logo

సెబ్‌ జేడీ శ్రీలక్ష్మి బదిలీ

జిల్లా స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో(సెబ్‌) జేడీ కె.శ్రీలక్ష్మి బదిలీ అయ్యారు. 2020 నవంబరులో ఇక్కడ బాధ్యతలు చేపట్టిన ఆమె.. రెండేళ్లకు పైగా జిల్లాలో పని చేశారు. తాజా ఉత్తర్వుల మేరకు చిత్తూరు జిల్లాకు వెళ్లనున్నారు.

Published : 29 Jan 2023 01:35 IST

నెల్లూరు(నేర విభాగం), న్యూస్‌టుడే: జిల్లా స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో(సెబ్‌) జేడీ కె.శ్రీలక్ష్మి బదిలీ అయ్యారు. 2020 నవంబరులో ఇక్కడ బాధ్యతలు చేపట్టిన ఆమె.. రెండేళ్లకు పైగా జిల్లాలో పని చేశారు. తాజా ఉత్తర్వుల మేరకు చిత్తూరు జిల్లాకు వెళ్లనున్నారు. మరోవైపు కర్నూలు జిల్లా సెబ్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌గా ఉన్న శ్రీనివాసాచారిని నెల్లూరుకు బదిలీ చేశారు. జిల్లా స్పెషల్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ అధికారి(డీఎస్‌ఈవో)గా ఈయన పనిచేయనున్నారు. పోలీసుశాఖలో అదనపు ఎస్పీ(అడ్మిన్‌)గా ఉన్నవారే సెబ్‌ జేడీగా వ్యవహరిస్తారని తెలిసింది. జేడీ బదిలీ ఉత్తర్వులు విడుదల కాగా, ఇంకా సపోర్టింగ్‌ ఆర్డరు రాలేదు. దాంతో శ్రీలక్ష్మి ఇంకా రిలీవ్‌ కాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని