భార్య హత్య కేసులో జీవిత ఖైదు
భార్య ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించి ఆమె మృతికి కారకుడైన కేసులో నేరం రుజువు కావడంతో తడ మండలంలోని తడ కండ్రిగకు చెందిన సైమన్ గ్లోరీదా వినోద్కుమార్ అలియాస్ మహమ్మద్ అహ్మద్కు జీవిత ఖైదుతోపాటు, రూ.5 వేలు జరిమానా విధిస్తూ 8వ ఆదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి సి.సుమ మంగళవారం తీర్పు చెప్పారు.
నెల్లూరు (లీగల్), న్యూస్టుడే: భార్య ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించి ఆమె మృతికి కారకుడైన కేసులో నేరం రుజువు కావడంతో తడ మండలంలోని తడ కండ్రిగకు చెందిన సైమన్ గ్లోరీదా వినోద్కుమార్ అలియాస్ మహమ్మద్ అహ్మద్కు జీవిత ఖైదుతోపాటు, రూ.5 వేలు జరిమానా విధిస్తూ 8వ ఆదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి సి.సుమ మంగళవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు.. తమిళనాడు రాష్ట్రం వేలూరు ప్రాంతానికి చెందిన ఎస్.వినోద్కుమార్ తమిళనాడులోని రంగాపురం గ్రామానికి చెందిన అన్సర్ఆఫ్రీన్నీసాను ప్రేమించి పెద్దల సమక్షంలో 2012 అక్టోబరు14 న వివాహం చేసుకున్నాడు. అనంతరం తడ సమీపంలోని శ్రీసిటీలో ఉద్యోగం వచ్చింది. దీంతో భార్యాభర్తలు తడకండ్రిగలో బాడుగ ఇంట్లో కాపురం ఉండేవారు. కట్నం రాలేదని తరచూ భార్యను వేధించే వాడు. ఈ క్రమంలో 2013 జూన్ 29వ తేదీ రాత్రి భార్య ఒంటిపై కిరోసిన్ పోసి అగ్గి పుల్లతో అంటించాడు. ఆమె కేకలు వేయగా చుట్టుపక్కల వారు రావడంతో నిందితుడు మంటలు ఆపే ప్రయత్నం చేశాడు. చికిత్స నిమిత్తం చెన్నై ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ 4-7 2013 జులై నాలుగో తేదీ మృతి చెందింది. తడ పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. కోర్టులో ఛార్జీషీటు దాఖలు చేశారు. విచారణలో నేరం రుజువు కావడంతో శిక్ష, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎస్.ప్రసాద్ కేసు వాదించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యుత్ నియంత్రణ అవసరం
[ 28-03-2024]
విద్యుత్ నియంత్రణ అవసరమని కొండాపురం మోడల్ స్కూల్ ఉపాధ్యాయుడు ఎస్కే ఖాదర్ బాషా తెలిపారు. -
పొగాకు బ్యారెన్లు దగ్ధం
[ 28-03-2024]
కొండాపురం మండలంలో ఆదిమూర్తిపురం గ్రామంలో ప్రమాదవశాత్తు 4 పొగకు బ్యారెన్లు దగ్ధమైన సంఘటన గురువారం జరిగింది. -
నాయకుల రాజీనామా
[ 28-03-2024]
కావలి టౌన్ 29వ వార్డ్ తెదేపాకు చెందిన యువనేత నరేంద్ర, మాజీ కౌన్సిలర్ శెట్టిపల్లి మధు పార్టీకి రాజీనామా చేశారు. -
ప్రచారం ప్రారంభించిన కావలి వైకాపా ఎమ్మెల్యే
[ 28-03-2024]
కావలి నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే, రానున్న ఎన్నికల్లో వైకాపా తరఫున పోటీ చేయనున్న ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి ప్రచారం ప్రారంభించారు. -
29న కావలి, వింజమూరుల్లో చంద్రబాబు పర్యటన
[ 28-03-2024]
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా పర్యటన ఖరారైంది. ఈ నెల 29వ తేదీ కావలి, ఉదయగిరి నియోజకవర్గాల్లో రోడ్షో, బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. -
ఆ మూడే.. తుపాకులు ఇవ్వాల్సిందే
[ 28-03-2024]
ఎన్నికలు వచ్చాయంటే.. లైసెన్సు కలిగిన ప్రతి ఆయుధం పోలీసుశాఖకు అప్పగించాలన్నది నిబంధన. బ్యాంకుల భద్రత కోసం ముందస్తు అనుమతితో సెక్యూరిటీ సిబ్బంది మినహాయించి.. మిగిలిన వారంతా ఆయా స్టేషన్ల పరిధిలో వాటిని అప్పగించాల్సిందే -
అధనం.. నీదే భారం!
[ 28-03-2024]
ఎన్నికల సమయం ఎక్కువగా ఉంది. ప్రచార ఖర్చులు పెరగడంతో పాటు గెలుపోటములను ప్రభావితం చేసే కార్యకర్తలు, నాయకుల వ్యయాలను అభ్యర్థులే భరించాల్సి వస్తోంది. -
తెరచుకోని పాఠం
[ 28-03-2024]
మూలాపేటలోని రామయ్య బడి(మున్సిపల్ హైస్కూల్)లో 44 మంది విద్యార్థులు, అయిదుగురు ఉపాధ్యాయులకు ట్యాబ్లు అందించారు -
ఇద్దరు వాలంటీర్లు, క్షేత్ర సహాయకుడి తొలగింపు
[ 28-03-2024]
నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఇద్దరు గ్రామ వాలంటీర్లు, ఒక క్షేత్రసహాయకుడిని తొలగించడంతో పాటు వారిపై కేసులు నమోదు చేసినట్లు ఆర్వో ఓబులేసు తెలిపారు. -
ఓటరన్నా.. మేలుకో!
[ 28-03-2024]
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ఈనెల 16వ తేదీన విడుదలైంది. ఐదేళ్లకు ఓసారి పాలకులను ఎన్నుకునే సమయం కూడా ఆసన్నమైంది. మనం వేసే ఓటు గెలుపోటములను నిర్ణయిస్తోంది. -
జిల్లాకే తలమానికం.. పునాదులకే పరిమితం
[ 28-03-2024]
-
కన్నీటి శృతి
[ 28-03-2024]
తల్లి మరణవార్త తెలిస్తే బిడ్డ భవిష్యత్తు అంధకారమవుతుందనే ఆలోచనతో ఒక రోజంతా మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచిన హృదయ విదారక సంఘటన కందుకూరులో చోటుచేసుకుంది. -
గొంతుకోసి మహిళ హత్య
[ 28-03-2024]
మహిళను గొంతుకోసి కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన మూడో మైలులో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
భాజపాలో చేరిన భారత సంపన్న మహిళ.. అదే బాటలో సీనియర్ ఎంపీ
-
కాంగ్రెస్లో చేరనున్న కె.కేశవరావు, మేయర్ విజయలక్ష్మి
-
అనధికారిక లావాదేవీలపై యూజర్ల ఆందోళన.. స్పందించిన యాక్సిస్ బ్యాంక్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి