175 కాదు.. అయిదే మిగులుతాయ్ అబ్దుల్ అజీజ్
రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు గెలవాలని సీఎం జగన్మోహన్రెడ్డి చెబుతున్నారని, ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఐదే మిగిలేలా ఉన్నాయని నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ ప్రకటించారు.
నెల్లూరు (స్టోన్హౌస్పేట), న్యూస్టుడే: రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు గెలవాలని సీఎం జగన్మోహన్రెడ్డి చెబుతున్నారని, ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఐదే మిగిలేలా ఉన్నాయని నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ ప్రకటించారు. నెల్లూరులోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. వైకాపా ఆవిర్భావం నుంచి ఆపార్టీతో నడిచిన నాయకులు ఇప్పుడు విభేదిస్తున్నారన్నారు. జిల్లాలో రెండు మూడు నెలలుగా జిల్లాలో ఇద్దరు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారన్నారు. వారే కాదని మరో నలుగురు కూడా మాకు దరఖాస్తు పెట్టుకున్నారన్నారు.జిల్లా ఎస్పీ చేసిన పాపాల నుంచి ఆయన్ను ఎవరూ కాపాడలేరన్నారు. ధర్నాలు చేస్తే కేసులు పెట్టడానికి మాత్రమే పనికొస్తారని ఆరోపించారు. నాయకులు చేజర్ల వెంకటేశ్వర్లురెడ్డి, జెన్ని రమణయ్య, జలదంకి సుధాకర్ పాల్గొన్నారు.
ఆ మాటలు సరికాదు: పోలీసు సంఘం
నెల్లూరు (నేర విభాగం): పోలీసు వ్యవస్థను కించపరిచేలా మాజీ మేయరు అబ్దుల్ అజీజ్ మాట్లాడటం తగదని పోలీసు అధికారుల సంఘం నాయకులు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ఉమేష్చంద్ర కాన్ఫరెన్స్ హాలులో పోలీసు అధికారుల సంఘం నాయకులు మద్దిపాటి ప్రసాద్ రావు, వై.శ్రీహరి, మౌలుద్దీన్ తదితరులు మాట్లాడారు. చట్టానికి లోబడి విధులు నిర్వర్తించే పోలీసు అధికారులు, సిబ్బందిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. మాజీ మేయరు అబ్దుల్ అజీజ్ పోలీసులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండు చేశారు. సమావేశంలో నాయకులు పౌల్రాజు, తురకా శ్రీనివాసులు, ఎంజీఆర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
అంగన్వాడీ పోస్టులకు ఇంటర్వ్యూలు 4న
నెల్లూరు (సంక్షేమం), ఉదయగిరి: జిల్లాలోని ఆత్మకూరు, కావలి, కందుకూరు రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో అంగన్వాడీ ఖాళీలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఫిబ్రవరి నాలుగో తేదీ ఇంటర్వ్యూలు జరుగుతాయని ఐసీడీఎస్ పీడీ సౌజన్య తెలిపారు. నెల్లూరు ఐసీడీఎస్ కార్యాలయంలో సీడీపీవోలతో మంగళవారం ఆమె వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికేట్లు తప్పని సరిగా తీసుకురావాలన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెన్నూరు వైకాపా సర్పంచ్ తెదేపాలో చేరిక
[ 23-04-2024]
దగదర్తి మండలం చెన్నూరు మేజర్ పంచాయతీ సర్పంచ్ బుక్కే సునీత, ఆమె భర్త వెంకట రమణ నాయక్ వైకాపాను వీడి తెదేపాలో చేరారు. -
పది ఫలితాల్లో నిరాశే..
[ 23-04-2024]
తన కుమార్తె పదో తరగతి చదువుతుందని కాలనీలో అందరికీ చెప్పుకుంటూ కూలి పనులకు వెళ్లి జీవనం సాగిస్తున్న తల్లి దాలు లక్ష్మి గత నెలలో రహదారి ప్రమాదంలో మరణించింది. -
పసుపు దళం.. విజయగళం
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో నాలుగో రోజు పలు రాజకీయ పార్టీల అభ్యర్థులు కోలాహలంగా నామినేషన్లు దాఖలు చేశారు. -
పచ్చటి బతుకులపై ఫ్లోరైడ్
[ 23-04-2024]
బతికుండగానే మనిషిని నిలువునా కుంగదీసి జీవచ్ఛవంలా మార్చే ఫ్లోరైడ్ నీటితో ప్రాణాలు పోతున్నాయని తెలిసినా పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదు. వైకాపా అధికారంలోకి వస్తే ఎక్కడికక్కడ శుద్ధజల కేంద్రాలు ఏర్పాటు చేస్తామని హామీలు గుప్పించిన ప్రజాప్రతినిధులు.. సమస్య పరిష్కారం దిశగా గత ప్రభుత్వాల్లో ఏర్పాటు చేసిన వాటినీ పట్టించుకోలేదు. -
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై నిఘా పెంచండి
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఎస్పీ కె.ఆరిఫ్ హఫీజ్ పోలీసు అధికారులను ఆదేశించారు -
ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాల్సిందే: కలెక్టర్
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా సరిహద్దులు, ఇతర ప్రధాన మార్గాల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వద్ద ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.హరినారాయణన్ అధికారులను ఆదేశించారు. -
కోడ్ ఉంటే మాకేంటి..!
[ 23-04-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు పక్కాగా జరుగుతోందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.హరినారాయణన్ చెబుతుండగా క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది -
మీ మాటలకు మోసపోయాం!
[ 23-04-2024]
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే వేతనం రూ.15 వేలకు పెంచుతానంటూ గత ఎన్నికల ప్రచారంలో జగన్ హామీ ఇచ్చారు. -
జగన్ హామీ.. నెరవేరదేమీ?
[ 23-04-2024]
అనుమసముద్రంపేట దర్గా రోడ్లు విస్తరణ పేరుతో ఇలా ఛిద్రం చేశారు. ఆపై అభివృద్ధి మరిచారు. పనులు సొంతం చేసుకున్న అధికార పార్టీ నాయకులు చేపట్టకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. -
గెలిచి వచ్చి అభివృద్ధి చేస్తా: వేమిరెడ్డి
[ 23-04-2024]
గెలుపుతో స్వగ్రామానికి తిరిగి వచ్చి అభివృద్ధి చేస్తానని తెదేపా ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి తెలిపారు. సోమవారం నామినేషన్ వేసిన అనంతరం తన స్వగ్రామం ఇందుపూరుకు వచ్చారు -
ఆస్తులు బుగ్గవుతుంటే.. నివారించలేని జగన్ ప్రభుత్వం
[ 23-04-2024]
వేసవిలో అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అప్రమత్తంగా లేని సమయంలో ప్రమాదాలు సంభవించి ఆస్తులు బూడిద అవుతున్నాయి
తాజా వార్తలు (Latest News)
-
ఇండిగో విమానాల్లో ఇక వినోదం.. తొలుత ఈ రూట్లోనే..
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM