logo

వైజ్ఞానిక ప్రదర్శనను విజయవంతం చేయాలి

జిల్లాస్థాయిలో జరిగే వైజ్ఞానిక ప్రదర్శనను విజయవంతం చేయాలని నెల్లూరు ఉపవిద్యాశాఖాధికారి బిక్షాల్‌ కోరారు.

Published : 26 Jan 2023 01:58 IST

మాట్లాడుతున్న ఉపవిద్యాశాఖాధికారి బిక్షాల్‌

నెల్లూరు (విద్య), న్యూస్‌టుడే : జిల్లాస్థాయిలో జరిగే వైజ్ఞానిక ప్రదర్శనను విజయవంతం చేయాలని నెల్లూరు ఉపవిద్యాశాఖాధికారి బిక్షాల్‌ కోరారు. బుధవారం నగరంలోని దర్గామిట్ట బాలికల ఉన్నత పాఠశాలలో సైన్సు ఉపాధ్యాయులు, నిర్వహణ కమిటీ సభ్యులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈనెల 28న నగరంలోని దర్గామిట్ట బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లాస్థాయి పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. నిర్వహణకు 14 కమిటీలను నియమించామని, వీటి ప్రతినిధులు తమ విధులను పక్కాగా నిర్వహించాలని సూచించారు. మొత్తం 190 ప్రాజెక్టులు ప్రదర్శనకు వస్తాయన్నారు. కార్యక్రమంలో నిర్వహణ కమిటీ సభ్యులు, సైన్సు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు