Kotamreddy: అన్నా.. జగనన్నా.. నీ ఫోన్ ట్యాప్ చేస్తే?: కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఫోన్ ట్యాపింగ్(Phone Tapping)పై వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఆధారాలు లేకుండా మాట్లాడే వ్యక్తిని కాదని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైకాపా నుంచి పోటీ చేయాలని తనకి లేదని ఆయన స్పష్టం చేశారు.
నెల్లూరు: వచ్చే ఎన్నికల్లో వైకాపా (YSRCP) నుంచి పోటీ చేయాలని తనకి లేదని ఆ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి (Kotamreddy) స్పష్టం చేశారు. ఇంటెలిజెన్స్ అధికారులు తనపై నిఘా పెట్టి ఫోన్ ట్యాప్ (Phone Tapping) చేస్తున్నారంటూ గత రెండు రోజులుగా ఆరోపణలు చేస్తున్న ఆయన.. బుధవారం నెల్లూరులో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు సహా సొంత పార్టీ నేతలను ఉద్దేశించి కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
వైకాపా నుంచి పోటీకి నా మనసు అంగీకరించట్లేదు
‘‘ఇలాంటి ప్రెస్మీట్ పెడతానని అనుకోలేదు. వైఎస్కు, జగన్కు ఎంత వీరవిధేయుడినో అందరికీ తెలుసు. పార్టీ విపక్షంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఎంతో పోరాడా. వైకాపా అధికారంలోకి వచ్చాక గుర్తింపు లేకపోయినా బాధపడలేదు. పార్టీ గురించి నేనెక్కడా ఒక్క మాట కూడా పొరపాటుగా మాట్లాడలేదు. నేనెప్పుడూ జనంలోనే ఉన్నా. కొన్ని రోజులుగా ఇంటెలిజెన్స్ అధికారులు నాపై నిఘాపెట్టారు. అధికార పార్టీ నేతలపై నిఘా ఎందుకని బాధపడ్డా. నా ఫోన్ ట్యాప్ అవుతోందని 4 నెలల ముందే ఓ ఐపీఎస్ అధికారి చెప్పారు. సీఎంపై కోపంతో ఆ అధికారి అబద్ధం చెప్పారని భావించా. గత కొన్ని రోజులుగా ఇంటెలిజెన్స్ అధికారులు నాపై నిఘా పెట్టారు. అనుమానం ఉన్నచోట నేనుండలేను. నా రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో వైకాపా నుంచి పోటీ చేయాలని లేదు. ఆ పార్టీ నుంచి పోటీకి నా మనసు అంగీకరించడం లేదు. నన్ను సంజాయిషీ అడగకుండానే నాపై చర్యలు చేపట్టారు.
అవి సీఎం మాటలుగా భావిస్తున్నా..
నేను ఆధారాలు బయటపెడితే ఇద్దరు ఐపీఎస్ అధికారులకు ఇబ్బంది అవుతుంది. నిన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి ఫోన్ ట్యాపింగ్ జరగలేదని చెప్పారు. పార్టీ నుంచి వెళ్లేవాళ్లు వెళ్లొచ్చని ఆయన అన్నారు. బాలినేని మాటలను సీఎం మాటలుగా భావిస్తున్నా. మంత్రులు, సీజే, జడ్జిలు, మీడియా ప్రతినిధుల ఫోన్లు కూడా ట్యాప్ చేస్తారు. మనసు ఒకచోట.. శరీరం మరోచోట ఉండటం నాకిష్టం లేదు. అన్నా.. జగనన్నా.. నీ ఫోన్ ట్యాప్ చేస్తే ఎలా ఉంటుంది?సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, ధనుంజయ్రెడ్డి ఫోన్లు ట్యాప్ చేస్తే వారి స్పందన ఎలా ఉంటుంది? తప్పు చేసి ట్యాపింగ్ జరగలేదని చెబుతారా? నేను ఆధారాలు బయటపెడితే కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం జవాబు చెప్పాల్సి వస్తుంది.
ఇంతకంటే ఆధారాలేం కావాలి?
కొన్ని రోజుల క్రితం నా బాల్య మిత్రుడితో ఐఫోన్లో మాట్లాడా. ఆ విషయాల గురించి ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు అడిగారు. ఇంటెలిజెన్స్ చీఫ్ నాకు ఆడియో క్లిప్ పంపారు. ట్యాపింగ్ చేశారనడానికి ఇంతకుమించి ఆధారాలేం కావాలి? ఫోన్ ట్యాపింగ్ కాకుండా ఆడియో క్లిప్ ఎలా బయటకు వచ్చింది? రెండు ఐఫోన్ల మధ్య సంభాషణ ట్యాప్ చేయకుండా ఎలా వచ్చింది? 9XXXXX6000 నంబర్ నుంచి ఆడియో క్లిప్ వచ్చింది.. ఆ నంబర్ ఎవరిదో చెక్చేసుకోండి. ఏసీబీ చీఫ్గా ఉన్నప్పటి నుంచి సీతారామాంజనేయులు ఆ నంబర్ను వాడుతున్నారు. నేను ట్యాపింగ్ అంటున్నా.. కాదంటే మీరు నిరూపించండి. నా ప్రశ్నలకు ఎవరు సమాధానం చెబుతారో చెప్పండి. ట్యాపింగ్పై కేంద్రహోంశాఖు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయబోతున్నా. దేశద్రోహులు, స్మగ్లర్లపైనే అనుమతి తీసుకుని వారి ఫోన్లను ట్యాప్ చేస్తారు. ఫోన్లు ట్యాప్ చేస్తే కాపురాలు నిలబడతాయా? ప్రభుత్వ పెద్దలే ఇలా చేస్తుంటే ఇంకెవరికి చెబుతాం. దీనిపై అందరూ ఆలోచించుకోవాలి.
తెదేపా తరఫున పోటీ చేయాలనుంది..
ఫోన్ ట్యాపింగ్ నిర్ధారణ అయ్యాకే నా ప్లాన్ నేను చేసుకుంటున్నా. భవిష్యత్ కార్యాచరణ తర్వాత ప్రకటిస్తా. ఆధారాలు లేకుండా మాట్లాడే వ్యక్తిని కాదు. పార్టీ నుంచి మౌనంగా వెళ్దామనుకున్నా. నన్ను దోషిగా నిలబెట్టాలని చూశారు.. అందుకే ట్యాపింగ్ను బయటపెట్టా. బాలినేని వద్దకు మా తమ్ముడు స్వయంగా వెళ్లలేదు. ఆయన పిలిస్తేనే వెళ్లారు. ఐబీ చీఫ్ తనంతట తాను నాతో మాట్లాడారని అనుకోవట్లేదు. పార్టీ పెద్దలు చెబితేనే ఆయన నాతో మాట్లాడారని అనుకుంటున్నా. నేను ఇటీవల సీఎంను కలిసిన సమయానికి ట్యాపింగ్ ఆధారం నా వద్ద లేదు. రాష్ట్రంలో వంద మందికి కేబినెట్ హోదా ఉంది. పార్టీ తరఫున నాకు ఏ గౌరవం ఇవ్వలేదు. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయన్నారు. ఐబీ చీఫ్ రాజకీయ నాయకుడి అవతారం ఎత్తుతారని నేను అనుకోలేదు. ట్యాపింగ్ అంశంలో అధికారులను తప్పుబట్టాల్సిన పనిలేదు. ప్రభుత్వ పెద్దలు చెబితేనే ట్యాపింగ్ జరుగుతుంది. భవిష్యత్ కార్యాచరణ ఏంటని కార్యకర్తలు అడిగారు.. తెదేపా తరఫున పోటీ చేయాలని ఉందని వారితో చెప్పా. ఈ విషయంలో నిర్ణయం ఆ పార్టీ అధినేత చంద్రబాబుది’’ అని కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు
రాయలసీమ ద్రోహి ఎవరో ప్రజలే తేల్చాలని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
భాజపాలో చేరిన భారత సంపన్న మహిళ.. అదే బాటలో సీనియర్ ఎంపీ
భారతదేశపు సంపన్న మహిళ సావిత్రి జిందాల్ (Savitri Jindal), బిజేడీ నుంచి 6 సార్లు ఎంపీగా ఎన్నికైన భర్తృహరి భాజపాలో చేరారు. -
కాంగ్రెస్లో చేరనున్న కె.కేశవరావు, మేయర్ విజయలక్ష్మి
భారాస ఎంపీ కె.కేశవరావు (కేకే), ఆయన కుమార్తె.. జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్లో చేరనున్నారు. -
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి
వినాశక వైకాపా ప్రభుత్వం..రాజధాని అమరావతి, అన్నా క్యాంటీన్లు సహా ప్రజల కోసం చంద్రబాబు తీసుకొచ్చిన ప్రతి ఒక్కటీ విధ్వంసం చేసిందని నారా భువనేశ్వరి మండిపడ్డారు. -
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!
