logo

కుమార్తెపై తండ్రి అత్యాచారం

వరుసకు కుమార్తెపై తండ్రి అత్యాచారం చేసిన ఘటన ఒక గ్రామంలో జరిగింది. గుడ్లూరు సీఐ సుబ్బారావు తెలిపిన వివరాల ప్రకారం... ఉలవపాడు మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన ఏసు, పదిహేనేళ్ల క్రితం ఒక మహిళను రెండో వివాహం చేసుకున్నాడు.

Published : 02 Feb 2023 02:24 IST

గుడ్లూరు, న్యూస్‌టుడే: వరుసకు కుమార్తెపై తండ్రి అత్యాచారం చేసిన ఘటన ఒక గ్రామంలో జరిగింది. గుడ్లూరు సీఐ సుబ్బారావు తెలిపిన వివరాల ప్రకారం... ఉలవపాడు మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన ఏసు, పదిహేనేళ్ల క్రితం ఒక మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. అప్పటికే ఆమెకు కుమార్తె ఉంది. వివాహం అనంతరం వీరికి ఒక కుమారుడున్నాడు. గుడ్లూరు మండలంలోని మామిడి తోటలో కాపలాదారులుగా జీవనం సాగిస్తున్నారు. మంగళవారం రాత్రి మద్యం తాగిన ఏసు ఇంటి దగ్గర ఎవరూ లేకపోవడంతో కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంటికొచ్చిన తల్లికి విషయం చెప్పగా పోలీసులకు సమాచారమిచ్చారు. సీఐ సుబ్బారావు, ఎస్సై ప్రసాద్‌రెడ్డి సంఘటన స్థలానికి వెళ్లేలోగా నిందితుడు పరారయ్యాడు. వైద్య పరీక్షల కోసం బాలికను ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని