బ్యాటరీ సైకిల్!
బ్యాటరీ బైకులు.. బ్యాటరీ కారులు.. ఆటోలు చూశాంగానీ బ్యాటరీ సైకిల్ను చూశారా? ఎప్పుడైనా దానిపై ఎవరైనా కూర్చొని ప్రయాణించారా? మైలేజ్ ఎంత వస్తుంది.. ఈ ప్రశ్నలకు సమాధానం నెల్లూరులో లభిస్తుంది.
ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 50 కి.మీ. మైలేజీ
న్యూస్టుడే, నెల్లూరు (వీఆర్సీ సెంటరు): బ్యాటరీ బైకులు.. బ్యాటరీ కారులు.. ఆటోలు చూశాంగానీ బ్యాటరీ సైకిల్ను చూశారా? ఎప్పుడైనా దానిపై ఎవరైనా కూర్చొని ప్రయాణించారా? మైలేజ్ ఎంత వస్తుంది.. ఈ ప్రశ్నలకు సమాధానం నెల్లూరులో లభిస్తుంది. జిల్లా కేంద్రమైన నెల్లూరులో ఓ వ్యక్తి వినూత్నంగా బ్యాటరీ సైకిల్ మార్కెట్లోకి తెచ్చారు. తైవాన్ నుంచి వస్తువులు తెప్పించి మరీ ఈ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 50 కిలోమీటర్ల వరకు మైలేజీ వస్తుంది. 25.9 వాట్స్తో కలిగిన విద్యుత్తు శక్తితో ఈ సైకిల్ పనిచేస్తుంది. గంటకు 25 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. వాటర్ ప్రూఫ్తో కూడిన ఈ సైకిల్ ఒక ఏడాది వారంటీతో పాటు వస్తుంది. మన వద్ద పాత సైకిల్ ఉన్నా.. అది ఎలాంటిదైనా సరే.. ఈ కిట్ను అమర్చుతారు. దీనికి లైట్ కూడా ఉంటుంది. హ్యాండిల్కు ఎక్సలేటరు ఉంటుంది. నెల్లూరుకు చెందిన సుధా మాధవ్ అనే సైకిళ్ల వ్యాపారి వీటిని విక్రయిస్తున్నారు. ఇప్పటికే విజయవాడ, తూర్పు గోదావరి, హైదరాబాద్కు సైకిళ్లు పంపించారు. లుథియానా నుంచి ఆర్డర్లు వస్తున్నాయంటే సైకిల్ క్రేజీ అలాంటిది మరి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెన్నూరు వైకాపా సర్పంచ్ తెదేపాలో చేరిక
[ 23-04-2024]
దగదర్తి మండలం చెన్నూరు మేజర్ పంచాయతీ సర్పంచ్ బుక్కే సునీత, ఆమె భర్త వెంకట రమణ నాయక్ వైకాపాను వీడి తెదేపాలో చేరారు. -
పది ఫలితాల్లో నిరాశే..
[ 23-04-2024]
తన కుమార్తె పదో తరగతి చదువుతుందని కాలనీలో అందరికీ చెప్పుకుంటూ కూలి పనులకు వెళ్లి జీవనం సాగిస్తున్న తల్లి దాలు లక్ష్మి గత నెలలో రహదారి ప్రమాదంలో మరణించింది. -
పసుపు దళం.. విజయగళం
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో నాలుగో రోజు పలు రాజకీయ పార్టీల అభ్యర్థులు కోలాహలంగా నామినేషన్లు దాఖలు చేశారు. -
పచ్చటి బతుకులపై ఫ్లోరైడ్
[ 23-04-2024]
బతికుండగానే మనిషిని నిలువునా కుంగదీసి జీవచ్ఛవంలా మార్చే ఫ్లోరైడ్ నీటితో ప్రాణాలు పోతున్నాయని తెలిసినా పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదు. వైకాపా అధికారంలోకి వస్తే ఎక్కడికక్కడ శుద్ధజల కేంద్రాలు ఏర్పాటు చేస్తామని హామీలు గుప్పించిన ప్రజాప్రతినిధులు.. సమస్య పరిష్కారం దిశగా గత ప్రభుత్వాల్లో ఏర్పాటు చేసిన వాటినీ పట్టించుకోలేదు. -
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై నిఘా పెంచండి
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఎస్పీ కె.ఆరిఫ్ హఫీజ్ పోలీసు అధికారులను ఆదేశించారు -
ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాల్సిందే: కలెక్టర్
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా సరిహద్దులు, ఇతర ప్రధాన మార్గాల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వద్ద ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.హరినారాయణన్ అధికారులను ఆదేశించారు. -
కోడ్ ఉంటే మాకేంటి..!
[ 23-04-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు పక్కాగా జరుగుతోందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.హరినారాయణన్ చెబుతుండగా క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది -
మీ మాటలకు మోసపోయాం!
[ 23-04-2024]
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే వేతనం రూ.15 వేలకు పెంచుతానంటూ గత ఎన్నికల ప్రచారంలో జగన్ హామీ ఇచ్చారు. -
జగన్ హామీ.. నెరవేరదేమీ?
[ 23-04-2024]
అనుమసముద్రంపేట దర్గా రోడ్లు విస్తరణ పేరుతో ఇలా ఛిద్రం చేశారు. ఆపై అభివృద్ధి మరిచారు. పనులు సొంతం చేసుకున్న అధికార పార్టీ నాయకులు చేపట్టకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. -
గెలిచి వచ్చి అభివృద్ధి చేస్తా: వేమిరెడ్డి
[ 23-04-2024]
గెలుపుతో స్వగ్రామానికి తిరిగి వచ్చి అభివృద్ధి చేస్తానని తెదేపా ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి తెలిపారు. సోమవారం నామినేషన్ వేసిన అనంతరం తన స్వగ్రామం ఇందుపూరుకు వచ్చారు -
ఆస్తులు బుగ్గవుతుంటే.. నివారించలేని జగన్ ప్రభుత్వం
[ 23-04-2024]
వేసవిలో అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అప్రమత్తంగా లేని సమయంలో ప్రమాదాలు సంభవించి ఆస్తులు బూడిద అవుతున్నాయి
తాజా వార్తలు (Latest News)
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
-
వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
-
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్