ఆ భవనంపై.. కోట్లాట!
నగరంలోని మినీబైపాసులో ఇటీవల ప్రారంభమైన ఓ భవనం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఉల్లంఘన నిర్మాణాలపై ప్రజాప్రతినిధుల దందా
మూమూళ్ల మత్తులో అధికారులు
ఈనాడు డిజిటల్, నెల్లూరు
నగరంలోని మినీబైపాసులో ఇటీవల ప్రారంభమైన ఓ భవనం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనికి అధికార పార్టీలోని ఓ వర్గం అండగా ఉండగా.. భవన ప్రారంభ సమయంలో ఆహ్వానం లేకపోవడంతో గుర్రుగా చూస్తున్న మరో వర్గం ఆ కట్టడం అనుమతులు, నిబంధనలను తుంగలో తొక్కిన వైనంపై దృష్టిసారించింది. అడ్డగోలుగా నిర్మించిన ఈ భవనం వైపు నగరపాలక సంస్థ అధికారులు దృష్టిసారించక పోవడం గమనార్హం. భవన నిర్మాణం మొదలుకొని.. నిబంధల అతిక్రమణ వరకు రూ.కోటి వరకు చేతులు మారినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నెల్లూరు నగరంలోని మినీబైపాస్లో ఇటీవల ప్రారంభమైన వాణిజ్య భవనం కనీస నిబంధనలు పాటించకుండా.. ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతూ.. నిర్మించినా నగరపాలక సంస్థ అధికారులు కళ్లు మూసుకున్నారు. సాధారణంగా 600 గజాల కన్నా ఎక్కువ స్థలంలో కట్టే భవనానికి జీ+4 నిర్మించేందుకు అనుమతి ఇస్తారు. ఇక్కడ ఏకంగా జీ+7 నిర్మించారు. వాణిజ్య భవనం కావడంతో దాదాపు 33 శాతం పార్కింగ్ స్థలం ఉండేలా నిర్మాణం చేయాలి. భవన నిర్మాణానికి అన్ని వైపులా ప్రభుత్వ నిబంధనల ప్రకారం సెట్బ్యాక్లను వదలాల్సి ఉన్నా ఇరువైపులా కనీసం సెంటీమీటరు స్థలం వదలకుండా నిర్మించారు. భవనంలో ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే కనీసం చుట్టూ అగ్నిమాపక వాహనం తిరిగేందుకు వీల్లేకుండా ఉంది. కనీసం వినియోగదారులు వాహనాలు నిలిపేందుకు చోటు లేకపోవడం గమనార్హం. దీనిపై అధికారులను వివరణ అడిగితే.. మాకేం తెలియదని చెప్పడం గమనార్హం.
వైకాపాలో కుంపటి
నెల్లూరులోని అధికార పార్టీలో మరోసారి ముసలం ప్రారంభమైంది. అక్రమ భవనం ప్రారంభం కొత్త కుంపటి పెట్టింది. ఈ కార్యక్రమానికి కొందరిని పిలిచి.. మరికొందరిని దూరంగా ఉంచడంపై తీవ్ర చర్చ నడుస్తోంది. దాంతో మరో వర్గం అందులో లోపాలను వెతికే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం. ఇప్పటికే ఆ భవనం నిర్మాణంపై అభ్యంతరాలు తెలుపుతూ.. పక్క స్థలం వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని కార్పొరేషన్ అధికారులకు నోటీసులు జారీ చేసింది.
రూ.కోటి డీల్
నగరపాలక సంస్థ ఆదాయ వనరులను కాపాడాల్సిన కొందరు నాయకులు కంచె చేను మేసిన చందంగా అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. వారితో పాటు.. అనుచరులూ ఇటీవల కాలంలో అక్రమ కట్టడాలనే ప్రధాన ఆదాయ వనరులుగా ఎంచుకున్నారు. ఈ విషయంలో తమకు సహకరించని అధికారులపై వేటు వేసేందుకు వెనకాడటం లేదు. నగరంలోని మినీ బైపాసు వద్ద నిర్మించిన ఓ వాణిజ్య భవనం విషయంలోనూ ఇదే జరిగింది. గ్రామీణ నియోజకవర్గంలోని ప్రముఖ వైకాపా నాయకుడు ఈ వ్యవహారంలో రూ.కోటి చెల్లించేలా డీల్ చేసుకున్నట్లు సమాచారం. ఇందులో కార్పొరేషన్లోని ఓ ఉన్నతాధికారికి అటువైపు చూడకుండా ఉండేందుకు రూ.10 లక్షలు, ఇతర శాఖలకు కొంత మొత్తాన్ని పంచినట్లు ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. కనీసం అక్కడకు వచ్చే వినియోగదారుల భద్రతను గాలికొదిలేశారు. రూ.కోట్లు ఆదాయం కోల్పోయినా.. ప్రజల ప్రాణాలకు ముప్పు ఉన్నా.. పట్టించుకోకుండా అక్రమార్కులను ప్రోత్సహించిన తీరును నగరవాసులు తప్పు పడుతున్నారు. ఒక్క భవనంలోనే ఇంత మొత్తం చేతులు మారితే.. నగరంలో నిర్మాణమయ్యే భవనాలకు ఇంకా ఎంత దోచుకుంటున్నారనేది నగరంలో చర్చనీయాంశమైంది.
నాకేం తెలియదు : - హరిత, కమిషనర్, నగరపాలక సంస్థ
కొత్తగా నిర్మించిన ఆ భవనంపై నాకు ఎలాంటి సమాచారం తెలియదు. నేను రాక ముందు దానికి అనుమతి ఇచ్చారు. నేను దాన్ని పరిశీలించలేదు. ఏం ప్లాన్ తీసుకున్నారో కూడా తెలియదు. పరిశీలించి అక్రమ కట్టడమని తేలితే తగు చర్యలు తీసుకుంటాం.
డీజీ ఎన్వోసీ ఇచ్చారు
రెండేళ్ల నుంచి భవనాలకు సంబంధించి అగ్నిమాపక అనుమతులన్నీ ఆన్లైన్లో ఇస్తున్నారు. నూతన భవనానికి సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. వారికి గతంలో ఉన్న అగ్నిమాపక శాఖ డీజీ ఎన్వోసీ ఇచ్చారు. దాని ప్రకారం పరికరాలు అమర్చారు. అంత కన్నా నాకేం తెలియదు.
శ్రీకాంత్రెడ్డి, జిల్లా అగ్నిమాపక అధికారి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వెంకటేశ్వరలో టీవీఎస్ ప్రాంగణ ఎంపికలు
[ 25-04-2024]
కొడవలూరులోని వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం జరిగిన క్యాంపస్ ప్లేస్మెంట్లో 21 మంది ఎంపికయ్యారని కళాశాల ఛైర్మన్ డాక్టర్ గుణశేఖర్ తెలిపారు. -
చంద్రబాబు పాలనలో రాష్ట్ర యువతకు ఉపాధి
[ 25-04-2024]
తెదేపా అధినేత చంద్రబాబు పాలనలో రాష్ట్ర యువతకు ఉపాధి, మంచి రోజులు రానున్నాయని కోవూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థిని శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. -
గడప గడపన జగన్నాటకం!
[ 25-04-2024]
అధికారంలోకి వచ్చిన మూడేళ్లపాటు దోచుకోవడమే విధిగా వైకాపా సాగించిన పాలనతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపించడంతో ‘గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రజలను నేరుగా కలుసుకోవడం.. వారి సమస్యలను తెలుసుకోవడం.. -
జలహిత మెరుగరు? జనఘోష పట్టదు!
[ 25-04-2024]
జగన్ ప్రభుత్వ పాలనలో సహజ వనరుల దోపిడీ ఎంత విశృంకళంగా సాగిందో... జిల్లా జీవనాడిగా వినుతికెక్కిన సోమశిల జలాశయ సంరక్షణపై అంతే నిర్లక్ష్యం చూపింది. పాలనలో డొల్లతనానికి. -
వైకాపా ‘మందు’చూపు
[ 25-04-2024]
నిబంధనల ప్రకారం ఒక్కోమనిషికి మూడు సీసాలకు మించి మద్యం అమ్మకూడదు. ఒక వేళ పలుమార్లు వెళ్లి కొనుగోలు చేసినా.. పది, ఇరవైకి మించి ఉండవు. అలాంటిది.. -
కావలి సమీపంలో ఘోర ప్రమాదం
[ 25-04-2024]
వారంతా స్నేహితులు.. ఫ్యాన్సీ దుకాణంలోకి అవసరమైన ఇమిటేషన్ ఆభరణాల కొనుగోలుకు చెన్నై వెళ్లారు. అనంతరం కారులో వస్తున్నారు. అందరూ గాఢ నిద్రలోకి జారుకున్నారు. -
ఎన్నికల సందేహాలా.. కాల్ చేయండి
[ 25-04-2024]
ఎన్నికలకు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా నివృత్తి చేసుకోవచ్చని జిల్లా పోలీసు పరిశీలకులు అశోక్ టి దుధే ఒక ప్రకటనలో తెలిపారు. -
మే 2 నుంచి ఓటరు సమాచార స్లిప్పులు
[ 25-04-2024]
మే నెల రెండు నుంచి ఎనిమిదో తేదీ వరకు ఓటరు సమాచార స్లిప్పులు పంపిణీ చేయాలని కలెక్టర్ ఎం.హరినారాయణన్ అధికారులకు సూచించారు. -
తాగునీటి సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూమ్
[ 25-04-2024]
జిల్లాలో తాగునీటి సమస్యలు పరిష్కరించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఎం.హరినారాయణన్ ప్రకటనలో తెలిపారు. -
సర్వేపల్లిలో ప్రతిఘటనకు సిద్ధం
[ 25-04-2024]
సర్వేపల్లిలో మంత్రి కాకాణి ఆగడాలను ప్రతిఘటించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అన్నారు. వెంకటాచలంలో బుధవారం నామినేషన్ దాఖలు అనంతరం మాట్లాడారు. -
ప్రభుత్వం చెంతే ప్రతిపాదనలు
[ 25-04-2024]
ఎలాంటి విపత్తు ఎదురైనా ముందు గుర్తుకొచ్చేది అగ్నిమాపకశాఖ.. ఆ శాఖనే ప్రభుత్వం పట్టించుకుకోలేదు. వేసవిలో పెద్దసంఖ్యలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటుంటాయి. -
జగనన్న ఇల్లు.. రాలేదన్నా!
[ 25-04-2024]
నవరత్నాలు.. పేదలందరికీ ఇళ్లు. ఇదీ ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీ. ఇందుకు జగనన్న కాలనీలు నిర్మిస్తున్నామని ఘనంగా ప్రకటించారు. అధికారంలోకి వచ్చి అయిదేళ్లయింది. ఈ హామీ అమలుకాలేదు. -
దక్షిణ బజారు.. సమస్యలతో బేజారు
[ 25-04-2024]
పట్టణంలోని ప్రధాన కాలనీల్లోనూ మౌలిక వసతుల సమస్యలు స్థానికులను వేధిస్తున్నాయి. గత నాలుగేళ్లుగా మున్సిపాలిటీ అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదనేందుకు ఆయా... -
గుంతల రోడ్లు... పూడిన కాలువలు
[ 25-04-2024]
షబ్బీర్ కాలనీలో సీసీ రోడ్లు రాళ్లు తేలడటంతో చీకటిలో నడవాలంటే ఎక్కడ అదుపుతప్పి పడిపోతామోనని ఆందోళన చెందుతున్నారు. మురుగు కాలువలు చెత్తతో నిండినా సిబ్బంది శుభ్రం చేయటంలేదని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!