కుటుంబ మ్యాపింగ్లో.. సవరణలకు అవకాశం
సంక్షేమ పథకాలకు కీలకమైన కుటుంబ మ్యాపింగ్(హౌస్ హోల్డ్ మ్యాపింగ్)లో మార్పులు, చేర్పులకు ప్రభుత్వం అవకాశం కల్పించింది.
కందుకూరు పట్టణం, న్యూస్టుడే: సంక్షేమ పథకాలకు కీలకమైన కుటుంబ మ్యాపింగ్(హౌస్ హోల్డ్ మ్యాపింగ్)లో మార్పులు, చేర్పులకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. కుమారుడు, కుమార్తె వివాహమై వేరుగా ఉంటున్నా.. తల్లిదండ్రులతో పాటు వారినీ ఒకే కుటుంబంగా భావిస్తూ.. ఇప్పటి వరకు లబ్ధిదారులను ఎంపిక చేశారు. ప్రభుత్వం ఆరంచెల విచారణలో (6 స్టెప్ వాలిడేషన్) భాగంగా కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరి పేరున ఆస్తులు, వాహనాలు ఉన్నాయన్న కారణాలతో కొందరిని పథకాలకు అనర్హులుగా ప్రకటించారు. అలాంటి వారందరికీ ఊరటనిచ్చేలా సవరణలకు అవకాశం కల్పిస్తూ సచివాలయాలకు తాజాగా ఆదేశాలు జారీ చేసింది.
2019లో సర్వే..
రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో కుటుంబ మ్యాపింగ్ విధానాన్ని పాటిస్తోంది. దాని ఆధారంగానే పింఛను, వైఎస్సార్ చేయూత, విద్యా, వసతి దీవెనలు, ఆసరా, అమ్మఒడి, వాహనమిత్ర తదితరాలకు లబ్ధిదారులను ఎంపిక చేస్తోంది. గత తెదేపా ప్రభుత్వ హయాంలో ప్రజాసాధికార సర్వే పేరుతో కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేశారు. 2019లో వైకాపా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత. వాలంటీర్లు, సచివాలయ సిబ్బందితో సర్వే చేసి (హౌస్ హోల్డ్ మ్యాపింగ్) కుటుంబ సభ్యుల వివరాలు సేకరించి.. వారంతా ఓ కుటుంబంలా నమోదు చేశారు. కుమారుడు, కుమార్తెలకు పెళ్లిళ్లయి.. వేరుగా ఉంటూ.. రేషన్, బియ్యం కార్డులు వేర్వేరుగా ఉన్నా.. వారంతా ఒకే ఇంట్లో నివాసం ఉండటంతో ఒకే కుటుంబంలా భావించి మ్యాపింగ్ చేశారు. ఇతర ప్రాంతాల్లో ఉంటున్న కుటుంబ సభ్యులనూ ఆయా కుటుంబాల్లోనే కలిపారు. ఆ తర్వాత మార్పులు చేర్పులకు అవకాశం ఇవ్వకపోవడంతో సమస్యలు మొదలయ్యాయి. కుటుంబ సభ్యుల పేరుతో నాలుగు చక్రాల వాహనం ఉందని.. ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారని, ఇంటి స్థలం ఎక్కువ, విద్యుత్తు బిల్లు అధికంగా వినియోగిస్తున్నారంటూ.. కుటుంబంలో సంక్షేమ పథకాలు పొందుతున్న వారిని అనర్హులుగా ప్రకటించి లబ్ధి నిలిపివేశారు. కొత్తగా ఉద్యోగాలు సాధించిన సచివాలయ ఉద్యోగుల తల్లిదండ్రులకూ సమస్యలు వచ్చాయి. ఆ క్రమంలో మ్యాపింగ్లో సవరణలకు అవకాశం కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారు.
సచివాలయాలను సంప్రదించాలి
- ఎస్.మనోహర్, మున్సిపల్ కమిషనర్
కుటుంబ మ్యాపింగ్లో మార్పులు, చేర్పులు చేసుకునేందుకు సచివాలయాలను సంప్రదించాలి. వివాహమైన వారు భర్త కుటుంబంలోకి వెళ్లాలన్నా.. వేరుగా మ్యాపింగ్ చేయించుకోవాలన్నా.. వివాహ ధ్రువీకరణ పత్రం సమర్పించి మార్పులు చేయించుకోవచ్చు. ప్రభుత్వం సూచించిన ఆరు పత్రాల్లో.. ఏదో ఒకటి సమర్పించి సవరణలు చేయించుకోవాలి. లబ్ధిదారుల ఎంపికకు కుటుంబ మ్యాపింగ్ కీలకం. అందరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
పదివేల కుటుంబాలకు ప్రయోజనం
జిల్లాలో సుమారు 6వేల మందికి పైగా సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. వీరిలో అధిక శాతం మందికి వివాహాలై వేరుగా ఉంటున్నా.. వారి తల్లిదండ్రులు, సోదరులకు పథకాలు నిలిచిపోయాయి. కుమార్తెకు పెళ్లి అయి అత్తవారింటికి వెళ్లినా.. తల్లిదండ్రులకు రేషన్కార్డు, పింఛన్లు నిలిచిపోయాయి. అలాంటి వారు ప్రస్తుతం భర్త కుటుంబంలో మ్యాపింగ్ చేయించుకునే అవకాశంతో పాటు దస్త్రాలపరంగా తల్లిదండ్రుల కుటుంబం నుంచి బయటకు వచ్చే అవకాశం లభించింది. ప్రస్తుత సవరణల వల్ల జిల్లా వ్యాప్తంగా పది వేలపైగా కుటుంబాలకు మేలు జరగనుంది. భర్తనో, భార్యనో మృతి చెంది.. పిల్లలకు దూరంగా ఉంటున్న వారిని సింగిల్ మ్యాపింగ్ చేయడంతో పాటు మృతులను తొలగించేలా అవకాశం ఇవ్వాలని పలువురు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అడ్డగోలు పోస్టులు పెడితే ఇబ్బందే
[ 20-04-2024]
చేతిలో చరవాణి ఉందని ఇష్టానుసారం పోస్టులు పెడితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రత్యర్థులపై పోస్టులు పెట్టడం.. సామాజిక వర్గాలను కించపరచడం... -
బాబు సీఎం అయ్యే వరకు పాదరక్షలు ధరించనని..!
