పన్ను పేరుతో రూ. 2.40 కోట్లకు టోకరా
పొలం విక్రయించగా వచ్చిన నగదును పన్ను కడతామని నమ్మించి రూ.2.40 కోట్లు సొమ్ము కాజేసిన ఏఆర్ కానిస్టేబుల్ ఉదంతమిది.
ఓ కానిస్టేబుల్ నిర్వాకం
నెల్లూరు (నేర విభాగం), న్యూస్టుడే: పొలం విక్రయించగా వచ్చిన నగదును పన్ను కడతామని నమ్మించి రూ.2.40 కోట్లు సొమ్ము కాజేసిన ఏఆర్ కానిస్టేబుల్ ఉదంతమిది. వేదాయపాళెం పోలీసుల కథనం మేరకు.. బీవీనగర్ సంఘమిత్ర స్కూలు సమీపంలో మనుబోలు విజయలక్ష్మి, ఆదినారాయణరెడ్డి దంపతులు ఉంటున్నారు. ఆదినారాయణరెడ్డి ఆర్మీలో పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. మాస్టర్స్ అథ్లెటిక్స్ స్పోర్ట్స్లో విజయలక్ష్మి కార్యదర్శిగా పనిచేస్తున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వీరు యూకేలో డాక్టర్లుగా స్థిరపడ్డారు. వీరి రెండో కుమార్తె మీనారెడ్డి అత్త కృపామయిరెడ్డి 2011లో నవలాకులతోటలో ఉన్న పొలాన్ని విక్రయించారు. దీనికి సంబంధించి పన్ను ప్రభుత్వానికి చెల్లించలేదు. 2015లో ఆమె అనారోగ్యంతో మృతి చెందారు. ప్రభుత్వానికి పన్ను చెల్లించకపోవడంతో జరిమానాతో చెల్లించాలని విజయలక్ష్మి అల్లుడు అశోక్రెడ్డికి మెయిల్ రావడంతో నవలాకులతోటలో ఉన్న మరో 7.20 ఎకరాల భూమిని విక్రయించి ఆ నగదును పన్నుగా చెల్లించాలనుకున్నారు. 2020లో విజయలక్ష్మి యూకేలో ఉన్న కుమార్తె వద్దకు వెళ్లారు. పొలం విక్రయించే విషయం కుమార్తె, అల్లుడు చెప్పడంతో ఆ బాధ్యతను పరిచయం ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ వినయ్కుమార్, ఏఎస్సై యుగంధర్కు అప్పగించారు. వారిద్దరూ రఫీ అనే మధ్యవర్తి ద్వారా పి.వెంకటేశ్వరరెడ్డి, పి.శేషయ్య, ఎం.భాస్కర్రెడ్డి, ఎన్.సుకుమార్రెడ్డి కొనుగోలుకు సిద్ధంగా ఉన్నారని విజయలక్ష్మికి తెలియజేసి విక్రయించాక రూ.2.40 కోట్లు తీసుకున్నారు. ఈ నగదును తనకు తెలిసిన ఆడిటర్ ద్వారా ప్రభుత్వానికి పన్ను చెల్లిస్తున్నామని చెప్పి నమ్మించి సొమ్ము చేసుకున్నాడు. 2021లో విజయలక్ష్మి యూకే నుంచి నెల్లూరుకు తిరిగి వచ్చారు. గతేడాది డిసెంబరులో విజయలక్ష్మి కుమార్తె మీనారెడ్డికి ఆడిటర్ ఫోన్ చేసి పన్ను చెల్లింపునకు గడువు ముగుస్తోందని చెప్పడంతో ఆమె తల్లికి ఫోన్ చేసి చెప్పారు. దాంతో విజయలక్ష్మి ఆడిటర్ను విచారించగా డాక్యుమెంటరీ ఛార్జీలకు వినయ్కుమార్ తనకు రూ.5 లక్షలు ఇచ్చాడని చెప్పారు. దాంతో ఆమె.. ఏఆర్ కానిస్టేబుల్ను నగదు విషయమై ప్రశ్నించగా సరైన సమాధానం చెప్పకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్స్పెక్టర్ నరసింహారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వెంకటేశ్వరలో టీవీఎస్ ప్రాంగణ ఎంపికలు
[ 25-04-2024]
కొడవలూరులోని వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం జరిగిన క్యాంపస్ ప్లేస్మెంట్లో 21 మంది ఎంపికయ్యారని కళాశాల ఛైర్మన్ డాక్టర్ గుణశేఖర్ తెలిపారు. -
చంద్రబాబు పాలనలో రాష్ట్ర యువతకు ఉపాధి
[ 25-04-2024]
తెదేపా అధినేత చంద్రబాబు పాలనలో రాష్ట్ర యువతకు ఉపాధి, మంచి రోజులు రానున్నాయని కోవూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థిని శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. -
గడప గడపన జగన్నాటకం!
[ 25-04-2024]
అధికారంలోకి వచ్చిన మూడేళ్లపాటు దోచుకోవడమే విధిగా వైకాపా సాగించిన పాలనతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపించడంతో ‘గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రజలను నేరుగా కలుసుకోవడం.. వారి సమస్యలను తెలుసుకోవడం.. -
జలహిత మెరుగరు? జనఘోష పట్టదు!
[ 25-04-2024]
జగన్ ప్రభుత్వ పాలనలో సహజ వనరుల దోపిడీ ఎంత విశృంకళంగా సాగిందో... జిల్లా జీవనాడిగా వినుతికెక్కిన సోమశిల జలాశయ సంరక్షణపై అంతే నిర్లక్ష్యం చూపింది. పాలనలో డొల్లతనానికి. -
వైకాపా ‘మందు’చూపు
[ 25-04-2024]
నిబంధనల ప్రకారం ఒక్కోమనిషికి మూడు సీసాలకు మించి మద్యం అమ్మకూడదు. ఒక వేళ పలుమార్లు వెళ్లి కొనుగోలు చేసినా.. పది, ఇరవైకి మించి ఉండవు. అలాంటిది.. -
కావలి సమీపంలో ఘోర ప్రమాదం
[ 25-04-2024]
వారంతా స్నేహితులు.. ఫ్యాన్సీ దుకాణంలోకి అవసరమైన ఇమిటేషన్ ఆభరణాల కొనుగోలుకు చెన్నై వెళ్లారు. అనంతరం కారులో వస్తున్నారు. అందరూ గాఢ నిద్రలోకి జారుకున్నారు. -
ఎన్నికల సందేహాలా.. కాల్ చేయండి
[ 25-04-2024]
ఎన్నికలకు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా నివృత్తి చేసుకోవచ్చని జిల్లా పోలీసు పరిశీలకులు అశోక్ టి దుధే ఒక ప్రకటనలో తెలిపారు. -
మే 2 నుంచి ఓటరు సమాచార స్లిప్పులు
[ 25-04-2024]
మే నెల రెండు నుంచి ఎనిమిదో తేదీ వరకు ఓటరు సమాచార స్లిప్పులు పంపిణీ చేయాలని కలెక్టర్ ఎం.హరినారాయణన్ అధికారులకు సూచించారు. -
తాగునీటి సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూమ్
[ 25-04-2024]
జిల్లాలో తాగునీటి సమస్యలు పరిష్కరించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఎం.హరినారాయణన్ ప్రకటనలో తెలిపారు. -
సర్వేపల్లిలో ప్రతిఘటనకు సిద్ధం
[ 25-04-2024]
సర్వేపల్లిలో మంత్రి కాకాణి ఆగడాలను ప్రతిఘటించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అన్నారు. వెంకటాచలంలో బుధవారం నామినేషన్ దాఖలు అనంతరం మాట్లాడారు. -
ప్రభుత్వం చెంతే ప్రతిపాదనలు
[ 25-04-2024]
ఎలాంటి విపత్తు ఎదురైనా ముందు గుర్తుకొచ్చేది అగ్నిమాపకశాఖ.. ఆ శాఖనే ప్రభుత్వం పట్టించుకుకోలేదు. వేసవిలో పెద్దసంఖ్యలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటుంటాయి. -
జగనన్న ఇల్లు.. రాలేదన్నా!
[ 25-04-2024]
నవరత్నాలు.. పేదలందరికీ ఇళ్లు. ఇదీ ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీ. ఇందుకు జగనన్న కాలనీలు నిర్మిస్తున్నామని ఘనంగా ప్రకటించారు. అధికారంలోకి వచ్చి అయిదేళ్లయింది. ఈ హామీ అమలుకాలేదు. -
దక్షిణ బజారు.. సమస్యలతో బేజారు
[ 25-04-2024]
పట్టణంలోని ప్రధాన కాలనీల్లోనూ మౌలిక వసతుల సమస్యలు స్థానికులను వేధిస్తున్నాయి. గత నాలుగేళ్లుగా మున్సిపాలిటీ అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదనేందుకు ఆయా... -
గుంతల రోడ్లు... పూడిన కాలువలు
[ 25-04-2024]
షబ్బీర్ కాలనీలో సీసీ రోడ్లు రాళ్లు తేలడటంతో చీకటిలో నడవాలంటే ఎక్కడ అదుపుతప్పి పడిపోతామోనని ఆందోళన చెందుతున్నారు. మురుగు కాలువలు చెత్తతో నిండినా సిబ్బంది శుభ్రం చేయటంలేదని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