బాలీవుడ్ నటుడు గోవిందా శివసేన (శిందే వర్గం) పార్టీలో చేరారు. సార్వత్రిక ఎన్నికల్లో ఆయన పోటీ చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. -
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు
కాంగ్రెస్ కంచుకోట కోలార్లో అసమ్మతి భగ్గుమంటోంది. ఈ స్థానానికి వారసత్వంగా సీటు కేటాయిస్తే రాజీనామాలు చేస్తామని పార్టీ సీనియర్ నేతల నుంచి ధిక్కారస్వరం వినిపిస్తోంది. -
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 99.86 శాతం పోలింగ్
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. -
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
తాను ఎక్కడున్నా ఓ కన్ను కొడంగల్పైనే ఉంటుందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. -
భూమా అఖిలప్రియను అడ్డుకున్న వైకాపా నేతలు.. యర్రగుంట్లలో ఉద్రిక్తత
మాజీ మంత్రి, ఆళ్లగడ్డ తెదేపా అభ్యర్థి భూమా అఖిలప్రియను వైకాపా నేతలు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
వైకాపా ప్రభుత్వం పని అయిపోయిందని తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు ఎన్డీయే కూటమికి మద్దతివ్వాలని కోరారు. -
కేసీఆర్ ఎవరినీ నమ్మలేదు.. అందుకే ఫోన్ ట్యాపింగ్: భాజపా ఎంపీ లక్ష్మణ్
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు భారాసను ఓడించి శిక్ష విధించినా ఆ పార్టీ నేతలు అహంకారాన్ని వీడటం లేదని భాజపా ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. -
కొనసాగుతున్న మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించనున్నారు. -
కంగనపై వివాదాస్పద వ్యాఖ్యలు.. సుప్రియా శ్రీనేత్కు కాంగ్రెస్ షాక్!
Congress: కంగనా రనౌత్పై కాంగ్రెస్ నేత సుప్రియ శ్రీనేత్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీంతో ఆమెను పార్టీ తాజా లోక్సభ అభ్యర్థుల జాబితా నుంచి తప్పించింది. -
ఇంటికి కిలో బంగారం పంచినా జగన్కు ఓటమే
అయిదేళ్ల అరాచక పాలనతో విసిగిన జనం.. జగన్ను తాడేపల్లి ప్యాలెస్లో శాశ్వతంగా బంధించేందుకు నిర్ణయించుకున్నారని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. -
నగదు, మద్యం దొరికినా అధికారులు స్పందించరేం?
తిరుపతి సమీపంలోని రేణిగుంట వద్ద వైకాపా నేతలకు చెందిన మద్యం, నగదు, ప్రచార సామగ్రి డంప్లు దొరికినా.. జిల్లా కలెక్టర్, ఆర్వోలు చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆంతర్యం ఏంటని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. -
ప్రకాశం ఇనుప ఖనిజాన్ని విశాఖ ఉక్కుకు కేటాయించాలి: సీపీఎం
ప్రకాశం జిల్లా యర్రజర్లకొండ ఇనుప ఖనిజాన్ని విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంత గనుల కింద కేటాయించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు లేఖ రాశారు. -
రాయలసీమ ద్రోహిని అడ్డుకోండి
యాత్రపేరుతో పరదాల చాటు నుంచి ముసుగువీరుడు బయటకొచ్చారని... ‘జగన్ నువ్వు రాయలసీమ ద్రోహివి.. ఇక్కడికి రావడానికి వీల్లేదు’ అని జనం గట్టిగా చెప్పాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. -
ముందు చెల్లికి సమాధానం చెప్పాలి
బస్సు యాత్ర పేరిట ఇడుపులపాయకు వెళ్లిన జగన్... బాబాయిని గొడ్డలితో చంపించిన వ్యక్తిని వెంట బెట్టుకుని బయటకొచ్చారని, అయిదేళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్న చెల్లి సునీత ఆవేదనను పట్టించుకోక పోవడమే కాకుండా సొంత చెల్లి షర్మిలకూ అన్యాయం చేశారని చంద్రబాబు విమర్శించారు. -
రాప్తాడు వైకాపా ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డికి అసమ్మతి సెగ
‘పరిటాల కుటుంబంతో పోరాటం అన్నది నా ఒక్కడితో సాధ్యం కాదు.. ఇప్పటికే ఒకసారి ఓడిపోయి ఇల్లు అమ్ముకొని రోడ్డున పడ్డానని ప్రకాశ్రెడ్డి అంటే ఆయనను ఇంట్లో కూర్చోబెట్టాం..మమ్మల్ని మాత్రం ఆయన రోడ్డున పడేశారు. -
మట్టి మింగేస్తున్నారు.. మనుషుల్ని చంపేస్తున్నారు
‘వైకాపా పాలనలో అక్రమ తవ్వకాలతో మట్టిని మింగేస్తున్నారు.. ప్రశ్నించిన మనుషులనూ చంపేస్తున్నారు. రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోంది. -
పవన్కల్యాణ్తో నాయకుల సమావేశం
ఒంగోలు ఎంపీ, తెదేపా నేత మాగుంట శ్రీనివాసులురెడ్డి.. జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్తో భేటీ అయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు
-
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!
-
తొలిసారి చేతులు కలిపిన దిగ్గజాలు.. అదానీ కంపెనీలో రిలయన్స్కు వాటా
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..