65 శాతం ఆంధ్రప్రదేశ్ నుంచే ఆక్వా సాగు జరుగుతోందన్నారు. రొయ్యల రైతులకు కనీస గిట్టుబాటు ధర లేదన్నారు. ఒక మద్యం సీసా కొనుగోలు చేస్తే రూ.5 జగన్ జేబులోకి వెళుతోందని ఆరోపించారు. మంత్రులకు బొజ్జలు పెరుగుతుంటే.. రైతుల డొక్కలు ఎండుతున్నాయని విమర్శించారు. వైకాపా పాలనలో వరి, ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. తెదేపా ప్రభుత్వంలో ఎలాంటి షరతులు లేకుండా ఉచితంగా విద్యుత్తు ఇచ్చిన ఘనత చంద్రబాబునాయుడుదేనన్నారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర మాట్లాడుతూ.. రైతులను వెంటబెట్టుకుని వారి సమస్యలపై ముఖ్యమంత్రికి అర్జీ ఇచ్చే ఒక్క ప్రజాప్రతినిధి జిల్లాలో ఉన్నారా? అని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు చేసిన గోతాల డబ్బులు వైకాపా నాయకుల ఇళ్లకు చేరుతున్నాయని ఆరోపించారు. కార్యక్రమంలో నెల్లూరు పార్టమెంట్ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు అజీజ్, తెదేపా రాష్ట్ర కార్యదర్శి బొమ్మి సురేంద్ర, ఆఫ్కాబ్ మాజీ ఛైర్మన్ పొలిసెట్టి, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా రైతు సంఘం అధ్యక్షుడు రాధాకృష్ణనాయుడు, శ్రీనివాసులురెడ్డి, మండల తెదేపా అధ్యక్షుడు సురేష్రెడ్డి, సాగునీటి సంఘం మాజీ అధ్యక్షుడు గంగాధర్ పాల్గొన్నారు.
మాజీ మంత్రి సోమిరెడ్డి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు: మధ్యప్రదేశ్ సీఎం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!