వైకాపాలో...మరో ధిక్కార స్వరం!
జిల్లాలో అధికార పార్టీపై మరో వైకాపా ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలో పరిశీలకుడి ఏర్పాటుపై ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్రెడ్డి మండిపడ్డారు.
ప్రభుత్వం నియమించిన పరిశీలకుడిపై మేకపాటి విమర్శలు
ఈనాడు డిజిటల్, నెల్లూరు: వరికుంటపాడు, న్యూస్టుడే
జిల్లాలో అధికార పార్టీపై మరో వైకాపా ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలో పరిశీలకుడి ఏర్పాటుపై ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్రెడ్డి మండిపడ్డారు. ఎమ్మెల్యేకు ప్రభుత్వానికి పరిశీలకుడు వారిధిగా ఉండాలన్న ఆయన.. తన నియోజకవర్గంలో ధనుంజయరెడ్డి అనే వ్యక్తి చిచ్చు పెడుతున్నారని ధ్వజమెత్తారు. మొదట్లో ఆనం రామనారాయణరెడ్డి కూడా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపైనే ధిక్కార స్వరం వినిపించారు. తనకు ప్రాధాన్యం తగ్గిపోతోందని పరోక్షంగా చెబుతూనే.. తర్వాత అభివృద్ధికి ప్రభుత్వం సహకరించడం లేదని విమర్శిస్తూ వచ్చారు. ఆ తర్వాత నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిదీ ఇదే పరిస్థితి. ఓ వైపు ముఖ్యమంత్రి జగన్కు అభినందనలు తెలుపుతూ.. తన నియోజకవర్గంలో అభివృద్ధికి అధికారులు సహకరించడం లేదని వ్యాఖ్యానించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. చివరకు పార్టీ అనుసరిస్తున్న విధానాలను తీవ్రంగా వ్యతిరేకించడంతో పాటు.. వచ్చే ఎన్నికల్లో వైకాపా పార్టీ తరఫున పోటీ చేసేదే లేదని స్పష్టం చేసిన విషయం విదితమే. తాజాగా మేకపాటి చంద్రశేఖర్రెడ్డి విమర్శలకు దిగారు. ఎమ్మెల్యేగా తాను ఉన్నప్పటికీ.. పరిశీలకుడిగా మరొకరిని పెట్టి ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. దాంతో జిల్లాలో వైకాపా నుంచి మరొకరు పార్టీకి దూరమవుతున్నారనే ప్రచారం మొదలైంది.
కొలిక్కిరాని గ్రామీణం పంచాయితీ
నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం వ్యవహారం ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి దగ్గరకు చేరింది. బాలినేని శ్రీనివాసులరెడ్డితో పాటు.. కొందరు జిల్లా నాయకులతో సీఎం చర్చించారు. వెంటనే నియోజకవర్గ సమన్వయకర్తను నియమించాలని నిర్ణయించారు. ఎవరనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఆనం విజయకుమార్రెడ్డితో మొదలై ఆదాల ప్రభాకర్రెడ్డి వరకు చాలా మంది పేర్లు చర్చకు వచ్చాయి. అయినా ఇప్పటివరకు ఈ ప్రక్రియ కొలిక్కి రాలేదు. బుధవారం కోటంరెడ్డి సోదరులు ఇద్దరు విలేకర్ల సమావేశం పెట్టి.. ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన ఆధారాలను బయటపెట్టడంతో పాటు.. పార్టీ నుంచి పోటీ చేయనని తేల్చిచెప్పారు. మరోవైపు వైకాపా నాయకుడు ఆనం విజయకుమార్రెడ్డి కోటంరెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో ఎప్పుడు, ఏం జరుగుతుందోనని వైకాపా నాయకులు, కార్యకర్తల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
మేకపాటి ఏమన్నారంటే..
వరికుంటపాడు మండలం తూర్పురొంపిదొడ్లలో బుధవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మేకపాటి చంద్రశేఖర్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నియమించిన పరిశీలకుడు ధనుంజయరెడ్డిని తీవ్రంగా విమర్శించారు. నియోజకవర్గంలో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే వాటిని సమన్వయం చేసి ఎమ్మెల్యేకు ఇబ్బంది లేకుండా వారధిగా వ్యవహరించేందుకు నియమించిన పరిశీలకుడు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ పార్టీకి చెడ్డపేరు తెస్తున్నారని మండిపడ్డారు. తనకు కానివారిని దగ్గరకు చేర్చుకుని.. పెత్తనం చెలాయించాలనుకుంటే కుదరదని హెచ్చరించారు. వైఎస్సార్ కుటుంబానికి తాను విధేయుడినని, తనపై పెత్తనం చేయాలంటే అధిష్ఠానం, మంత్రి, ఇంకెక్కడికైనా వెళ్లేందుకు సిద్ధమేనని తేల్చి చెప్పారు. ధనుంజయరెడ్డి తెదేపాకు చెందినవారని, తెదేపా నాయకులకు పనులు చేయాలని అధికారులకు సూచిస్తున్నారన్నారు. ఈ విషయం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. ఓ వర్గానికి కొమ్ముకాస్తూ.. పోలీసుస్టేషన్లలో పంచాయితీలు చేస్తున్నాడన్నారు. ఇప్పటికే వెంకటగిరి ప్రాంతంలో అప్పులు చేశాడని, ఇప్పుడు ఉదయగిరిలో మొదలుపెట్టినట్లు పేర్కొన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే నియోజకవర్గంలో వర్గభేదాలు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు
[ 19-04-2024]
నెల్లూరు జిల్లాలో అధికార పార్టీకి వాలంటీర్లు దూరమవుతున్నారు. -
పసుపులేటి గూటికి వైకాపా కీలక నేత
[ 19-04-2024]
కావలి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్కు రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. -
జనానికి ‘జగన్’ షాక్
[ 19-04-2024]
‘విద్యుత్తు రేట్లను పూర్తిగా తగ్గించేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా’.. అంటూ 2019, మే 30న ప్రమాణ స్వీకారం అనంతరం.. అదే వేదికపై నుంచి మొదటి ప్రసంగంలో తానిచ్చిన మాటను సీఎం జగన్మోహన్రెడ్డి తప్పారు. -
తొలి రోజు పది నామినేషన్లు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా గురువారం నామినేషన్ల ప్రక్రియ అట్టహాసంగా ప్రారంభమైంది. జిల్లాలో తొలిరోజు పది మంది అభ్యర్థులు 15 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
మాటల వంతెన.. చేతల వంచన!
[ 19-04-2024]
ప్రజల క్షేమమే లక్ష్యం.. వారి కష్టాలు తీరుస్తాం.. అండగా నిలుస్తామని పాదయాత్రలో జగన్ హామీలు ఇచ్చారు. ప్రజలు నమ్మి ఓట్లేసి గెలిపించారు. అయిదేళ్లు గడిచాయి. ఒక్క సమస్యా పరిష్కరించలేదు. -
బండేపల్లి.. బాధలు పట్టేదెవరికి?
[ 19-04-2024]
కనుపూరు కాలువ పరిధిలోని బండేపల్లి బ్రాంచి కెనాల్ ఆయకట్టు కింద సుమారు 25వేల ఎకరాలకుపైనే సాగు ఉండగా- ఆయకట్టు చెరువులకు సాగునీరందక ఏటా రైతులు ఇబ్బంది పడే పరిస్థితి. -
సమన్వయంతో పనిచేయండి: ఎస్పీ
[ 19-04-2024]
జిల్లాలో పోలీసులు, సెబ్ అధికారులు సమన్వయంతో పనిచేసి ఎన్నికల్లో అక్రమ మద్యం, నగదును ఇతర ప్రలోభాలకు అడ్డుకట్ట వేయాలని ఎస్పీ కె.ఆరిఫ్ హఫీజ్ ఆదేశించారు. -
జగన్.. మహిళా మార్టులు ఏవీ!
[ 19-04-2024]
స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు మండలానికో చేయూత మహిళా మార్టు ఏర్పాటు చేస్తామని గతంలో రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేసింది. -
జగనన్నా.. హామీ మరిచావా!
[ 19-04-2024]
కావలిలో నాన్న హయాంలో నిలిచిన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయించే బాధ్యత నాదని సీఎం జగన్ హామీ ఇచ్చిరు. ఇందుకు రూ.80 కోట్ల వరకు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఈప్రాంతంలోని వారంతా సంతోషించారు. -
రూ.5 కోట్ల బంగారు, వెండి ఆభరణాల పట్టివేత
[ 19-04-2024]
వైయస్ఆర్ జిల్లా గోపవరం మండలంలోని పీపీకుంట చెక్పోస్టు వద్ద గురువారం రూ.5 కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాలను ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్, బద్వేలు గ్రామీణ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి పట్టుకున్నారు. -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
[ 19-04-2024]
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పాలకా.. మా బాధలు కనవా!
[ 19-04-2024]
పట్టణంలోని సంతోష్నగర్లో ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారు. కాలనీలో 700 కుటుంబాలు ఉన్నాయి. రోడ్లు, కాలువలు సక్రమంగా లేవు. చిరుజల్లులు పడినా కుంటలను తలపించేలా నీరు నిలుస్తోంది. -
ఇటు చేరికలు.. అటు ప్రచారం
[ 19-04-2024]
మండల పరిధి విరువూరు, కృష్ణంరాజుపల్లె, కొండాయపాలెం, పంచాయతీల్లో తెదేపా మండల కన్వీనర్ చండ్రా మధుసూదన్రావు ఆధ్వర్యంలో గురువారం తెదేపా అభ్యర్థి కాకర్ల సురేష్ ప్రచారం నిర్వహించారు. -
మెము రైలులో దోపిడీ దొంగల బీభత్సం
[ 19-04-2024]
విజయవాడ-గూడూరు మెము రైల్లో ముగ్గురు దుండగులు ప్రయాణికుల వద్ద చరవాణులు, నగదు లాక్కొని దౌర్జన్యానికి దిగిన ఘటన కొండూరుసత్రం వద్ద జరిగింది. -
కోడ్ పట్టని మద్యం దుకాణం ఉద్యోగి
[ 19-04-2024]
ఎన్నికల నిబంధనలను ప్రభుత్వ ఉద్యోగులు కొందరు ఉల్లంఘిస్తున్నారు. స్థానిక మద్యం దుకాణం సెల్స్మెన్ ఆయుబ్ రెండ్రోజుల క్రితం ముఖ్యమంత్రి జగన్ వీడియోలను వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేయటంపై స్థానికంగా విమర్శలు వ్యక్తమయ్యాయి. -
ఆటో బోల్తా- 14 మంది కూలీలకు గాయాలు
[ 19-04-2024]
మండలంలోని తెట్టు రహదారిపై గురువారం ఉదయం ఆటో బోల్తా పడి 14 మందికి గాయాలయ్యాయి. బోగోలు మండలం వెంకటేశ్వరపురం, కావలి మండలం అన్నగారిపాలెం గ్రామాల కూలీలు వలేటివారిపాలెంలో మిరపకాయల కోతకు ఆటోలో వస్తున్నారు. -
24లోగా ఓటర్ల తుది జాబితా
[ 19-04-2024]
జిల్లాలో పెండింగ్లో ఉన్న ఓటరు దరఖాస్తులను ఈనెల 24వ తేదీ లోగా పరిష్కరించి తుది ఓటరు జాబితాను ప్రచురిస్తామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.హరినారాయణన్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
-
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
-
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