పర్యాటకం కునారిల్లి.. ఆహ్లాదం ఆవిరి
జిల్లాలో ప్రభుత్వ నిర్లక్ష్యంతో పర్యాటకం కునారిల్లుతోంది. పర్యాటక, దర్శనీయ, ఆహ్లాదం పంచే స్థలాల్లో వసతులు, సౌకర్యాలు సరిగాలేవు.
న్యూస్టుడే, కోవూరు
రామతీర్థంలో శిథిలమైన గదులు
జిల్లాలో ప్రభుత్వ నిర్లక్ష్యంతో పర్యాటకం కునారిల్లుతోంది. పర్యాటక, దర్శనీయ, ఆహ్లాదం పంచే స్థలాల్లో వసతులు, సౌకర్యాలు సరిగాలేవు. నిధుల్లేక ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఇందుకూరుపేట మండలంలోని మైపాడు బీచ్ వద్ద మౌలిక వసతులు కల్పించలేదు. కనీసం రహదారి సౌకర్యం లేదు. విడవలూరు మండలంలోని రామతీర్థంలో మరుగుదొడ్లు లేవు. తాగునీటి వసతి లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక్కడ కొన్ని గదులు నిర్మించి వదలేశారు. కొడవలూరు మండలంలోని జాతీయ రహదారి నుంచి నాయుడుపాళెం మీదుగా రామతీర్థంకు గతంలో ఉన్న రహదారి ధ్వంసమైంది. బుచ్చిరెడ్డిపాళెం మండలంలోని వవ్వేరు వద్ద కాటన్దొర నిర్మించిన కనిగిరి రిజర్వాయర్ ప్రాంగణంలో గదులు, బల్లలు శిథిలమవడంతో పర్యాటకులకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. ఇక్కడి రహదారి పూర్తిగా ధ్వంసమైంది. కోవూరు మండలం పాటూరులో.. విడవలూరు మండలం తుమ్మగుంట అయ్యప్ప ఆలయం వద్ద సౌకర్యాలు కల్పించాలి.
పర్యాటక అభివృద్ధి ప్రకటనలకే పరిమితం
పడిపోయిన కట్టడాలతో అస్తవ్యస్తంగా ఉన్న రంగనాయకులస్వామి ఆలయ ప్రాంగణం
ఉదయగిరి: ప్రభుత్వాలు మారిపోతున్నా.. ఉదయగిరి పర్యాటక అభివృద్ధి ప్రకటనలకే పరిమితమైంది. ఎన్నికలప్పుడు, సందర్భం వచ్చిన సమయంలో ఉదయగిరి దుర్గాన్ని పర్యాటక ప్రాంతం చేస్తామంటూ హామీలు గుప్పిస్తున్న పాలకులు, అధికారుల మాటలు నీటి మీద రాతలుగానే మిగిలిపోతున్నాయి. రాజులు, నవాబులు, ఆంగ్లేయుల పాలన వైభవానికి ప్రతీకగా.. చక్కటి పచ్చదనం, ఎత్తైన కొండ శిఖరాలతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తూ చూపరులను ఆకట్టుకుంది ఈ దుర్గం. శ్రీకృష్ణదేవరాయలు పాలనలో విజయనగర సామ్రాజ్యానికి సింహద్వారంగా కొనసాగింది. ఉదయగిరి వీధుల్లో రత్నాలు రాశులుగా పోసి అమ్మారని ఇప్పటికీ పెద్దలు కథలు చెబుతుంటారు. అలనాటి రాజులు, నవాబుల కాలంలో మనస్సు దోచే శిల్పకళా నైపుణ్యంతో నిర్మితమైన అనేక కట్టడాలు కాలగర్భంలో కలిసిపోగా కొన్ని మాత్రం తీపిగుర్తుగా శిథిలావస్థకు చేరి దర్శనమిస్తున్నాయి. సరైన వసతుల్లేక ఆ వైపుగా అభివృద్ధి లేకపోవడంతో దుర్గం పర్యాటక అభివృద్ధి అనాదిగా హామీలు, ప్రకటనలకే పరిమితమైపోతుంది. పర్యాటకంగా అభివృద్ధి చేస్తే ఫలితం ఉంటుంది.
కండలేరు జలాశయం
రాపూరు: జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన రాపూరు మండలం కండలేరు, పెంచలకోన ప్రాంతాలను కిరణ్కుమార్రెడ్డి ప్రభుత్వం పర్యాటక ప్రాంతాలుగా ప్రకటించింది. కానీ, 12ఏళ్లు దాటినా ఈ పర్యాటక ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో అభివృద్ధి పనులు జరగలేదు. పర్యాటకులకు అవసరమైన వసతులూ కొరవడ్డాయి. కండలేరులో బోటు షికారు, విశ్రాంతి గదులు ఏర్పాటు చేస్తే పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని స్థానికులంటున్నారు. ఏడాది పొడవునా లక్షల సంఖ్యలో భక్తులు, కోట్లలో ఆదాయం ఉన్న పెంచలకోన పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తుంటారు. ఇంత ప్రాధాన్యత ఉన్నందున దీన్ని టూరిజం కేంద్రంగా గుర్తించడం జరిగింది. బ్రహ్మోత్సవాల సమయంలో నెల్లూరు జిల్లా నుంచే కాకుండా కడప, ప్రకాశం, చిత్తూరు ఉమ్మడి జిల్లాలతోపాటు తమిళనాడు, కర్నాటక రాష్ట్రాట నుంచి కూడా భక్తులు వస్తుంటారు. ఇక్కడ వర్షాలు వస్తే కొండల నుంచి జలపాతం వస్తుంటుంది. దీన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. దీంతో ఆలయం దగ్గర నుంచి జలపాతం వరకు రహదారి సౌకర్యం, టూరిజం రెస్టారెంట్తోపాటు, సరిపడా అతిథి గృహాలు, వర్షాలు వచ్చినప్పుడు భక్తులు తలదాచుకునేందుకు గుడికి సమీపంలో యాత్రికుల హాల్స్, ఇంకా గదులు దొరకని భక్తులకు లాకర్ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తే పెంచలకోన పుణ్యక్షేత్రం స్థాయిలో ప్రసిద్ధి టూరిజంగా అభివృద్ధి చెందుతుందని స్థానికులంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెక్పోస్టులను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
[ 18-04-2024]
జిల్లాలో ఎస్పీ కె.ఆరీఫ్ నైట్ బీట్, చెక్పోస్టులను తనిఖీ చేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రత దృష్యా బీవీ నగర్ పరిధిలోని నైట్బీట్లను తనిఖీ చేసి, గస్తీ ఎలా ఉందో పర్యవేక్షించారు. -
వైకాపాకు షాక్.. తెదేపాలో చేరిన కీలక నేతలు
[ 18-04-2024]
తెదేపాలో చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నవేళ డివిజన్లలో అత్యంత కీలకంగా పనిచేస్తున్న ముఖ్య నాయకులు వైకాపాను వీడి తెదేపాలో చేరుతున్నారు. -
జగదభిరామ.. జానకిరామ
[ 18-04-2024]
జిల్లా వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలను ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. నెల్లూరు దర్గామిట్టలోని శబరి శ్రీరామక్షేత్రం ఆధ్వర్యంలో బుధవారం శ్రీరామ స్థూపం ప్రాంగణంలో వేలాది మంది సమక్షంలో సీతారాముల కల్యాణోత్సవం నిర్వహించారు. -
20న సర్వేపల్లికి చంద్రబాబు రాక
[ 18-04-2024]
ప్రజాగళం పర్యటనలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు జిల్లాకు రానున్నారు. ఈ నెల 20వ తేదీ శనివారం మధ్యాహ్నం 3 గంటలకు సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరులో జరిగే సమావేశంలో పాల్గొననున్నారు. -
జిల్లాకు చేరుకున్న వ్యయ పరిశీలకులు
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల వ్యయ పరిశీలకులుగా నియమితులైన జ్యోతిమోయ్ బయ్లంగ్, కంచన్ రామ్ మీనా నెల్లూరుకు విచ్చేశారు. బుధవారం రాత్రి నగరంలోని ఓ హోటల్కు చేరుకున్నారు. -
పరిశ్రమలేమోగానీ.. తిప్పలు గుల్ల
[ 18-04-2024]
ఆత్మకూరు పారిశ్రామిక వాడలో పరిశ్రమల మాటేమోగానీ.. అది వైకాపా మట్టి మాఫియాకు కాసుల పంట పండిస్తోంది. ప్రస్తుతం ఇక్కడ రూ. 23.4 కోట్లతో రెండో విడత అభివృద్ధి పనులు చేపడుతున్నారు. -
అధికార అహం.. అరాచక పర్వం!
