గణతంత్ర శోభ
జిల్లా గణతంత్ర దినోత్సవానికి ముస్తాబైంది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో జాతీయ పతాకాన్ని ఎగురవేసేందుకు ముందస్తు ఏర్పాట్లు చేశారు.
ముస్తాబైన పోలీసు కవాతు మైదానం
నెల్లూరు(కలెక్టరేట్), న్యూస్టుడే: జిల్లా గణతంత్ర దినోత్సవానికి ముస్తాబైంది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో జాతీయ పతాకాన్ని ఎగురవేసేందుకు ముందస్తు ఏర్పాట్లు చేశారు. నెల్లూరులోని పోలీసు కవాతు మైదానంలో తగిన ఏర్పాట్లు చేశారు. ఇక్కడ గురువారం ఉదయం 9 గంటలకు వేడుకలు ప్రారంభం కానున్నాయి. కలెక్టర్ చక్రధర్బాబు ఉదయం 9 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, 9.05కు పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తారు. 9.20కి జిల్లా ప్రగతిపై ప్రసంగిస్తారు. 9.40కు జిల్లా ప్రగతి శకటాల ప్రదర్శన, 10 గంటలకు విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, 10.40కి ఉత్తమ అధికారులు, ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు ప్రదానం చేయనున్నారు. 11.55కు జాతీయ గీతాలాపనతో ముగియనుంది.
705 మందికి అవార్డులు.. గత ఏడాది కాలంలో విధుల్లో ప్రతిభ చూపిన వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు 705 మందికి ప్రశంసా పత్రాలు అందించనున్నారు. వీరిలో 46 మంది జిల్లా స్థాయి అధికారులు ఉన్నారు. అత్యధికంగా జిల్లా సర్వే, ల్యాండ్ రికార్డ్సు శాఖకు 64 అవార్డులు ప్రకటించారు. జేసీ కూర్మనాథ్, కందుకూరు సబ్ కలెక్టర్ ఎస్.ఎస్.శోభిక, వీఎస్యూ రిజిస్ట్రార్ పి.రామచంద్రారెడ్డి, కలెక్టరేట్ ఏవో షేక్ షఫీమాలిక్, జిల్లా సర్వే భూ రికార్డుల అధికారి హనుమాన్ప్రసాద్, సెబ్ జేడీ కె.శ్రీలక్ష్మి, కావలి ఆర్డీవో శీనానాయక్, జిల్లా అగ్నిమాపకశాఖ విపత్తు నిర్వహణ అధికారి శ్రీకాంత్రెడ్డి, 108 సేవల జిల్లా సమన్వయకర్త ఎం.పవన్కుమార్ తదితరులు ఉన్నారు.
జంబో జాబితా... సాధారణంగా ఆయా రంగాల్లో విశిష్ఠ సేవలందించిన వారికి స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాల సందర్భంగా ఉత్తమ సేవా పురస్కారాలు అందించడం పరిపాటి. గతం ఈ జాబితా పరిమితంగానే ఉండేది. మొదట్లో పదుల సంఖ్యలో ఉండగా.. తర్వాత వందల సంఖ్యకు చేరింది. గత మూడేళ్ల కాలంలో పరిశీలించినా.. ఈ సంఖ్య 500కు మించి లేదు. ఈ దఫా ఏకంగా 705 మందికి ఇవ్వడం చర్చనీయాంశమైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాయకుల రాజీనామా
[ 28-03-2024]
కావలి టౌన్ 29వ వార్డ్ తెదేపాకు చెందిన యువనేత నరేంద్ర, మాజీ కౌన్సిలర్ శెట్టిపల్లి మధు పార్టీకి రాజీనామా చేశారు. -
ప్రచారం ప్రారంభించిన కావలి వైకాపా ఎమ్మెల్యే
[ 28-03-2024]
కావలి నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే, రానున్న ఎన్నికల్లో వైకాపా తరఫున పోటీ చేయనున్న ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి ప్రచారం ప్రారంభించారు. -
29న కావలి, వింజమూరుల్లో చంద్రబాబు పర్యటన
[ 28-03-2024]
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా పర్యటన ఖరారైంది. ఈ నెల 29వ తేదీ కావలి, ఉదయగిరి నియోజకవర్గాల్లో రోడ్షో, బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. -
ఆ మూడే.. తుపాకులు ఇవ్వాల్సిందే
[ 28-03-2024]
ఎన్నికలు వచ్చాయంటే.. లైసెన్సు కలిగిన ప్రతి ఆయుధం పోలీసుశాఖకు అప్పగించాలన్నది నిబంధన. బ్యాంకుల భద్రత కోసం ముందస్తు అనుమతితో సెక్యూరిటీ సిబ్బంది మినహాయించి.. మిగిలిన వారంతా ఆయా స్టేషన్ల పరిధిలో వాటిని అప్పగించాల్సిందే -
అధనం.. నీదే భారం!
[ 28-03-2024]
ఎన్నికల సమయం ఎక్కువగా ఉంది. ప్రచార ఖర్చులు పెరగడంతో పాటు గెలుపోటములను ప్రభావితం చేసే కార్యకర్తలు, నాయకుల వ్యయాలను అభ్యర్థులే భరించాల్సి వస్తోంది. -
తెరచుకోని పాఠం
[ 28-03-2024]
మూలాపేటలోని రామయ్య బడి(మున్సిపల్ హైస్కూల్)లో 44 మంది విద్యార్థులు, అయిదుగురు ఉపాధ్యాయులకు ట్యాబ్లు అందించారు -
ఇద్దరు వాలంటీర్లు, క్షేత్ర సహాయకుడి తొలగింపు
[ 28-03-2024]
నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఇద్దరు గ్రామ వాలంటీర్లు, ఒక క్షేత్రసహాయకుడిని తొలగించడంతో పాటు వారిపై కేసులు నమోదు చేసినట్లు ఆర్వో ఓబులేసు తెలిపారు. -
ఓటరన్నా.. మేలుకో!
[ 28-03-2024]
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ఈనెల 16వ తేదీన విడుదలైంది. ఐదేళ్లకు ఓసారి పాలకులను ఎన్నుకునే సమయం కూడా ఆసన్నమైంది. మనం వేసే ఓటు గెలుపోటములను నిర్ణయిస్తోంది. -
జిల్లాకే తలమానికం.. పునాదులకే పరిమితం
[ 28-03-2024]
-
కన్నీటి శృతి
[ 28-03-2024]
తల్లి మరణవార్త తెలిస్తే బిడ్డ భవిష్యత్తు అంధకారమవుతుందనే ఆలోచనతో ఒక రోజంతా మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచిన హృదయ విదారక సంఘటన కందుకూరులో చోటుచేసుకుంది. -
గొంతుకోసి మహిళ హత్య
[ 28-03-2024]
మహిళను గొంతుకోసి కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన మూడో మైలులో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ
-
పార్టటైమ్ ఉద్యోగాల స్కామ్.. రూ.32.34 కోట్లు అటాచ్
-
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 99.86 శాతం పోలింగ్