పెన్నానదిలో గరళం
ఆత్మకూరు మండలం బండారుపల్లి సమీప కొమ్మలేరు వాగు పెన్నా నదిలో కలుస్తోంది. పురుగు మందులు, మురుగునీటితో కలుషితం కావడంతో ఈ గ్రామంలో బోరు నీరు తాగి టైఫాయిడ్, ఇతర జ్వరాలు అనారోగ్యాలకు ప్రజలు గురయ్యారు.
న్యూస్టుడే, ఆత్మకూరు
ఈ చిత్రలోని పురుగుమందుల ప్యాకెట్లు చూడండి. వరి, ఇతర తోటల్లో పురుగుల నివారణకు పిచికారీ చేసే పొడి మందులను వాడారు. అనంతరం వాటి వ్యర్థాలను ఇలా నీటి పక్కనే పడేశారు. మందు పిచికారీ అనంతరం స్ప్రేయర్లు ఈనీటిలోనే శుభ్రం చేస్తున్నారు.
ఇవి నదిలోని నీటి పక్కనే పారవేసిన క్రిమిసంహారక పొడి మందు ఖాళీ ప్యాకెట్లు. సమీప పొలాల్లో పిచికారీ కోసం తెచ్చిన పురుగుల నివారణ పొడిమందును ఇలా నిర్లక్ష్యంగా పెన్నా నీటిలో కలిసేలా పారవేశారు.
ఆత్మకూరు మండలం బండారుపల్లి సమీప కొమ్మలేరు వాగు పెన్నా నదిలో కలుస్తోంది. పురుగు మందులు, మురుగునీటితో కలుషితం కావడంతో ఈ గ్రామంలో బోరు నీరు తాగి టైఫాయిడ్, ఇతర జ్వరాలు అనారోగ్యాలకు ప్రజలు గురయ్యారు. దీంతో ఆ ప్రాంతంలో ఉన్న తాగునీటి బోరును తొలగించి సురక్షిత ప్రాంతంలో వేసుకున్నారు. జిల్లాలో తాగు, సాగు నీటికి ఆధారం పెన్నా నది. వందల గ్రామాలకు తాగునీటితో లక్షల ఎకరాలకు నీరు అందుతుంది. నది సమీపంలోని తీరంలో పంటలు పండుతున్నాయి. ఇది జిల్లాలోని అనంతసాగరం మండలం నుంచి ఇందుకూరుపేట వరకు ప్రవహిస్తోంది. లక్షలాది మందికి జీవాధారమైన ఇది కలుషితమవుతుంది. అవగాహన రాహిత్యంతో నీటిని విషపూరితమైన మందులతో కలిపేస్తున్నారు.
భూగర్భ జలమూ! : సోమశిల నుంచి సముద్రం వరకు ఉన్న పెన్నా నది వెంబడి ఉండే మండలాల్లో తాగునీటికి ఆధారంగా బోర్లు ఉన్నాయి. నది నీటిలో పురుగు మందులు, ప్లాస్టిక్ వ్యర్థాలు, మురుగునీరు కలవడంతో కలుషితమైన నీరు ఈ బోర్లు ద్వారా ప్రజలకు సరఫరా అవుతోంది. ప్రస్తుతం జిల్లాలో టైఫాయిడ్, డెంగీ, విష జ్వరాలు, పెరుగుతున్న క్యాన్సర్ వ్యాధులకు ఈ కలుషిత జలాలే కారణమని నిపుణులు అంటున్నారు. జిల్లాలో 2700 రక్షిత నీటి పథ]కాలు ఉండగా వాటిలో 793 పథకాలు పెన్నా నది వెంబడి ఉండే మండలాల పరిధిలో ఉన్నాయి. ఈపథకాల నీరు తాగిన వారు వివిధ రుగ్మతలకు గురవుతున్నారు.
నాడెంతో స్వచ్ఛం
జిల్లాలో పెన్నా నది కాలువలు మూడు దశావ్దాల క్రితం స్వచ్ఛంగా ఉండటంతో ప్రజలు, వ్యవసాయ కూలీలు నేరుగా తాగేవారు. ఇప్పుడు పరిస్థితి దారుణంగా తయారైంది. నేరుగా తాగడానికి సాహసించలేకపోతున్నారు. అధికారుల నిర్లక్ష్యమే ప్రధాన కారణం. పాలకులు అవగాహన కల్పించకపోవడంతో ఏటికాలువలు, పెన్నా నది, ఉపనదులు, వంకల్లో ప్రవహించే నీరు కలుషితం అయ్యేలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నదిలో గతంలో చేపలు భారీగా ఉండేవి. విషపూరితం కావడంతో ఇవి అంతరించిపోతున్నాయి.
ఎక్కడెక్కడి నుంచి అంటే..
కలువాయి. అనంతసాగరం, ఆత్మకూరు, చేజర్ల, సంగం, పొదలకూరు, బుచ్చిరెడ్డిపాళెం, నెల్లూరు రూరల్, నెల్లూరు టౌన్, కోవూరు, విడవలూరు ఇందుకూరుపేట మండలాలు ఉన్నాయి. ఈ మండలాల పరిధిలోని వ్యవసాయ పురుగు మందుల వ్యర్థాలు, రసాయనాలు, మురుగునీరు, ప్లాస్టిక్ వ్యర్థాలు నిర్లక్ష్యంగా కలిపేస్తున్నారు. వీటన్నింటి ప్రభావం ప్రజారోగ్యపైనే పడుతోంది. అయినా అధికారుల్లో చలనం లేదు.
ప్రాణాంతకం
డాక్టర్ సీకే నాయుడు, క్యాన్సర్ సర్జన్, బసవతారకం క్యాన్సర్ వైద్యశాల
నదిలో క్రిమిసంహాకర మందులు కలవడంతో ప్రాణాంతక వ్యాధులు సోకుతాయి. రకరకాలుగా అనారోగ్యానికి గురవుతున్నారు. నాడీ మండల వ్యవస్థ దెబ్బతింటుంది. క్యాన్సర్ వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. భవిష్యత్తులో మరింత ముప్పు పొంచి ఉంది. నీటిని పరిరక్షించుకోకుంటే మానవాళి మనుగడకే ప్రమాదం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!