భద్రతపై ప్రత్యేక దృష్టి
భద్రతపై పూర్తిస్థాయిలో ప్రత్యేక దృష్టి సారించినట్లు దిల్లీకి చెందిన చీఫ్ కమిషనర్ ఆఫ్ రైల్వే ఆర్.కె.శర్మ అన్నారు. బుధవారం గూడూరు నుంచి విజయవాడ వరకు ఆయన తనిఖీలు నిర్వహించారు.
ఆర్.కె. శర్మ, చీఫ్ కమిషనర్ ఆఫ్ రైల్వే దిల్లీ
బిట్రగుంటలో తనిఖీలు నిర్వహిస్తున్న ఆర్.కె. శర్మ
బిట్రగుంట, నెల్లూరు (రైల్వే స్టేషన్), న్యూస్టుడే: భద్రతపై పూర్తిస్థాయిలో ప్రత్యేక దృష్టి సారించినట్లు దిల్లీకి చెందిన చీఫ్ కమిషనర్ ఆఫ్ రైల్వే ఆర్.కె.శర్మ అన్నారు. బుధవారం గూడూరు నుంచి విజయవాడ వరకు ఆయన తనిఖీలు నిర్వహించారు. ప్రధానంగా కీలకమైన వంతెనలు, గేట్లు, రైలు మార్గం పటిష్ఠతపై దృష్టి పెట్టారు. అందులో భాగంగానే బిట్రగుంటలో గార్డులు, డ్రైవర్ల క్రూకంట్రోల్ కార్యాలయం, రన్నింగ్ రూమ్ తదితర ప్రాంతాల్లో ఉద్యోగుల పనితీరు, భద్రతపై ఆరా తీశారు. అవసరమైన సూచనలు చేశారు. ఒకటో నంబరు ప్లాట్ఫాంపై భద్రతా విభాగాలు ఏర్పాటు చేసిన దుకాణాలను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. భారతీయ రైల్వే ప్రయాణికులు, సరకు రవాణా గమ్యం చేర్చేందుకు భద్రతాపరంగా అనేక ప్రత్యేక నిబంధనలు ప్రవేశపెట్టిందన్నారు. అవి పక్కాగా అమలు జరిగేలా పర్యవేక్షణణుంటుందన్నారు. అంతకు ముందు ఆయన నెల్లూరులోని ప్రధాన రైల్వేస్టేషన్ పరిశీలించారు. స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించడంతో పాటు కొత్తగా నిర్మించిన భవనాలను సందర్శించారు. స్టేషన్ సూపరింటెండెంట్ ఎం.వి.ఎస్.ఎన్. కుమార్ ఆయా అంశాలను వివరించారు.
నాడు నివాసం ఉన్న బంగ్లా సందర్శన
* తనిఖీల్లో భాగంగా బిట్రగుంటకు వచ్చిన చీఫ్ కమిషనర్ ఆఫ్ రైల్వే ఆర్.కె.శర్మ.. తన ఉద్యోగ ప్రస్థానం ఇక్కడి నుంచే ప్రారంభమైందని వెల్లడించారు. 1991లో ఏడీ, టీఆర్డీ అధికారిగా బిట్రగుంటలో పనిచేసినట్లు చెప్పారు. అప్పట్లో ఆయన కాపురం ఉన్న బంగ్లాను అధికారులతో కలిసి సందర్శించారు. ఆయన వెంట విజయవాడ డివిజనల్ మేనేజరు సీవేంద్రమోహన్, బిట్రగుంట ఎస్ఎస్ ఖలీల్ అహ్మద్ఖాన్, క్రూ కంట్రోలర్ శేషయ్య, ఐవోడబ్ల్యూ రాజేష్, పీడబ్ల్యూఐ సీనియర్ సెక్షన్ ఇంజినీరు కృష్ణన్, వివిధ శాఖల జోనల్, డివిజనల్, స్థానిక అధికారులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గడప గడపన జగన్నాటకం!
[ 25-04-2024]
అధికారంలోకి వచ్చిన మూడేళ్లపాటు దోచుకోవడమే విధిగా వైకాపా సాగించిన పాలనతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపించడంతో ‘గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రజలను నేరుగా కలుసుకోవడం.. వారి సమస్యలను తెలుసుకోవడం.. -
జలహిత మెరుగరు? జనఘోష పట్టదు!
[ 25-04-2024]
జగన్ ప్రభుత్వ పాలనలో సహజ వనరుల దోపిడీ ఎంత విశృంకళంగా సాగిందో... జిల్లా జీవనాడిగా వినుతికెక్కిన సోమశిల జలాశయ సంరక్షణపై అంతే నిర్లక్ష్యం చూపింది. పాలనలో డొల్లతనానికి. -
వైకాపా ‘మందు’చూపు
[ 25-04-2024]
నిబంధనల ప్రకారం ఒక్కోమనిషికి మూడు సీసాలకు మించి మద్యం అమ్మకూడదు. ఒక వేళ పలుమార్లు వెళ్లి కొనుగోలు చేసినా.. పది, ఇరవైకి మించి ఉండవు. అలాంటిది.. -
కావలి సమీపంలో ఘోర ప్రమాదం
[ 25-04-2024]
వారంతా స్నేహితులు.. ఫ్యాన్సీ దుకాణంలోకి అవసరమైన ఇమిటేషన్ ఆభరణాల కొనుగోలుకు చెన్నై వెళ్లారు. అనంతరం కారులో వస్తున్నారు. అందరూ గాఢ నిద్రలోకి జారుకున్నారు. -
ఎన్నికల సందేహాలా.. కాల్ చేయండి
[ 25-04-2024]
ఎన్నికలకు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా నివృత్తి చేసుకోవచ్చని జిల్లా పోలీసు పరిశీలకులు అశోక్ టి దుధే ఒక ప్రకటనలో తెలిపారు. -
మే 2 నుంచి ఓటరు సమాచార స్లిప్పులు
[ 25-04-2024]
మే నెల రెండు నుంచి ఎనిమిదో తేదీ వరకు ఓటరు సమాచార స్లిప్పులు పంపిణీ చేయాలని కలెక్టర్ ఎం.హరినారాయణన్ అధికారులకు సూచించారు. -
తాగునీటి సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూమ్
[ 25-04-2024]
జిల్లాలో తాగునీటి సమస్యలు పరిష్కరించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఎం.హరినారాయణన్ ప్రకటనలో తెలిపారు. -
సర్వేపల్లిలో ప్రతిఘటనకు సిద్ధం
[ 25-04-2024]
సర్వేపల్లిలో మంత్రి కాకాణి ఆగడాలను ప్రతిఘటించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అన్నారు. వెంకటాచలంలో బుధవారం నామినేషన్ దాఖలు అనంతరం మాట్లాడారు. -
ప్రభుత్వం చెంతే ప్రతిపాదనలు
[ 25-04-2024]
ఎలాంటి విపత్తు ఎదురైనా ముందు గుర్తుకొచ్చేది అగ్నిమాపకశాఖ.. ఆ శాఖనే ప్రభుత్వం పట్టించుకుకోలేదు. వేసవిలో పెద్దసంఖ్యలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటుంటాయి. -
జగనన్న ఇల్లు.. రాలేదన్నా!
[ 25-04-2024]
నవరత్నాలు.. పేదలందరికీ ఇళ్లు. ఇదీ ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీ. ఇందుకు జగనన్న కాలనీలు నిర్మిస్తున్నామని ఘనంగా ప్రకటించారు. అధికారంలోకి వచ్చి అయిదేళ్లయింది. ఈ హామీ అమలుకాలేదు. -
దక్షిణ బజారు.. సమస్యలతో బేజారు
[ 25-04-2024]
పట్టణంలోని ప్రధాన కాలనీల్లోనూ మౌలిక వసతుల సమస్యలు స్థానికులను వేధిస్తున్నాయి. గత నాలుగేళ్లుగా మున్సిపాలిటీ అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదనేందుకు ఆయా... -
గుంతల రోడ్లు... పూడిన కాలువలు
[ 25-04-2024]
షబ్బీర్ కాలనీలో సీసీ రోడ్లు రాళ్లు తేలడటంతో చీకటిలో నడవాలంటే ఎక్కడ అదుపుతప్పి పడిపోతామోనని ఆందోళన చెందుతున్నారు. మురుగు కాలువలు చెత్తతో నిండినా సిబ్బంది శుభ్రం చేయటంలేదని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
-
కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?