logo

ఉగాది నాటికి గృహ ప్రవేశాలు పూర్తవ్వాలి

నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా నుడా పరిధిలో ఉన్న మండలంలోని జమ్మలపాలెంలో లబ్ధిదారులకు మంజూరైన పక్కా గృహాలు త్వరితగతిన పూర్తి చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని నుడా వైస్‌ ఛైర్మన్‌ టి.బాపిరెడ్డి సూచించారు.

Published : 29 Jan 2023 01:58 IST

వివరాలు తెలుసుకుంటున్న నుడా వైస్‌ ఛైౖర్మన్‌ బాపిరెడ్డి

జలదంకి, న్యూస్‌టుడే: నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా నుడా పరిధిలో ఉన్న మండలంలోని జమ్మలపాలెంలో లబ్ధిదారులకు మంజూరైన పక్కా గృహాలు త్వరితగతిన పూర్తి చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని నుడా వైస్‌ ఛైర్మన్‌ టి.బాపిరెడ్డి సూచించారు. శనివారం జమ్మలపాలెంలో నూతన లేఅవుట్‌లో నిర్మిస్తున్న పక్కా గృహాల నిర్మాణాలను ఆయన పరిశీలించారు. ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు ఉగాది నాటికి గృహ ప్రవేశాలు పూర్తి చేసి, సొంతింటి కలను నెరవేర్చుకునేలా చూడాలని అధికారులకు తెలిపారు. ఎంపీడీవో శ్రీధర్‌బాబు, హౌసింగ్‌ డీఈ శ్రీనివాసులు, ఏఈ ప్రసాద్‌, సర్పంచి బుర్రి శ్రీవేణి, విద్యుత్తు, నీటి సరఫరా విభాగం ఏఈలు చంద్రశేఖర్‌, సతీష్‌బాబు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని