పెట్రోల్ బంకుల్లో నిబంధనల ఉల్లంఘన
కోవూరుకు చెందిన వెంకటేశ్వర్లు ఇనమడుగు మినీబైపాస్లోని ఓ బంకులో పెట్రోల్ కోసం వెళ్లాడు. ఇక్కడ కనీసం నీడ లేకపోవడంతో వినియోగదారులు రద్దీతో ఎండలోనే వేచి ఉండాల్సి వచ్చింది.
పట్టించుకోని అధికారులు
అవస్థ పడుతున్న వాహనదారులు
న్యూస్టుడే, కోవూరు
* కోవూరుకు చెందిన వెంకటేశ్వర్లు ఇనమడుగు మినీబైపాస్లోని ఓ బంకులో పెట్రోల్ కోసం వెళ్లాడు. ఇక్కడ కనీసం నీడ లేకపోవడంతో వినియోగదారులు రద్దీతో ఎండలోనే వేచి ఉండాల్సి వచ్చింది.
* కొడవలూరుకు చెందిన రాము జాతీయ రహదారిపై ఓ బంకులో ద్విచక్రవానం టైర్లకు గాలి పెట్టించేందుకు వెళ్లగా.. ఫలితం దక్కలేదు. ఇక్కడ పనిచేయని గాలి యంత్రాన్ని నామమాత్రంగానే ఏర్పాటు చేశారు.
* బుచ్చిరెడ్డిపాళెం పట్టణానికి చెందిన శ్రీకర్బాబు తన కారులో డీజిల్ కొట్టించేందుకు సమీపంలోని బంకుకు వెళ్లారు. నాణ్యతను పరిశీలించాలని కోరగా.. ఇక్కడ అలాంటి సౌకర్యాలు లేవని యాజమాన్యం చెప్పడంతో శ్రీకర్బాబు అవాక్కయ్యారు.
* కావలికి చెందిన శ్రీనివాసులు కోవూరు సమీపంలోని బంకులో తన కారులో డీజిల్ పోయించారు. చెన్నైకి వెళ్తున్న ఇతను బంకు ఆవరణలో మూత్రశాలల కోసం వెదికారు. ఈ సౌకర్యం లేకపోవడంతో సిబ్బందిని ప్రశ్నించారు. ఇక్కడ అలాంటివి ఉండవని జవాబివ్వడం గమనార్హం.
* కోవూరు-కొడవలూరు మధ్యలో జాతీయ రహదారిపై ఉన్న బంకులో భాస్కర్ తన ద్విచక్ర వాహనంలో రూ.200 పెట్రోల్ పోయించారు. కానీ, రీడింగ్ మాత్రం రూ.198.88 మాత్రమే వచ్చింది. ఇదేమని ప్రశ్నిస్తే మీటర్ అంతే వస్తుందని సిబ్బంది తెగేసి చెప్పారు.
.. ఇలా జిల్లాలోని పెట్రోల్ బంకుల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనలను పాటించడం లేదు. తూనికలు, కొలతలు, నాణ్యతా ప్రమాణాలను తుంగలో తొక్కి వాహనదారుల నుంచి అడ్డగోలుగా దోచుకుంటున్నారు. కళ్ల ఎదుటే అక్రమాలు జరుగుతున్నా పట్టించుకునేవారే లేరు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో బంకుల యజమానులు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నారు. కొందరు ప్రయాణికులు ఫిర్యాదు చేసే సమయం లేక మనసులోనే తిట్టుకొని వెళ్లిపోతున్నారు.
కనీస సౌకర్యాలు మృగ్యం
జిల్లాలోని ఎన్హెచ్-16, ముంబయి జాతీయ రహదారులున్నాయి. వీటిపై నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుండడంతో రహదారుల పక్కనే సుమారు 186పెట్రోల్ బంకులు ఏర్పాటు చేశారు. వీటికి తోడు మండల, పట్టణ కేంద్రాల్లో మరో 300వరకు ఉన్నాయి. వీటిలో లారీలు, ట్రావెల్ బస్సులు, ట్రాలీలు, టిప్పర్లు, ట్రాక్టర్లు, ద్విచక్రవాహనాలు, కార్లు పెట్రోలు, డీజిల్ కొట్టిస్తుంటారు. దూర ప్రయాణాలు సాగించేవారు అలసిపోయినప్పుడు ఈ బంకుల్లో సేద తీరేందుకు వసతి గదులు, మరుగుదొడ్లు, మూత్రశాలలు, వాహనాలకు గాలిపట్టే యంత్రం, తాగునీటి సౌకర్యం.. ఉచితంగా సేవలు అందించాల్సి ఉంది. కానీ, జిల్లాలో చాలా పెట్రోల్ బంకుల్లో ఇలాంటి వసతులు కన్పించవు. అధికారులు వీటి యాజమాన్యాలతో కుమ్మక్కవుతున్నారని వినియోగదారులు ఆరోపించారు.
పెట్రోల్ కోత.. చిల్లర దోపిడీ: కోవూరుకు చెందిన రమేశ్ తన ద్విచక్రవాహనాన్ని ఇనమడుగు మినీబైపాస్లోని ఓ బంకులో రూ.50పెట్రోలు పోయిస్తే రూ.49.64కు మాత్రమే పెట్రోల్ పోశారు. ఇదేమని ప్రశ్నిస్తే ‘ఈ సారి మీకు పెట్రోలు పోసేది లేదు. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో’ అని సిబ్బంది దురుసుగా మాట్లాడడంతో రమేశ్ నివ్వెరపోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇలాంటి సంఘటనలు వాహనదారులకు నిత్యకృత్యంగా మారాయి.
కఠిన చర్యలు తప్పవు
కృష్ణప్రసాద్, సీఎస్డీటీ, కోవూరు
పెట్రోబంకుల్లో ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. ప్రతి బంకులో తప్పనిసరిగా మరుగుదొడ్లు, మూత్రశాలలు, తాగునీరు, గాలియంత్రం తప్పనిసరిగా ఉండాలి. జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి.. కఠిన చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వెంకటేశ్వరలో టీవీఎస్ ప్రాంగణ ఎంపికలు
[ 25-04-2024]
కొడవలూరులోని వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం జరిగిన క్యాంపస్ ప్లేస్మెంట్లో 21 మంది ఎంపికయ్యారని కళాశాల ఛైర్మన్ డాక్టర్ గుణశేఖర్ తెలిపారు. -
చంద్రబాబు పాలనలో రాష్ట్ర యువతకు ఉపాధి
[ 25-04-2024]
తెదేపా అధినేత చంద్రబాబు పాలనలో రాష్ట్ర యువతకు ఉపాధి, మంచి రోజులు రానున్నాయని కోవూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థిని శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. -
గడప గడపన జగన్నాటకం!
[ 25-04-2024]
అధికారంలోకి వచ్చిన మూడేళ్లపాటు దోచుకోవడమే విధిగా వైకాపా సాగించిన పాలనతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపించడంతో ‘గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రజలను నేరుగా కలుసుకోవడం.. వారి సమస్యలను తెలుసుకోవడం.. -
జలహిత మెరుగరు? జనఘోష పట్టదు!
[ 25-04-2024]
జగన్ ప్రభుత్వ పాలనలో సహజ వనరుల దోపిడీ ఎంత విశృంకళంగా సాగిందో... జిల్లా జీవనాడిగా వినుతికెక్కిన సోమశిల జలాశయ సంరక్షణపై అంతే నిర్లక్ష్యం చూపింది. పాలనలో డొల్లతనానికి. -
వైకాపా ‘మందు’చూపు
[ 25-04-2024]
నిబంధనల ప్రకారం ఒక్కోమనిషికి మూడు సీసాలకు మించి మద్యం అమ్మకూడదు. ఒక వేళ పలుమార్లు వెళ్లి కొనుగోలు చేసినా.. పది, ఇరవైకి మించి ఉండవు. అలాంటిది.. -
కావలి సమీపంలో ఘోర ప్రమాదం
[ 25-04-2024]
వారంతా స్నేహితులు.. ఫ్యాన్సీ దుకాణంలోకి అవసరమైన ఇమిటేషన్ ఆభరణాల కొనుగోలుకు చెన్నై వెళ్లారు. అనంతరం కారులో వస్తున్నారు. అందరూ గాఢ నిద్రలోకి జారుకున్నారు. -
ఎన్నికల సందేహాలా.. కాల్ చేయండి
[ 25-04-2024]
ఎన్నికలకు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా నివృత్తి చేసుకోవచ్చని జిల్లా పోలీసు పరిశీలకులు అశోక్ టి దుధే ఒక ప్రకటనలో తెలిపారు. -
మే 2 నుంచి ఓటరు సమాచార స్లిప్పులు
[ 25-04-2024]
మే నెల రెండు నుంచి ఎనిమిదో తేదీ వరకు ఓటరు సమాచార స్లిప్పులు పంపిణీ చేయాలని కలెక్టర్ ఎం.హరినారాయణన్ అధికారులకు సూచించారు. -
తాగునీటి సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూమ్
[ 25-04-2024]
జిల్లాలో తాగునీటి సమస్యలు పరిష్కరించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఎం.హరినారాయణన్ ప్రకటనలో తెలిపారు. -
సర్వేపల్లిలో ప్రతిఘటనకు సిద్ధం
[ 25-04-2024]
సర్వేపల్లిలో మంత్రి కాకాణి ఆగడాలను ప్రతిఘటించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అన్నారు. వెంకటాచలంలో బుధవారం నామినేషన్ దాఖలు అనంతరం మాట్లాడారు. -
ప్రభుత్వం చెంతే ప్రతిపాదనలు
[ 25-04-2024]
ఎలాంటి విపత్తు ఎదురైనా ముందు గుర్తుకొచ్చేది అగ్నిమాపకశాఖ.. ఆ శాఖనే ప్రభుత్వం పట్టించుకుకోలేదు. వేసవిలో పెద్దసంఖ్యలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటుంటాయి. -
జగనన్న ఇల్లు.. రాలేదన్నా!
[ 25-04-2024]
నవరత్నాలు.. పేదలందరికీ ఇళ్లు. ఇదీ ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీ. ఇందుకు జగనన్న కాలనీలు నిర్మిస్తున్నామని ఘనంగా ప్రకటించారు. అధికారంలోకి వచ్చి అయిదేళ్లయింది. ఈ హామీ అమలుకాలేదు. -
దక్షిణ బజారు.. సమస్యలతో బేజారు
[ 25-04-2024]
పట్టణంలోని ప్రధాన కాలనీల్లోనూ మౌలిక వసతుల సమస్యలు స్థానికులను వేధిస్తున్నాయి. గత నాలుగేళ్లుగా మున్సిపాలిటీ అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదనేందుకు ఆయా... -
గుంతల రోడ్లు... పూడిన కాలువలు
[ 25-04-2024]
షబ్బీర్ కాలనీలో సీసీ రోడ్లు రాళ్లు తేలడటంతో చీకటిలో నడవాలంటే ఎక్కడ అదుపుతప్పి పడిపోతామోనని ఆందోళన చెందుతున్నారు. మురుగు కాలువలు చెత్తతో నిండినా సిబ్బంది శుభ్రం చేయటంలేదని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం