పొర్లుకట్ట పటిష్ఠం.. ప్రతిపాదనలకే పరిమితం
జిల్లాలోని సంగం బ్యారేజికి దిగువన పెన్నా నది పటిష్టత మాటలకే పరిమితమైంది. దీంతో వరదల సమయంలో నది పొంగుతుంది. సమీపంలోని ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి.
సంగం, న్యూస్టుడే
సంగం బ్యారేజి దిగువన ధ్వంసమైన నది గట్టు
జిల్లాలోని సంగం బ్యారేజికి దిగువన పెన్నా నది పటిష్టత మాటలకే పరిమితమైంది. దీంతో వరదల సమయంలో నది పొంగుతుంది. సమీపంలోని ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. ఈ గట్టు 2021 నవంబరు నెలలో వరదలకు ధ్వంసమైంది. అప్పటి నుంచి మరమ్మతులు జరగలేదు. పెన్నా నదికి భారీ వరద ప్రవాహం వస్తే ముప్పు తప్పదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మాత్రం ప్రతిపాదనలు పంపాం, ప్రభుత్వం ఆమోదిస్తే చేస్తామంటూ కాలయాపన చేస్తున్నారు.
5.5 లక్షల వరదతో..
2021 నవంబరు 19, 20 తేదీల్లో సంగం ఆనకట్ట మీదుగా పెన్నా నదిలో 5.5 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహించింది. ఆసమయంలో సంగం బ్యారేజీకి దిగువన గట్టు దాటి సమీప ప్రాంతాలను ముంచెత్తింది. ఆసమయంలో బుచ్చిరెడ్డిపాళెం మినగల్లు సమీపంలో గండి పడడంతో వరద ముంచేసింది. ఆతరువాత షరా మామూలుగా అధికారులు పరిశీలించి, యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటామన్నారు. ఆతరువాత పత్తా లేరు.
రూ.66 లక్షలతో ప్రతిపాదనలు
తెలుగు గంగ ఏఈ విజయరామిరెడ్డి మాట్లాడుతూ రూ.66 లక్షలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు. ఆమోదం లభించిన వెంటనే పనులు చేస్తామని వివరించారు.
స్వయంగా మంత్రి పరిశీలించినా..
గత ఏడాది మేనెల తొమ్మిదో తేదీన జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తొలిసారిగా సంగం బ్యారేజి వద్దకు వచ్చారు. సంగం వాసులు ఆయన దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. ఆయనతో పాటు , వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి, జిల్లా పాలనాధికారి కె.వి.ఎన్.చక్రధర్బాబు తదితరులు పరిశీలించారు. వెంటనే మరమ్మతులు చేయాలని, ప్రమాదం జరగకుండా పటిష్టం చేయాలని అంబటి రాంబాబు ఆదేశించారు. ఇప్పటికీ అతీ గతి లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అడ్డగోలు పోస్టులు పెడితే ఇబ్బందే
[ 20-04-2024]
చేతిలో చరవాణి ఉందని ఇష్టానుసారం పోస్టులు పెడితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రత్యర్థులపై పోస్టులు పెట్టడం.. సామాజిక వర్గాలను కించపరచడం... -
బాబు సీఎం అయ్యే వరకు పాదరక్షలు ధరించనని..!
[ 20-04-2024]
చంద్రబాబు సీఎం అయ్యే వరకు చెప్పులు వేసుకోనని దగదర్తి మండలంలోని కాట్రాయపాడుకు చెందిన తాళ్లూరు సుధాకర్నాయుడు ప్రతిన బూనారు. -
‘నీరో’ల పాలన
[ 20-04-2024]
ప్రజలకు సురక్షిత తాగునీరు అందించేందుకు తెలుగుదేశం ప్రభుత్వం 2018లో ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం తీసుకొచ్చింది. జిల్లా వ్యాప్తంగా శుద్ధజల కేంద్రాలను నిర్మించింది. -
జగన్ జమానాలో పప్పన్నం కష్టమే!
[ 20-04-2024]
‘2019 ఎన్నికల ముందు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో ఊరూరా తిరిగిన జగన్మోహన్రెడ్డి.. రేషన్ దుకాణాల్లో నిత్యావసర సరకులే దొరకడం లేదంటూ ప్రతిపక్షాలను తీవ్రంగా విమర్శించారు. -
నేడు పొదలకూరులో ప్రజాగళం
[ 20-04-2024]
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరులో జరిగే ప్రజాగళం సభలో పాల్గొననున్నారు. -
నిమ్మ రైతుకు జగన్ దగా
[ 20-04-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో హామీలే తప్ప వాటి అమలుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మెట్టప్రాం తం కావడంతో ఎక్కువ మంది వర్షాధారిత పంటలపైనే ఆధారపడి జీవిస్తున్నారు.. -
ఉత్తర కాలువపై ఉత్తుత్తి హామీ
[ 20-04-2024]
అయిదేళ్లయింది. ఇప్పటి వరకు హామీ నెరవేర్చేందుకు చేసిన కృషి ఏమీ లేదు. ఆయకట్టు రైతులకు చేకూరిన ప్రయోజనమూ ఏమీలేదు. -
రెండో రోజు ఎనిమిది నామినేషన్లు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా 8 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు. -
మాటలే.. పనుల్లేవ్!
[ 20-04-2024]
పట్టణంలో ప్రధానమైన ట్రంకురోడ్డు అభివృద్ధి చేస్తామని సీఎం జగన్, ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి పలుమార్లు హామీలు ఇచ్చారు. -
సర్పంచుల ఒత్తిడితోనే ఆర్థిక సంఘం నిధుల విడుదల
[ 20-04-2024]
రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసిన తరువాత రూ.988 కోట్లు విడుదల అయ్యాయని సర్పంచుల సంఘం కార్యనిర్వాహక కార్యదర్శి నాగేంద్ర ప్రసాద్ రెడ్డి తెలిపారు. -
ఆర్ఐ రోడ్డుకు జగన్ పోటు
[ 20-04-2024]
తీరంలో నాలుగు మండలాల ప్రజలు రాకపోకలు సాగించే ప్రధాన రహదారిపై ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించింది. -
పల్లె పాలనకు వైకాపా గ్రహణం
[ 20-04-2024]
వింజమూరు రవి పాఠశాల నుంచి నడిమూరు దేవతమహల్ సెంటర్ వరకు కాలువల్లో పూడిక పేరుకుపోయింది. -
తనిఖీలు విస్తృతం చేయండి: కలెక్టర్
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా సరిహద్దులు, ఇతర ప్రధాన మార్గాల్లో ఏర్పాటు చేసిన చెక్పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.హరినారాయణన్ అధికారులను ఆదేశించారు. -
కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి కుటుంబం ఆస్తి రూ.2.45 కోట్లు
[ 20-04-2024]
నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం తెదేపా అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి కుటుంబం ఆస్తుల విలువ రూ.2.45 కోట్లుగా అఫిడవిట్లో చూపించారు. -
అభ్యర్థుల వ్యయాలపై దృష్టి
[ 20-04-2024]
ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఖర్చులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నెల్లూరు పార్లమెంటు వ్యయ పరిశీలకులు జి.ప్రసాద్ దత్తాత్రేయ పేర్కొన్నారు. -
నామపత్రాల ధరావతు ఎందుకు పెంచారంటే..
[ 20-04-2024]
ఎన్నికల్లో పోటీ చేయాలంటే ముందుగా అభ్యర్థులు నామినేషన్లు వేయాల్సి ఉంటుంది.