ముగిసిన విద్యా వైజ్ఞానిక ప్రదర్శన
విద్యార్థులకు ప్రస్తుతం ఎన్నో అవకాశాలు ఉన్నాయని, వాటిని ఒడిసి పట్టుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఎమ్మెల్సీ బల్లి కల్యాణ్ చక్రవర్తి పిలుపునిచ్చారు.
విద్యార్థులతో ఎమ్మెల్సీ కల్యాణ్చక్రవర్తి, విద్యాశాఖ జేడీ రామలింగం తదితరులు
నెల్లూరు (విద్య), న్యూస్టుడే : విద్యార్థులకు ప్రస్తుతం ఎన్నో అవకాశాలు ఉన్నాయని, వాటిని ఒడిసి పట్టుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఎమ్మెల్సీ బల్లి కల్యాణ్ చక్రవర్తి పిలుపునిచ్చారు. నగరంలోని దర్గామిట్ట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండురోజుల పాటు జిల్లాస్థాయిలో నిర్వహించిన విద్యా వైజ్ఞానిక ప్రదర్శనల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, బహుమతులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల చదువులకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోందన్నారు. ‘నాడు- నేడు’తో మౌలిక వసతులు కల్పిస్తోందని, వీటిని వినియోగించుకోవాలని తెలిపారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దాలన్నారు. అనంతరం రాష్ట్ర పోటీలకు ఎంపికైన 10 మంది విద్యార్థులకు ఆయన ప్రశంసాపత్రాలు అందించారు. వరుసగా వై.భావన (బిట్రగుంట జడ్పీ బాలికల పాఠశాల), ఎన్.సూర్య (విడవలూరు జడ్పీ పాఠశాల), రాధిక (ఎంవీపాళెం జడ్పీ పాఠశాల), ఎస్కే ఆషిద్ (ఊనుగుంటపాళెం పాఠశాల), పీవీఎస్ సిద్ధార్థ (రామాయపట్నం పాఠశాల), మనోజ (నిడిగుంటపాళెం జడ్పీ పాఠశాల), కేవీఎస్ సాయితేజ (పెనుబల్లి జడ్పీ పాఠశాల), పి.సింధు (ఏపీ ఎంజేపీ బీసీడబ్ల్యూఆర్జీ), టి.లక్ష్మీనరసింహ (కొండాపురం ఏపీ మోడల్ స్కూల్), అనన్య చరిత (మర్రిపాడు ఏపీమోడల్ స్కూల్) విజేతలుగా నిలిచి రాష్ట్ర పోటీలకు అర్హత సాధించారు. కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ మువ్వా రామలింగం, ఆర్జేడీ సుబ్బారావు, ఎస్ఎస్ఏ ఏపీసీ సీహెచ్ ఉషారాణి, ఇన్ఛార్జి డీఈవో గ్లోరికుమారి, జిల్లా సైన్సు అధికారి శ్రీనివాసులు, సైన్సు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పది ఫలితాల్లో నిరాశే..
[ 23-04-2024]
తన కుమార్తె పదో తరగతి చదువుతుందని కాలనీలో అందరికీ చెప్పుకుంటూ కూలి పనులకు వెళ్లి జీవనం సాగిస్తున్న తల్లి దాలు లక్ష్మి గత నెలలో రహదారి ప్రమాదంలో మరణించింది. -
పసుపు దళం.. విజయగళం
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో నాలుగో రోజు పలు రాజకీయ పార్టీల అభ్యర్థులు కోలాహలంగా నామినేషన్లు దాఖలు చేశారు. -
పచ్చటి బతుకులపై ఫ్లోరైడ్
[ 23-04-2024]
బతికుండగానే మనిషిని నిలువునా కుంగదీసి జీవచ్ఛవంలా మార్చే ఫ్లోరైడ్ నీటితో ప్రాణాలు పోతున్నాయని తెలిసినా పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదు. వైకాపా అధికారంలోకి వస్తే ఎక్కడికక్కడ శుద్ధజల కేంద్రాలు ఏర్పాటు చేస్తామని హామీలు గుప్పించిన ప్రజాప్రతినిధులు.. సమస్య పరిష్కారం దిశగా గత ప్రభుత్వాల్లో ఏర్పాటు చేసిన వాటినీ పట్టించుకోలేదు. -
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై నిఘా పెంచండి
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఎస్పీ కె.ఆరిఫ్ హఫీజ్ పోలీసు అధికారులను ఆదేశించారు -
ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాల్సిందే: కలెక్టర్
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా సరిహద్దులు, ఇతర ప్రధాన మార్గాల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వద్ద ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.హరినారాయణన్ అధికారులను ఆదేశించారు. -
కోడ్ ఉంటే మాకేంటి..!
[ 23-04-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు పక్కాగా జరుగుతోందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.హరినారాయణన్ చెబుతుండగా క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది -
మీ మాటలకు మోసపోయాం!
[ 23-04-2024]
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే వేతనం రూ.15 వేలకు పెంచుతానంటూ గత ఎన్నికల ప్రచారంలో జగన్ హామీ ఇచ్చారు. -
జగన్ హామీ.. నెరవేరదేమీ?
[ 23-04-2024]
అనుమసముద్రంపేట దర్గా రోడ్లు విస్తరణ పేరుతో ఇలా ఛిద్రం చేశారు. ఆపై అభివృద్ధి మరిచారు. పనులు సొంతం చేసుకున్న అధికార పార్టీ నాయకులు చేపట్టకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. -
గెలిచి వచ్చి అభివృద్ధి చేస్తా: వేమిరెడ్డి
[ 23-04-2024]
గెలుపుతో స్వగ్రామానికి తిరిగి వచ్చి అభివృద్ధి చేస్తానని తెదేపా ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి తెలిపారు. సోమవారం నామినేషన్ వేసిన అనంతరం తన స్వగ్రామం ఇందుపూరుకు వచ్చారు -
ఆస్తులు బుగ్గవుతుంటే.. నివారించలేని జగన్ ప్రభుత్వం
[ 23-04-2024]
వేసవిలో అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అప్రమత్తంగా లేని సమయంలో ప్రమాదాలు సంభవించి ఆస్తులు బూడిద అవుతున్నాయి