[ 20-04-2024]
చంద్రబాబు సీఎం అయ్యే వరకు చెప్పులు వేసుకోనని దగదర్తి మండలంలోని కాట్రాయపాడుకు చెందిన తాళ్లూరు సుధాకర్నాయుడు ప్రతిన బూనారు. -
‘నీరో’ల పాలన
[ 20-04-2024]
ప్రజలకు సురక్షిత తాగునీరు అందించేందుకు తెలుగుదేశం ప్రభుత్వం 2018లో ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం తీసుకొచ్చింది. జిల్లా వ్యాప్తంగా శుద్ధజల కేంద్రాలను నిర్మించింది. -
జగన్ జమానాలో పప్పన్నం కష్టమే!
[ 20-04-2024]
‘2019 ఎన్నికల ముందు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో ఊరూరా తిరిగిన జగన్మోహన్రెడ్డి.. రేషన్ దుకాణాల్లో నిత్యావసర సరకులే దొరకడం లేదంటూ ప్రతిపక్షాలను తీవ్రంగా విమర్శించారు. -
నేడు పొదలకూరులో ప్రజాగళం
[ 20-04-2024]
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరులో జరిగే ప్రజాగళం సభలో పాల్గొననున్నారు. -
నిమ్మ రైతుకు జగన్ దగా
[ 20-04-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో హామీలే తప్ప వాటి అమలుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మెట్టప్రాం తం కావడంతో ఎక్కువ మంది వర్షాధారిత పంటలపైనే ఆధారపడి జీవిస్తున్నారు.. -
ఉత్తర కాలువపై ఉత్తుత్తి హామీ
[ 20-04-2024]
అయిదేళ్లయింది. ఇప్పటి వరకు హామీ నెరవేర్చేందుకు చేసిన కృషి ఏమీ లేదు. ఆయకట్టు రైతులకు చేకూరిన ప్రయోజనమూ ఏమీలేదు. -
రెండో రోజు ఎనిమిది నామినేషన్లు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా 8 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు. -
మాటలే.. పనుల్లేవ్!
[ 20-04-2024]
పట్టణంలో ప్రధానమైన ట్రంకురోడ్డు అభివృద్ధి చేస్తామని సీఎం జగన్, ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి పలుమార్లు హామీలు ఇచ్చారు. -
సర్పంచుల ఒత్తిడితోనే ఆర్థిక సంఘం నిధుల విడుదల
[ 20-04-2024]
రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసిన తరువాత రూ.988 కోట్లు విడుదల అయ్యాయని సర్పంచుల సంఘం కార్యనిర్వాహక కార్యదర్శి నాగేంద్ర ప్రసాద్ రెడ్డి తెలిపారు. -
ఆర్ఐ రోడ్డుకు జగన్ పోటు
[ 20-04-2024]
తీరంలో నాలుగు మండలాల ప్రజలు రాకపోకలు సాగించే ప్రధాన రహదారిపై ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించింది. -
పల్లె పాలనకు వైకాపా గ్రహణం
[ 20-04-2024]
వింజమూరు రవి పాఠశాల నుంచి నడిమూరు దేవతమహల్ సెంటర్ వరకు కాలువల్లో పూడిక పేరుకుపోయింది. -
తనిఖీలు విస్తృతం చేయండి: కలెక్టర్
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా సరిహద్దులు, ఇతర ప్రధాన మార్గాల్లో ఏర్పాటు చేసిన చెక్పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.హరినారాయణన్ అధికారులను ఆదేశించారు. -
కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి కుటుంబం ఆస్తి రూ.2.45 కోట్లు
[ 20-04-2024]
నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం తెదేపా అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి కుటుంబం ఆస్తుల విలువ రూ.2.45 కోట్లుగా అఫిడవిట్లో చూపించారు. -
అభ్యర్థుల వ్యయాలపై దృష్టి
[ 20-04-2024]
ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఖర్చులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నెల్లూరు పార్లమెంటు వ్యయ పరిశీలకులు జి.ప్రసాద్ దత్తాత్రేయ పేర్కొన్నారు. -
నామపత్రాల ధరావతు ఎందుకు పెంచారంటే..
[ 20-04-2024]
ఎన్నికల్లో పోటీ చేయాలంటే ముందుగా అభ్యర్థులు నామినేషన్లు వేయాల్సి ఉంటుంది.
తాజా వార్తలు (Latest News)
-
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
-
నిషేధమెక్కడ.. ‘నిషా’దమే.. రక్త మాంసాలతో జగన్ వ్యాపారం
-
పనసపండు గుర్తు ఎక్కడ?.. గందరగోళానికి గురైన ఓటర్లు
-
బాబు సీఎం అయ్యే వరకు పాదరక్షలు ధరించనని..!
-
బస్సులు జగన్ సభకు.. కష్టాలు ప్రయాణికులకు
-
వైకాపా నేతల సిఫార్సులతో పోస్టు.. మహిళా ఉద్యోగినులతో వెకిలి చేష్టలు