ప్రవల్లిక.. క్రీడల్లో మెరిక
ఆ విద్యార్థినికి క్రీడలంటే మక్కువ... చదువుతో పాటు ఆటల్లో రాణిస్తోంది. ప్రతిభను గుర్తించిన వ్యాయామ ఉపాధ్యాయినులు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.
న్యూస్టుడే, దుత్తలూరు
సాధించిన పతకాలు చూపిస్తున్న విద్యార్థిని
ఆ విద్యార్థినికి క్రీడలంటే మక్కువ... చదువుతో పాటు ఆటల్లో రాణిస్తోంది. ప్రతిభను గుర్తించిన వ్యాయామ ఉపాధ్యాయినులు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. దశల వారీగా మండల, నియోజకవర్గ, జిల్లా, జాతీయ స్థాయిలో ప్రతిభ చూపింది. విద్యార్థినులకు తమకిష్టమైన క్రీడల్లో ప్రోత్సహించడంతోనే తాను జాతీయ స్థాయికి ఎంపికైనట్లు పేర్కొంది.
మర్రిపాడు మండలం చాబోలుకు చెందిన రేకలగుంట ప్రవల్లిక ప్రాథమిక విద్య సొంత మండలంలో చదివింది. తల్లిదండ్రులు బాలపోలయ్య, లక్ష్మీదేవిలు కూలీలుగా పనిచేస్తూ విద్యార్థిని చదివిస్తున్నారు. ప్రాథమిక విద్య అనంతరం నందిపాడులోని కస్తూర్బాలో 2016లో ఆరోతరగతిలో చేరింది. విద్యాలయంలో విద్యతోపాటు క్రీడల్లో ప్రత్యేక తర్ఫీదు ఇస్తుండటంతో పాటు క్రీడల్లో మక్కువ పెంచుకుంది. ప్రారంభంలో ఖోఖో, కబడ్డీ అంశాల్లో సాధన చేసింది. మండల, నియోజకవర్గస్థాయిలో గ్రిగ్స్ పోటీల్లో సత్తాచాటింది. వివిధ అంశాల్లో ప్రతిభ చాటుతుండటంతో వ్యాయామ ఉపాధ్యాయినులు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. త్రోబాల్తో పాటు షూటింగ్ బాల్లో విశేష ప్రతిభ చూపింది. విద్యాలయంలో ప్రతినిత్యం ఆయా అంశాల్లో సాధన చేస్తూ పలు పతకాలు సొంతం చేసుకుంది.
విజయాలివే...
* 2016 నుంచి 2018 వరకు జరిగిన సీఎం కప్ పోటీల్లో త్రోబాల్ విభాగంలో మండల, నియోజకవర్గస్థాయిలో ప్రథమ స్థానం సాధించి, జిల్లాస్థాయిలో పోటీల్లో ప్రతిభ చాటి చిత్తూరు జిల్లా పీలేరులో జరిగిన రాష్ట్ర పోటీలకు అర్హత సాధించింది. 2019లో నిర్వహించిన అసోసియేషన్ మీట్లో సీనియర్ త్రోబాల్ విభాగంలో ఏలూరులో జరిగిన రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. 2022లో జరిగిన షూటింగ్ బాల్లో సీనియర్స్ టోర్నీ విభాగంలో తెనాలిలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తాచాటింది. ప్రతిభ కనబరచడంతో రాజస్థాన్లోని జైపూర్లో జరిగిన జాతీయ స్థాయిలో పోటీలకు ఎంపికైంది. అక్కడ పతకం సాధించకపోయినా పోటీల్లో మంచి ప్రతిభ కనబరచడంతో పలువురి ప్రశంసలు అందుకుంది.
జాతీయ క్రీడాకారిణిగా రాణించడమే లక్ష్యం : ప్రవల్లిక
చిన్నప్పటి నుంచి పాఠశాలల్లో జరిగే ప్రతి పోటీల్లో పాల్గొన్నా. ఇష్టమైన త్రోబాల్, షూటింగ్ బాల్ పోటీల్లో పాల్గొన్నా. విద్యాలయ ప్రత్యేకాధికారిణులు, వ్యాయామ ఉపాధ్యాయుల సహకారంతోప్రత్యేక శిక్షణ తీసుకున్నా. త్రోబాల్, షూటింగ్ బాల్ విభాగాల్లో రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనడం ఉత్సాహన్నిచ్చింది. జాతీయ క్రీడాకారిణిగా రాణించడమే లక్ష్యం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గడప గడపన జగన్నాటకం!
