వసతిగృహాల్లో నాడు- నేడు పనులెన్నడో..?
ప్రభుత్వ భవనాల్లో నిర్వహిస్తున్న సాంఘీక సంక్షేమశాఖ వసతిగృహాలను నాడు-నేడు పథకంలో అభివృద్ధి చేసేందుకు ఐదు నెలల క్రితం అధికారులు ఎంపిక చేశారు. వాటికి సంబంధించిన నిధులు, ఇతర వివరాలను ఉన్నతాధికారులకు నివేదించారు.
న్యూస్టుడే, దుత్తలూరు, కలిగిరి
నాడు-నేడు పథకం కింద ఎంపికైన కలిగిరి మండలం శిద్ధనకొండూరు వసతిగృహం
ప్రభుత్వ భవనాల్లో నిర్వహిస్తున్న సాంఘీక సంక్షేమశాఖ వసతిగృహాలను నాడు-నేడు పథకంలో అభివృద్ధి చేసేందుకు ఐదు నెలల క్రితం అధికారులు ఎంపిక చేశారు. వాటికి సంబంధించిన నిధులు, ఇతర వివరాలను ఉన్నతాధికారులకు నివేదించారు. నూతన భవనాల నిర్మాణం కాకుండా మరమ్మతులు చేసేందుకు ప్రాధాన్యమిచ్చారు. నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. వసతిగృహాల్లో నెలకొన్న సమస్యలతో విద్యార్థులు నిత్యం సతమతమవుతున్నారు. ఉదయగిరి సహాయ సంక్షేమశాఖ పరిధిలో మొత్తం ఎనిమిది సాంఘీక సంక్షేమ శాఖ వసతిగృహాలున్నాయి. వీటిల్లో నాడు- నేడు పథకం కింద ఆరు ఎంపిక చేశారు. సీతారామపురం, కలిగిరి మండలం శిద్ధనకొండూరు, వింజమూరుతో పాటు మర్రిపాడు మండలంలోని మూడు దాకా ఉన్నాయి. వసతిగృహాల్లో భవనాల గోడలు, శ్లాబ్ పైకప్పు మరమ్మతులు చేయడం, తాగునీటి సౌకర్యం, విద్యుత్తు తీగలు బహిరంగంగా కనిపించకుండా పైపులు వేయడం, గోడలపై చిత్రలేఖనం, వసతిగృహాల ప్రాంగణాలను సుందరంగా తీర్చిదిద్దడం వంటి పనులు చేయాలని అధికారులు నిర్ణయించారు. విద్యార్థుల సంఖ్యననుగుణంగా మరుగుదొడ్లు, స్నానపు గదులు నిర్మించేందుకు అనుమతి ఇచ్చారు.
నిధుల కోసం ఎదురుచూపులు...
నివేదికలు పంపించి నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. గత జూన్ నెలలో ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అక్టోబరులో అధికారులు నివేదికలు పంపించారు. అప్పటి నుంచి ప్రభుత్వం నుంచి నిధుల విడుదలతో పాటు ఎలాంటి ఉత్తర్వులు రాకపోవడంతో అసలు పనులు జరుగుతాయే లేదోనని అధికారులు సందిగ్ధంలో ఉన్నారు.
ఉన్నతాధికారులకు నివేదించాం
ఆదిలక్ష్మీ, ఏఎస్డబ్ల్యూవో, ఉదయగిరి
ఉదయగిరి సాంఘీక సంక్షేమశాఖ పరిధిలో ఉన్న ఎనిమిది వసతిగృహాల్లో ఆరు వసతిగృహాలను ఎంపిక చేశాం. అక్కడున్న సమస్యలు, వాటికయ్యే ఖర్చులకు సంబంధించి ఉన్నతాధికారులకు నివేదికలు పంపించాం. నిధులు విడుదల కాగానే వసతిగృహాల్లో పనులు ప్రారంభించేలా తగిన ప్రణాళికలను సిద్ధం చేసుకున్నాం. ప్రస్తుతం వసతిగృహాల్లో విద్యార్థులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇసుక తోడేళ్లు.. పెన్నమ్మ కన్నీళ్లు
[ 24-04-2024]
ఇసుక అక్రమ తవ్వకాలు... అయిదేళ్ల వైకాపా పాలనలో నిత్యం వినిపించిన మాట. అధికార పార్టీ నాయకుల అండదండలతో పెన్నమ్మను కుళ్లబొడవడంతో పాటు నిబంధనలకు నీళ్లొదిలి అడ్డగోలుగా తవ్వి తరలించారు. -
అయిదేళ్ల కథ.. గోషా ఆసుపత్రి వ్యథ!
[ 24-04-2024]
మహిళలకు ప్రత్యేకంగా ఆసుపత్రిని ఏర్పాటు చేసి.. అత్యాధునిక వైద్య సేవలు అందిస్తామని వైకాపా ప్రజాప్రతినిధులు, నాయకులు ఊకదంపుడు ఉపన్యాసాలు చేశారు. -
అమ్మో దారి.. గుండెజారి
[ 24-04-2024]
జిల్లాలోని ప్రముఖ పెంచలకోన క్షేత్రానికి వెళ్లే రోడ్డది.. అంతటి ప్రాధాన్యమున్న మార్గాన్ని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో భక్తులతో పాటు పర్యాటకులు అవస్థలు పడాల్సి వస్తోంది. -
వైకాపా నాయకుల చేతివాటం
[ 24-04-2024]
సచివాలయాలకు వచ్చిన నిధులతో అధికార పార్టీ నాయకులు అడ్డగోలుగా పనులు చేస్తున్నారు. నిబంధనలకు నీళ్లొదిలారు. అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో నిధులన్నీ వృథా అవుతున్నాయి. -
వైకాపా పాలనలో రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్థకం: తెదేపా
[ 24-04-2024]
గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్థకమైందని కావలి తెదేపా కూటమి అభ్యర్థి దగుమాటి కృష్ణారెడ్డి ఆరోపించారు. గురువారం మండలంలోని వెలుపోడు, కాట్రాయపాడు, ధర్మవరంలో పర్యటించారు. -
నిరుద్యోగికి నిరాశే..
[ 24-04-2024]
నెల్లూరు నగరం వెంకటేశ్వరపురంలో ఉన్న ప్రభుత్వ బాలుర పాలిటెక్నిక్ కళాశాలలో తెదేపా ప్రభుత్వం సీమెన్స్ సంస్థ ఆధ్వర్యంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం ఏర్పాటు చేసి విద్యార్థులకు టెక్నికల్ విద్యలో ఉచితంగా శిక్షణ అందించింది. -
మాటలే తప్ప.. పరిశ్రమలెక్కడ!
[ 24-04-2024]
సర్వేపల్లి, కోవూరు, ఆత్మకూరు నియోజకవర్గాల్లో పరిశ్రమల ఏర్పాటుకు భూములు సేకరించి నిరుపయోగంగా వదిలేశారు... వైకాపా అయిదేళ్ల పాలనలో అలంకార ప్రాయంగా మారాయి. -
హామీ ఇచ్చి.. కష్టాల్లో ముంచి
[ 24-04-2024]
పాదయాత్రలో 3,648 కిలోమీటర్లు నడిచా... ప్రజలు పడుతున్న కష్టాలు విన్నా... కళ్లారా చూశా... రాష్ట్రంలో సహాయం కోసం ఎదురుచూస్తున్న ప్రతి మనిషి, కుటుంబానికి ఒక మాట ఇస్తున్నా... నేను విన్నాను... నేను ఉన్నాను అని మాట ఇస్తున్నా... -
తెలుగుతమ్ముళ్ల జోష్
[ 24-04-2024]
ఇంటూరి సోదరులు.. తెదేపాలో రాజకీయంగా క్రియాశీలక నాయకులు. నువ్వా? నేనా? అన్నట్లుగా సీటు కోసం పోటీపడ్డారు. అయితే, ఒకరిని అదృష్టం వరిస్తే.. మరొకరిని నిరాశపరిచింది. -
ఎస్సై దురుసు ప్రవర్తనపై ఆందోళన
[ 24-04-2024]
దళిత మహిళపై ఎస్సై దురుసుగా ప్రవర్తించడంతో మాల మహాసభ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం పోలీసుస్టేషన్ ఎదురుగా బాధితులు ఆందోళన చేపట్టారు. -
యువకుడి దారుణ హత్య
[ 24-04-2024]
నెల్లూరులో యువకుడిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు బీవీ నగర్ రైల్వేగేటు సమీపంలోని వినాయక స్వామి గుడి వీధిలో నివాసం ఉండే దశరథ (28) పదో తరగతి వరకు చదువుకుని.