ధాన్యం కొనుగోళ్లలో... లోపాలు జరిగితే బాధ్యులు మీరే
ధాన్యం కొనుగోళ్లలో అడుగడుగునా జాగ్రత్తలు పాటించాలని.. ఆ విషయంలో పూర్తి బాధ్యత సిబ్బందే తీసుకోవాలని జేసీ కూర్మనాథ్ స్పష్టం చేశారు.
నెల్లూరు(జడ్పీ), న్యూస్టుడే: ధాన్యం కొనుగోళ్లలో అడుగడుగునా జాగ్రత్తలు పాటించాలని.. ఆ విషయంలో పూర్తి బాధ్యత సిబ్బందే తీసుకోవాలని జేసీ కూర్మనాథ్ స్పష్టం చేశారు. లోపాలు జరిగితే బాధ్యులవుతారని హెచ్చరించారు. జడ్పీ సమావేశ మందిరంలో బుధవారం సాయంత్రం ధాన్యం కొనుగోళ్లు- సేకరణపై సాంకేతిక సహాయకులు, గ్రామ వ్యవసాయ సహాయకులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, సేకరణ ఏజెన్సీ ప్రతినిధులకు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జేసీ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలులో రైతుల సమక్షంలోనే పరిశీలన జరిపి వివరాలు, ఫొటోను పోర్టల్లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. ధాన్యం వాహనాల్లో లోడింగ్ చేసిన తర్వాత.. తూకం వేసి.. ఆ చిత్రాలనూ అప్లోడ్ చేయాలన్నారు. ధాన్యం లారీలను రైసు మిల్లులకు తరలించిన అనంతరం.. అక్కడ ప్రత్యేక అధికారి రైసుమిల్లులో అన్లోడింగ్ చేయించి.. ఆ చిత్రాలనూ పెట్టాలన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేసి.. రైస్మిల్లులకు తరలించడంలో మిల్లర్ల ప్రమేయం ఉండరాదని అన్నారు. ప్రధానంగా రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం సేకరణపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించాలని ఆదేశించారు. రైస్ మిల్లర్లు రవాణా ఖర్చులను ముందుగా భరిస్తే.. సంబంధిత నగదును తిరిగి జమ చేస్తారన్నారు. శిక్షణలో జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, తూనికలు, కొలతలశాఖ అధికారి ఎస్.ఈశ్వరరావు, వ్యవసాయశాఖ నుంచి వై.రాధ, జిల్లా పౌరసరఫరాల సంస్థ సహాయ మేనేజరు ఇబ్రహీం, సహాయ అధికారి అంకయ్య, డిప్యూటీ తహసీల్దార్లు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు
[ 29-03-2024]
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు.. ఎవరికీ రక్షణ లేదని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. నెల్లూరు జిల్లా కావలిలో నిర్వహించిన ‘ప్రజాగళం’ సభలో ఆయన ప్రసంగించారు. -
పేదల ఆకలి తీరుస్తున్న ఆదర్శ దంపతులు
[ 29-03-2024]
నెల్లూరు పట్టణవాసులు, సంయుక్త సేవా సంస్థ నిర్వాహకులు శ్రీనివాసరావు, లలిత దంపతులు తమ కుమారుడు జై సాయిరామ్ జ్ఞాపకార్థం పేదల ఆకలిని తీరుస్తున్నారు. -
తెదేపాతోనే బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి
[ 29-03-2024]
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలోని నార్త్ రాజుపాలెంలో తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం శుక్రవారం జరిగింది. -
చంద్రబాబు ప్రజాగళం నేడే
[ 29-03-2024]
న్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబునాయుడు శుక్రవారం జిల్లాలో పర్యటించనున్నారు. కావలి పట్టణంతో పాటు.. ఉదయగిరి నియోజకవర్గం వింజమూరులో రోడ్షో, సభల్లో పాల్గొననున్నారు. -
ఘోరప్రమాదం.. పెళ్లింట విషాదం
[ 29-03-2024]
కుమార్తె పెళ్లి జరిపించి.. బాధ్యత తీర్చుకున్నానని ఆ తల్లి ఎంతో సంబరపడ్డారు. కుమారుడు, బంధువులతో కలిసి పెళ్లి వేడుక జ్ఞాపకాలతో ఆనందంగా కారులో స్వస్థలానికి తిరుగు ప్రయాణమయ్యారు. -
చెరువులను చెరబట్టారు!
[ 29-03-2024]
నగర, పట్టణ ప్రాంతాల్లో చెరువులు కనుమరుగవుతున్నాయి. గడిచిన అయిదేళ్లలో వైకాపా నాయకుల ధోరణితో గట్లు, కాలువలే కాదు.. శిఖం భూములు కూడా ప్లాట్లుగా మారిపోయాయి. చెరువులతో రూ. కోట్లలో స్థిరాస్తి వ్యాపారం జరుగుతోంది. -
వైకాపాకు మద్దతుగా వాట్సాప్లో స్టేటస్
[ 29-03-2024]
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వాలంటీరుపై వేటు పడింది. మనుబోలు మండలం కాగితాలపూరుకు చెందిన శ్రీనివాసులు వాలంటీరుగా పని చేస్తున్నారు. తన చరవాణిలో వైకాపాకు మద్దతుగా వాట్సాప్ స్టేటస్ పెట్టారు. -
ఎన్నికల శిక్షణకు గైర్హాజరైతే చర్యలు
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ అధికారులకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలకు గైర్హాజరైతే చర్యలు తప్పవని కలెక్టర్ ఎం.హరినారాయణన్ హెచ్చరించారు. -
బాలలకేదీ సురక్ష..?
[ 29-03-2024]
పేదరికం, పోషకాహారం లోపంతో ఎంతో మంది బాలలు అనారోగ్యంతో సతమతమవుతున్నారు. చదువులో వెనుకబడుతున్నారు. -
వైకాపా సమావేశంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు
[ 29-03-2024]
కందుకూరు వైకాపా అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్ గురువారం ఉలవపాడు మండలం చాగొల్లులో కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. -
ఆహ్లాదం.. హామీలకే పరిమితం
[ 29-03-2024]
ఆత్మకూరు పట్టణ ప్రజలు కాసింత సేదతీరటానికి ఏర్పాటు చేస్తామన్న ఉద్యానవనాలు హామీలు అమలుకు నోచుకోలేదు. జిల్లాలో ముఖ్య పట్టణాల్లో ఆత్మకూరుకు ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ గత పాలక వర్గం కాలంలో ఉద్యానవనాల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్రెడ్డి
-
టీసీఎస్లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐలో శిక్షణ
-
సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
-
లోక్సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్