[ 25-04-2024]
అధికారంలోకి వచ్చిన మూడేళ్లపాటు దోచుకోవడమే విధిగా వైకాపా సాగించిన పాలనతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపించడంతో ‘గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రజలను నేరుగా కలుసుకోవడం.. వారి సమస్యలను తెలుసుకోవడం.. -
జలహిత మెరుగరు? జనఘోష పట్టదు!
[ 25-04-2024]
జగన్ ప్రభుత్వ పాలనలో సహజ వనరుల దోపిడీ ఎంత విశృంకళంగా సాగిందో... జిల్లా జీవనాడిగా వినుతికెక్కిన సోమశిల జలాశయ సంరక్షణపై అంతే నిర్లక్ష్యం చూపింది. పాలనలో డొల్లతనానికి. -
వైకాపా ‘మందు’చూపు
[ 25-04-2024]
నిబంధనల ప్రకారం ఒక్కోమనిషికి మూడు సీసాలకు మించి మద్యం అమ్మకూడదు. ఒక వేళ పలుమార్లు వెళ్లి కొనుగోలు చేసినా.. పది, ఇరవైకి మించి ఉండవు. అలాంటిది.. -
కావలి సమీపంలో ఘోర ప్రమాదం
[ 25-04-2024]
వారంతా స్నేహితులు.. ఫ్యాన్సీ దుకాణంలోకి అవసరమైన ఇమిటేషన్ ఆభరణాల కొనుగోలుకు చెన్నై వెళ్లారు. అనంతరం కారులో వస్తున్నారు. అందరూ గాఢ నిద్రలోకి జారుకున్నారు. -
ఎన్నికల సందేహాలా.. కాల్ చేయండి
[ 25-04-2024]
ఎన్నికలకు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా నివృత్తి చేసుకోవచ్చని జిల్లా పోలీసు పరిశీలకులు అశోక్ టి దుధే ఒక ప్రకటనలో తెలిపారు. -
మే 2 నుంచి ఓటరు సమాచార స్లిప్పులు
[ 25-04-2024]
మే నెల రెండు నుంచి ఎనిమిదో తేదీ వరకు ఓటరు సమాచార స్లిప్పులు పంపిణీ చేయాలని కలెక్టర్ ఎం.హరినారాయణన్ అధికారులకు సూచించారు. -
తాగునీటి సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూమ్
[ 25-04-2024]
జిల్లాలో తాగునీటి సమస్యలు పరిష్కరించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఎం.హరినారాయణన్ ప్రకటనలో తెలిపారు. -
సర్వేపల్లిలో ప్రతిఘటనకు సిద్ధం
[ 25-04-2024]
సర్వేపల్లిలో మంత్రి కాకాణి ఆగడాలను ప్రతిఘటించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అన్నారు. వెంకటాచలంలో బుధవారం నామినేషన్ దాఖలు అనంతరం మాట్లాడారు. -
ప్రభుత్వం చెంతే ప్రతిపాదనలు
[ 25-04-2024]
ఎలాంటి విపత్తు ఎదురైనా ముందు గుర్తుకొచ్చేది అగ్నిమాపకశాఖ.. ఆ శాఖనే ప్రభుత్వం పట్టించుకుకోలేదు. వేసవిలో పెద్దసంఖ్యలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటుంటాయి. -
జగనన్న ఇల్లు.. రాలేదన్నా!
[ 25-04-2024]
నవరత్నాలు.. పేదలందరికీ ఇళ్లు. ఇదీ ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీ. ఇందుకు జగనన్న కాలనీలు నిర్మిస్తున్నామని ఘనంగా ప్రకటించారు. అధికారంలోకి వచ్చి అయిదేళ్లయింది. ఈ హామీ అమలుకాలేదు. -
దక్షిణ బజారు.. సమస్యలతో బేజారు
[ 25-04-2024]
పట్టణంలోని ప్రధాన కాలనీల్లోనూ మౌలిక వసతుల సమస్యలు స్థానికులను వేధిస్తున్నాయి. గత నాలుగేళ్లుగా మున్సిపాలిటీ అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదనేందుకు ఆయా... -
గుంతల రోడ్లు... పూడిన కాలువలు
[ 25-04-2024]
షబ్బీర్ కాలనీలో సీసీ రోడ్లు రాళ్లు తేలడటంతో చీకటిలో నడవాలంటే ఎక్కడ అదుపుతప్పి పడిపోతామోనని ఆందోళన చెందుతున్నారు. మురుగు కాలువలు చెత్తతో నిండినా సిబ్బంది శుభ్రం చేయటంలేదని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