దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే..
దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని జేసీ రోణంకి కూర్మనాథ్ అన్నారు.
ప్రతిజ్ఞ చేయిస్తున్న జేసీ కూర్మనాథ్, అధికారులు
నెల్లూరు(కలెక్టరేట్), న్యూస్టుడే: దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని జేసీ రోణంకి కూర్మనాథ్ అన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకుని.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నిస్పక్షపాతంగా, బాధ్యతాయుతంగా ఓటుహక్కును వినియోగించుకోవాలని సూచించారు. నెల్లూరులోని శ్రీవెంకటేశ్వర కస్తూర్బా కళాక్షేత్రంలో బుధవారం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించారు. జేసీ కూర్మనాథ్, నగరపాలక సంస్థ కమిషనర్ డి.హరిత ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. యువత భాగస్వామ్యంతోనే మనదేశం లాంటి అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ విలువలు కాపాడగలమని అభిప్రాయపడ్డారు. గ్రామీణం కంటే.. పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం తక్కువగా ఉందని, వారు కూడా ఎన్నికల ప్రక్రియలో కచ్చితంగా భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. ఆర్డీవో మాలోల మాట్లాడుతూ.. దేశంలో ఇప్పటికీ 67 శాతం మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సచివాలయ సిబ్బంది, బీఎల్వోలు, విద్యార్థినీ విద్యార్థులతో ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. వయోవృద్ధులైన ఓటర్లు కేవీ చలమయ్య, అరుణాచలం, కాళేశ్వరరావు, చాన్బాషా, కృష్ణమూర్తి, అరుణమ్మలను సత్కరించారు. వక్తృత్వ, వ్యాస రచన పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఓటు నమోదు, జాబితాల సవరణల ప్రక్రియ చక్కటి పనితీరు కనబరిచిన 24 మంది బీఎల్వోలకు అవార్డులు అందజేశారు. కార్యక్రమంలో సమగ్రశిక్ష ఏపీసీ ఉషారాణి, జిల్లా వృత్తి విద్యాశాఖ అధికారి మధుబాబు, డీకేడబ్ల్యూ కళాశాల ఇన్ఛార్జి ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. ః కలెక్టరేట్లో నిర్వహించిన ఓటరు దినోత్సవంలో డీఆర్వో వెంకట నారాయణమ్మ సిబ్బందితో ఓటు హక్కు వినియోగంపై ప్రతిజ్ఞ చేయించారు. ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. కలెక్టరేట్ పరిపాలనాధికారి షఫీమాలిక్, సిబ్బంది పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెంచులక్ష్మీపురంలో ఇంటింటి ప్రచారం
[ 24-04-2024]
కావలి నియోజకవర్గంలోని బోగోలులో రైల్వే ప్రాజెక్టును తీసుకువచ్చే బాధ్యత తమదని స్పష్టం చేశారు -
తెదేపాలో చేరిక
[ 24-04-2024]
బోగోలు మండలం విశ్వనాధరావుపేట పంచాయతీ 6వ వార్డు వైకాపా నేత సుధీర్, ఎం. జయకుమార్ తెదేపాలో చేరారు. -
మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన తెదేపా అభ్యర్థి
[ 24-04-2024]
అల్లూరు మండలంలో తెదేపా అభ్యర్థి కావ్యక్రిష్టారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
కావలిలో లారీని ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి
[ 24-04-2024]
కావలి ముసునూరు టోల్ప్లాజా వద్ద లారీని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. -
ఇసుక తోడేళ్లు.. పెన్నమ్మ కన్నీళ్లు
[ 24-04-2024]
ఇసుక అక్రమ తవ్వకాలు... అయిదేళ్ల వైకాపా పాలనలో నిత్యం వినిపించిన మాట. అధికార పార్టీ నాయకుల అండదండలతో పెన్నమ్మను కుళ్లబొడవడంతో పాటు నిబంధనలకు నీళ్లొదిలి అడ్డగోలుగా తవ్వి తరలించారు. -
అయిదేళ్ల కథ.. గోషా ఆసుపత్రి వ్యథ!
[ 24-04-2024]
మహిళలకు ప్రత్యేకంగా ఆసుపత్రిని ఏర్పాటు చేసి.. అత్యాధునిక వైద్య సేవలు అందిస్తామని వైకాపా ప్రజాప్రతినిధులు, నాయకులు ఊకదంపుడు ఉపన్యాసాలు చేశారు. -
అమ్మో దారి.. గుండెజారి
[ 24-04-2024]
జిల్లాలోని ప్రముఖ పెంచలకోన క్షేత్రానికి వెళ్లే రోడ్డది.. అంతటి ప్రాధాన్యమున్న మార్గాన్ని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో భక్తులతో పాటు పర్యాటకులు అవస్థలు పడాల్సి వస్తోంది. -
వైకాపా నాయకుల చేతివాటం
[ 24-04-2024]
సచివాలయాలకు వచ్చిన నిధులతో అధికార పార్టీ నాయకులు అడ్డగోలుగా పనులు చేస్తున్నారు. నిబంధనలకు నీళ్లొదిలారు. అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో నిధులన్నీ వృథా అవుతున్నాయి. -
వైకాపా పాలనలో రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్థకం: తెదేపా
[ 24-04-2024]
గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్థకమైందని కావలి తెదేపా కూటమి అభ్యర్థి దగుమాటి కృష్ణారెడ్డి ఆరోపించారు. గురువారం మండలంలోని వెలుపోడు, కాట్రాయపాడు, ధర్మవరంలో పర్యటించారు. -
నిరుద్యోగికి నిరాశే..
[ 24-04-2024]
నెల్లూరు నగరం వెంకటేశ్వరపురంలో ఉన్న ప్రభుత్వ బాలుర పాలిటెక్నిక్ కళాశాలలో తెదేపా ప్రభుత్వం సీమెన్స్ సంస్థ ఆధ్వర్యంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం ఏర్పాటు చేసి విద్యార్థులకు టెక్నికల్ విద్యలో ఉచితంగా శిక్షణ అందించింది. -
మాటలే తప్ప.. పరిశ్రమలెక్కడ!
[ 24-04-2024]
సర్వేపల్లి, కోవూరు, ఆత్మకూరు నియోజకవర్గాల్లో పరిశ్రమల ఏర్పాటుకు భూములు సేకరించి నిరుపయోగంగా వదిలేశారు... వైకాపా అయిదేళ్ల పాలనలో అలంకార ప్రాయంగా మారాయి. -
హామీ ఇచ్చి.. కష్టాల్లో ముంచి
[ 24-04-2024]
పాదయాత్రలో 3,648 కిలోమీటర్లు నడిచా... ప్రజలు పడుతున్న కష్టాలు విన్నా... కళ్లారా చూశా... రాష్ట్రంలో సహాయం కోసం ఎదురుచూస్తున్న ప్రతి మనిషి, కుటుంబానికి ఒక మాట ఇస్తున్నా... నేను విన్నాను... నేను ఉన్నాను అని మాట ఇస్తున్నా... -
తెలుగుతమ్ముళ్ల జోష్
[ 24-04-2024]
ఇంటూరి సోదరులు.. తెదేపాలో రాజకీయంగా క్రియాశీలక నాయకులు. నువ్వా? నేనా? అన్నట్లుగా సీటు కోసం పోటీపడ్డారు. అయితే, ఒకరిని అదృష్టం వరిస్తే.. మరొకరిని నిరాశపరిచింది. -
ఎస్సై దురుసు ప్రవర్తనపై ఆందోళన
[ 24-04-2024]
దళిత మహిళపై ఎస్సై దురుసుగా ప్రవర్తించడంతో మాల మహాసభ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం పోలీసుస్టేషన్ ఎదురుగా బాధితులు ఆందోళన చేపట్టారు. -
యువకుడి దారుణ హత్య
[ 24-04-2024]
నెల్లూరులో యువకుడిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు బీవీ నగర్ రైల్వేగేటు సమీపంలోని వినాయక స్వామి గుడి వీధిలో నివాసం ఉండే దశరథ (28) పదో తరగతి వరకు చదువుకుని.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం