జల్జీవన్.. లక్ష్యానికి దూరం
జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ కుళాయిల ద్వారా తాగునీరు అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ‘జల్ జీవన్ మిషన్(జేఎంఎం) పథకాన్ని అమల్లోకి తెచ్చారు.
సంగం మండలం పరిధిలో పైపులైను పనులు పరిశీలిస్తున్న అధికారులు
ఈనాడు డిజిటల్, నెల్లూరు: జడ్పీ, న్యూస్టుడే: జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ కుళాయిల ద్వారా తాగునీరు అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ‘జల్ జీవన్ మిషన్(జేఎంఎం) పథకాన్ని అమల్లోకి తెచ్చారు. 2024 నాటికి పనులు పూర్తి చేసి.. నీరందించేలా గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు ప్రణాళిక రూపొందించారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించిన ఈ పథకం పనులను నాలుగేళ్లపాటు విడతల వారీగా పూర్తి చేయాలన్నది లక్ష్యం. ఇప్పటికీ మూడేళ్లు గడిచినా.. సకాలంలో గుత్తేదారులకు బిల్లుల చెల్లింపు జరగకపోవడంతో జిల్లాలో పురోగతి ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. మార్చి 2024 నాటికి పనులు పూర్తి చేయాలన్న లక్ష్యం ఆచరణలో అమలయ్యేలా కనిపించడం లేదు.
లక్ష్యం సాధించేనా..
జల్ జీవన్ మిషన్ కింద 2022-23లో లక్ష కుటుంబాలకు కుళాయి కనెక్షన్లు ఇచ్చేందుకు మంజూరు తీసుకోగా.. ఇప్పటి వరకు 55,126 ఇళ్లకు మాత్రమే ఇచ్చారు. మరో 44,874 కుటుబాలకు ఇవ్వాల్సి ఉండగా.. మార్చి నెలాఖరు నాటికి లక్ష్యాలు పెట్టుకున్నారు. జరుగుతున్న పనులు చూస్తే.. ఇది సాధ్యపడేలా కనిపించడం లేదు. జిల్లాలో మొత్తం రూ. 193.50 కోట్లతో 1601 పనులు మంజూరు చేయగా.. 772 ప్రారంభించారు. 350 టెండరు దశలో ఉన్నాయి. 439 పనులకు ఒప్పందం చేసుకున్నా.. గుత్తేదారులు ముందుకు రావడం లేదు. ఆరు నెలలుగా బిల్లులు మంజూరు కాకపోవడంతో.. పనులు ప్రారంభం కాలేదు. మార్చి నెలాఖరులోపు బిల్లులు వస్తాయని.. పనులు వేగవంతం చేయాలని అధికారులు పదేపదే కోరుతున్నా.. గుత్తేదారులు స్పందించడం లేదు. అప్పులు తెచ్చి.. పెట్టిన పెట్టుబడులకు వడ్డీలు కట్టలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రూ. 8.46 కోట్ల బకాయిలు
జేఎంఎం పథకానికి వెచ్చిస్తున్న నిధుల్లో 50 శాతం కేంద్రం భరిస్తుండగా- 50 శాతం రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తోంది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రూ. 5 లక్షలు, రూ. 40 లక్షలు, రూ. 2 కోట్లపైన విలువైనవిగా విడగొట్టి.. టెండర్లు పిలిచి గుత్తేదారులకు అప్పగిస్తున్నారు. విలువ ఆధారంగా డివిజన్, సిర్కిల్ కార్యాలయాల్లో టెండర్లు పిలిచి ఆమోదిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా పిలిస్తే గుత్తేదారులు ఆసక్తి చూపడం లేదు. మండలాల వారీగా అదే పరిస్థితి.. దీంతో పనుల వారీగా టెండర్లు పిలిచి ఒప్పందం కుదర్చుకుంటున్నారు. కేంద్ర భాగస్వామ్యం ఉండటంతో బిల్లులు వస్తాయన్న ఉద్దేశంతో.. మొదట్లో వేగంగా ప్రారంభమయ్యాయి. అందుకు తగ్గట్టుగానే బిల్లులు అందాయి. గత ఆరు నెలలుగా చెల్లింపులు నిలిచిపోయాయి. ఆ మొత్తం రూ. 8.46 కోట్లుగా ఉండటంతో.. ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయాయి. ఒకరిద్దరు.. అదీ మొక్కుబడిగా చేస్తున్నట్లు ఆర్డబ్ల్యూఎస్ అధికారులే చెబుతున్నారు.
త్వరితంగా పూర్తి చేసేలా చర్యలు
శ్రీనివాసకుమార్, ఈఈ, ఆర్డబ్ల్యూఎస్
జల్జీవన్ మిషన్ పథకాన్ని త్వరితంగా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నాం. బిల్లులు పెండింగ్లో ఉన్న మాట వాస్తవమే. ఆ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. త్వరలోనే వస్తాయని తెలిపారు. నగదు పడిన వెంటనే వేగం పెంచుతాం. కొందరు జడ్పీటీసీ సభ్యులు పలు మండలాల్లో సమస్యలు ఉన్నట్లు చెప్పారు. వాటిని వీలైనంత త్వరగా పరిష్కరిస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వెంకటేశ్వరలో టీవీఎస్ ప్రాంగణ ఎంపికలు
[ 25-04-2024]
కొడవలూరులోని వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం జరిగిన క్యాంపస్ ప్లేస్మెంట్లో 21 మంది ఎంపికయ్యారని కళాశాల ఛైర్మన్ డాక్టర్ గుణశేఖర్ తెలిపారు. -
చంద్రబాబు పాలనలో రాష్ట్ర యువతకు ఉపాధి
[ 25-04-2024]
తెదేపా అధినేత చంద్రబాబు పాలనలో రాష్ట్ర యువతకు ఉపాధి, మంచి రోజులు రానున్నాయని కోవూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థిని శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. -
గడప గడపన జగన్నాటకం!
[ 25-04-2024]
అధికారంలోకి వచ్చిన మూడేళ్లపాటు దోచుకోవడమే విధిగా వైకాపా సాగించిన పాలనతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపించడంతో ‘గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రజలను నేరుగా కలుసుకోవడం.. వారి సమస్యలను తెలుసుకోవడం.. -
జలహిత మెరుగరు? జనఘోష పట్టదు!
[ 25-04-2024]
జగన్ ప్రభుత్వ పాలనలో సహజ వనరుల దోపిడీ ఎంత విశృంకళంగా సాగిందో... జిల్లా జీవనాడిగా వినుతికెక్కిన సోమశిల జలాశయ సంరక్షణపై అంతే నిర్లక్ష్యం చూపింది. పాలనలో డొల్లతనానికి. -
వైకాపా ‘మందు’చూపు
[ 25-04-2024]
నిబంధనల ప్రకారం ఒక్కోమనిషికి మూడు సీసాలకు మించి మద్యం అమ్మకూడదు. ఒక వేళ పలుమార్లు వెళ్లి కొనుగోలు చేసినా.. పది, ఇరవైకి మించి ఉండవు. అలాంటిది.. -
కావలి సమీపంలో ఘోర ప్రమాదం
[ 25-04-2024]
వారంతా స్నేహితులు.. ఫ్యాన్సీ దుకాణంలోకి అవసరమైన ఇమిటేషన్ ఆభరణాల కొనుగోలుకు చెన్నై వెళ్లారు. అనంతరం కారులో వస్తున్నారు. అందరూ గాఢ నిద్రలోకి జారుకున్నారు. -
ఎన్నికల సందేహాలా.. కాల్ చేయండి
[ 25-04-2024]
ఎన్నికలకు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా నివృత్తి చేసుకోవచ్చని జిల్లా పోలీసు పరిశీలకులు అశోక్ టి దుధే ఒక ప్రకటనలో తెలిపారు. -
మే 2 నుంచి ఓటరు సమాచార స్లిప్పులు
[ 25-04-2024]
మే నెల రెండు నుంచి ఎనిమిదో తేదీ వరకు ఓటరు సమాచార స్లిప్పులు పంపిణీ చేయాలని కలెక్టర్ ఎం.హరినారాయణన్ అధికారులకు సూచించారు. -
తాగునీటి సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూమ్
[ 25-04-2024]
జిల్లాలో తాగునీటి సమస్యలు పరిష్కరించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఎం.హరినారాయణన్ ప్రకటనలో తెలిపారు. -
సర్వేపల్లిలో ప్రతిఘటనకు సిద్ధం
[ 25-04-2024]
సర్వేపల్లిలో మంత్రి కాకాణి ఆగడాలను ప్రతిఘటించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అన్నారు. వెంకటాచలంలో బుధవారం నామినేషన్ దాఖలు అనంతరం మాట్లాడారు. -
ప్రభుత్వం చెంతే ప్రతిపాదనలు
[ 25-04-2024]
ఎలాంటి విపత్తు ఎదురైనా ముందు గుర్తుకొచ్చేది అగ్నిమాపకశాఖ.. ఆ శాఖనే ప్రభుత్వం పట్టించుకుకోలేదు. వేసవిలో పెద్దసంఖ్యలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటుంటాయి. -
జగనన్న ఇల్లు.. రాలేదన్నా!
[ 25-04-2024]
నవరత్నాలు.. పేదలందరికీ ఇళ్లు. ఇదీ ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీ. ఇందుకు జగనన్న కాలనీలు నిర్మిస్తున్నామని ఘనంగా ప్రకటించారు. అధికారంలోకి వచ్చి అయిదేళ్లయింది. ఈ హామీ అమలుకాలేదు. -
దక్షిణ బజారు.. సమస్యలతో బేజారు
[ 25-04-2024]
పట్టణంలోని ప్రధాన కాలనీల్లోనూ మౌలిక వసతుల సమస్యలు స్థానికులను వేధిస్తున్నాయి. గత నాలుగేళ్లుగా మున్సిపాలిటీ అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదనేందుకు ఆయా... -
గుంతల రోడ్లు... పూడిన కాలువలు
[ 25-04-2024]
షబ్బీర్ కాలనీలో సీసీ రోడ్లు రాళ్లు తేలడటంతో చీకటిలో నడవాలంటే ఎక్కడ అదుపుతప్పి పడిపోతామోనని ఆందోళన చెందుతున్నారు. మురుగు కాలువలు చెత్తతో నిండినా సిబ్బంది శుభ్రం చేయటంలేదని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్