[ 18-04-2024]
వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో అరాచకాలు, ఆగడాలు నిత్యకృత్యమయ్యాయి. దౌర్జన్యాలు, దాడులు, వేధింపులు సర్వసాధారణంగా మారాయి. అధికార పార్టీ నేతలన్న అహంతో కొందరు వైకాపా నాయకులు చెలరేగిపోగా- వారి దందాలు, దౌర్జన్యాలకు కొందరు అమాయకులు బలైపోయారు. -
నామినేషన్లకు వేళాయే
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాలో ఒక లోక్సభ స్థానంతో పాటు ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు నోటిఫికేషన్ వెలువడనుంది. -
పోలీస్ బందోబస్తు
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ పర్యవేక్షణలో జిల్లా పోలీసు యంత్రాంగం నామినేషన్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. -
రైతు జపం.. ఏదో నెపం
[ 18-04-2024]
కౌలు రైతులకు కొత్త చట్టం తెచ్చామని జగన్మోహన్రెడ్డి చెబుతున్నా.. భూ యజమాని అంగీకారం లేనిదే సాగుదారు హక్కుపత్రాలు లభించని పరిస్థితి క్షేత్రస్థాయిలో కనిపిస్తోంది. -
కడలికి తూట్లు.. అక్రమార్కులకు కాసులు
[ 18-04-2024]
ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చింది. సహజ వనరులను ఇతర ప్రాంతాలకు తరలించడానికి వీల్లేదు. కానీ కొందరు సముద్రపు ఇసుకను తీసుకొచ్చి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. -
బేల్దారీ బేజారు
[ 18-04-2024]
భవన నిర్మాణ సామగ్రి ధరలు అసాధారణంగా పెరగడంతో వందల మంది అసంఘటిత రంగ కార్మికులు రోడ్డున పడుతున్నారు. ఒక పక్క వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో గ్రామాల్లో వ్యవసాయ పనులు దొరికే పరిస్థితి లేదు. -
వేసవి ప్రణాళిక లేదు.. అధికారి లేరు
[ 18-04-2024]
ఎండలు మండి పోతున్నాయి. జిల్లాలో బావులు, నీటి వనరులు అడుగంటుతున్నాయి. జనం దాహార్తితో అల్లాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో యుద్ధప్రాతిపదిక పనిచేయాల్సిన గ్రామీణ నీటి సరఫరా అధికారులు.. బదిలీపై వెళ్లిపోతున్నారు. -
అరాచకాల్లో దిట్ట జగన్: బీద
[ 18-04-2024]
హత్యలు, దాడులు, కబ్జాలు, అరాచకాల్లో దిట్ట జగన్ అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర విమర్శించారు. నెల్లూరు తెదేపా కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. -
మూడేళ్ల చదువు ఉపాధికి ఆదరువు
[ 18-04-2024]
పదో తరగతి తరువాత మూడేళ్ల చదువు.. అనంతరం ఉపాధి.. ఉన్నత చదువులు చదవాలనుకునే వారికి నేరుగా రెండో సంవత్సరంలో బీటెక్లో చేరే అవకాశం.. ఇది పాలిటెక్నిక్లో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు. -
చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యం: తెదేపా
[ 18-04-2024]
చంద్రబాబు సీఎం అయితే అభివృద్ధి జరుగుతుందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర పేర్కొన్నారు. బుధవారం రాత్రి బోగోలు మండలంలోని చెంచులక్ష్మీపురంలో యోహాన్ అతని అనుచరులు పార్టీలో చేరారు.
తాజా వార్తలు (Latest News)
-
రూ.27 అధిక వసూలు.. ఉబర్ ఇండియాకు రూ.28,000 జరిమానా
-
ఏపీ, తెలంగాణకు సాగర్ నీటి విడుదలపై కేఆర్ఎంబీ ఉత్తర్వులు
-
డేవన్ కాన్వే ఔట్.. మరో సీనియర్ ప్లేయర్కు చెన్నై అవకాశం
-
గత పదేళ్లలో తెలంగాణకు రూ.10 లక్షల కోట్లు: కిషన్రెడ్డి
-
గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం: వాతావరణ శాఖ
-
ఇన్నేళ్లుగా ‘రాహుల్’యాన్ను లాంచ్ చేయలేకపోయింది: రాజ్నాథ్ సింగ్