తరచూ మొరాయిస్తున్న 108 వాహనం
సాధారణంగా అత్యవసర చికిత్సల కోసం రోగులను, ప్రమాదాల్లోని క్షతగాత్రులను వైద్యశాలకు తరలించే క్రమంలో అంబులెన్స్లు వేగంగా వెళుతుంటాయి.
న్యూస్టుడే, కలిగిరి
సాధారణంగా అత్యవసర చికిత్సల కోసం రోగులను, ప్రమాదాల్లోని క్షతగాత్రులను వైద్యశాలకు తరలించే క్రమంలో అంబులెన్స్లు వేగంగా వెళుతుంటాయి. ఆ సమయంలో అంబులెన్స్ల కండిషన్ బాగుండాలి. 108 వాహనాలకు వినియోగించే టైర్లు అధ్వానంగా ఉన్నాయి. ఒకవైపు దారాలు, తీగలు బయటపడి రంధ్రాలు పడేలా ఉన్నాయి. ఇలాంటి టైర్లతో వాహనాలు వేగంగా వెళ్లే సమయంలో పగిలి ప్రమాదాలు జరిగే అవకాశముంది.
మండల కేంద్రమైన కలిగిరి కేంద్రంగా ఏర్పాటుచేసిన 108 అంబులెన్స్ వాహనం తరచూ మొరాయిస్తుండటంతో అత్యవసర సేవలు అవసరమైన రోగులు, ప్రమాదాల బారిన పడి క్షతగాత్రులు ఇబ్బందులు పడుతున్నారు. వారంలో నాలుగు రోజులు మరమ్మతులకు గురవుతోంది. కొన్ని రోజుల క్రితం అంబులెన్స్కు సెల్ఫ్ సమస్య ఉండేది. వాహనం కదలాలంటే నెట్టాల్సి రావడంతో షెడ్డుకు తీసుకెళ్లారు. ఆ సమస్యను మాత్రమే పరిష్కరించి జిల్లా అధికారులు తిరిగి పంపారు. వచ్చిన రెండు రోజులకే మళ్లీ వాహనం కదలడం లేదు. దీని స్థానంలో ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసిన అంబులెన్స్ సైతం మొరాయిస్తుంది.
కొండాపురం వాహనమే దిక్కు
కలిగిరిలోని అంబులెన్స్ సేవలు నిలిచిపోవడంతో ఇక్కడి నుంచి వెళ్లే ఫోన్ కాల్స్ను కొండాపురంలోని వాహన సిబ్బందికి కాల్సెంటర్ సిబ్బంది బదలాయిస్తున్నారు. కలిగిరికి సమీపంలో కొండాపురం మార్గంలో మంగళవారం రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. ఆ మార్గంలోని ప్రయాణికులు క్షతగాత్రులను వైద్యశాలకు చేర్చేందుకు 108 అంబులెన్స్కు ఫోన్ చేశారు. కలిగిరిలో అంబులెన్స్ అందుబాటులో లేదని, కొండాపురం వాహనానికి కాల్సెంటర్ సిబ్బంది కేసును అప్పగించారు. కొండాపురం నుంచి గోతుల రహదారిపై అంబులెన్స్ రావడం ఆలస్యమైంది. ఈలోగా ప్రైవేటు వాహనంలో వారిని ఆసుపత్రికి తరలించారు. కలిగిరి-కొండాపురం సమీపంలోని ఆదిమూర్తిపురం వద్ద ఘర్షణ జరిగింది. గాయపడిన వారిని వైౖద్యశాలకు తీసుకెళ్లేందుకు 108కు ఫోన్ చేయగా కొండాపురం అంబులెన్స్ వేరే కేసులో ఉంది. కలిగిరిలో వాహనం లేదు. తప్పనిసరి పరిస్థితిలో క్షతగాత్రులను ప్రైవేట్ వాహనంలో కొండాపురంలోని ఆసుపత్రికి తరలించారు. ఇలాంటి సంఘటనలు నిత్యం జరుగుతున్నా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు.
పొంతన లేని అధికారుల సమాధానం
దీనిపై 108 జిల్లా అధికారి పవన్కుమార్ను ‘న్యూస్టుడే’ వివరణ కోరగా కలిగిరిలోని అంబులెన్స్ను మరమ్మతులకు పంపామని, ప్రత్యామ్నాయంగా మరో అంబులెన్స్ను కలిగిరి కేంద్రంగా ఉంచామన్నారు. ఆ వాహనం మరమ్మతులకు గురైందని చెప్పగా.. లేదు వాహనం బాగానే ఉందని, కండిషన్లో ఉందని పొంతన లేని సమాధానమిచ్చారు. ఇక్కడ వాహనం బాగుంటే సమీపంలో జరిగిన కేసులను కాల్సెంటర్ సిబ్బంది కొండాపురం అంబులెన్స్కు ఎందుకు బదలాయిస్తున్నారో వారికే తెలియాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యుత్ నియంత్రణ అవసరం
[ 28-03-2024]
విద్యుత్ నియంత్రణ అవసరమని కొండాపురం మోడల్ స్కూల్ ఉపాధ్యాయుడు ఎస్కే ఖాదర్ బాషా తెలిపారు. -
పొగాకు బ్యారెన్లు దగ్ధం
[ 28-03-2024]
కొండాపురం మండలంలో ఆదిమూర్తిపురం గ్రామంలో ప్రమాదవశాత్తు 4 పొగకు బ్యారెన్లు దగ్ధమైన సంఘటన గురువారం జరిగింది. -
నాయకుల రాజీనామా
[ 28-03-2024]
కావలి టౌన్ 29వ వార్డ్ తెదేపాకు చెందిన యువనేత నరేంద్ర, మాజీ కౌన్సిలర్ శెట్టిపల్లి మధు పార్టీకి రాజీనామా చేశారు. -
ప్రచారం ప్రారంభించిన కావలి వైకాపా ఎమ్మెల్యే
[ 28-03-2024]
కావలి నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే, రానున్న ఎన్నికల్లో వైకాపా తరఫున పోటీ చేయనున్న ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి ప్రచారం ప్రారంభించారు. -
29న కావలి, వింజమూరుల్లో చంద్రబాబు పర్యటన
[ 28-03-2024]
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా పర్యటన ఖరారైంది. ఈ నెల 29వ తేదీ కావలి, ఉదయగిరి నియోజకవర్గాల్లో రోడ్షో, బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. -
ఆ మూడే.. తుపాకులు ఇవ్వాల్సిందే
[ 28-03-2024]
ఎన్నికలు వచ్చాయంటే.. లైసెన్సు కలిగిన ప్రతి ఆయుధం పోలీసుశాఖకు అప్పగించాలన్నది నిబంధన. బ్యాంకుల భద్రత కోసం ముందస్తు అనుమతితో సెక్యూరిటీ సిబ్బంది మినహాయించి.. మిగిలిన వారంతా ఆయా స్టేషన్ల పరిధిలో వాటిని అప్పగించాల్సిందే -
అధనం.. నీదే భారం!
[ 28-03-2024]
ఎన్నికల సమయం ఎక్కువగా ఉంది. ప్రచార ఖర్చులు పెరగడంతో పాటు గెలుపోటములను ప్రభావితం చేసే కార్యకర్తలు, నాయకుల వ్యయాలను అభ్యర్థులే భరించాల్సి వస్తోంది. -
తెరచుకోని పాఠం
[ 28-03-2024]
మూలాపేటలోని రామయ్య బడి(మున్సిపల్ హైస్కూల్)లో 44 మంది విద్యార్థులు, అయిదుగురు ఉపాధ్యాయులకు ట్యాబ్లు అందించారు -
ఇద్దరు వాలంటీర్లు, క్షేత్ర సహాయకుడి తొలగింపు
[ 28-03-2024]
నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఇద్దరు గ్రామ వాలంటీర్లు, ఒక క్షేత్రసహాయకుడిని తొలగించడంతో పాటు వారిపై కేసులు నమోదు చేసినట్లు ఆర్వో ఓబులేసు తెలిపారు. -
ఓటరన్నా.. మేలుకో!
[ 28-03-2024]
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ఈనెల 16వ తేదీన విడుదలైంది. ఐదేళ్లకు ఓసారి పాలకులను ఎన్నుకునే సమయం కూడా ఆసన్నమైంది. మనం వేసే ఓటు గెలుపోటములను నిర్ణయిస్తోంది. -
జిల్లాకే తలమానికం.. పునాదులకే పరిమితం
[ 28-03-2024]
-
కన్నీటి శృతి
[ 28-03-2024]
తల్లి మరణవార్త తెలిస్తే బిడ్డ భవిష్యత్తు అంధకారమవుతుందనే ఆలోచనతో ఒక రోజంతా మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచిన హృదయ విదారక సంఘటన కందుకూరులో చోటుచేసుకుంది. -
గొంతుకోసి మహిళ హత్య
[ 28-03-2024]
మహిళను గొంతుకోసి కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన మూడో మైలులో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