logo

శిశువు మృతదేహం గుర్తింపు

కావలి గ్రామీణ మండలం మద్దూరుపాడు సమీపంలోని అడవిరాజుపాళెం కాలిబాటలో గుర్తుతెలియని మగ శిశువు మృతదేహాన్ని స్థానికులు బుధవారం గుర్తించారు.

Updated : 02 Feb 2023 03:35 IST

కావలి గ్రామీణం, న్యూస్‌టుడే: కావలి గ్రామీణ మండలం మద్దూరుపాడు సమీపంలోని అడవిరాజుపాళెం కాలిబాటలో గుర్తుతెలియని మగ శిశువు మృతదేహాన్ని స్థానికులు బుధవారం గుర్తించారు. మృతశిశువును దుస్తుల్లో చుట్టి గుర్తుతెలియని వ్యక్తులు వదిలివెళ్లి ఉంటారని భావిస్తున్నారు. గ్రామస్థులు ఇచ్చిన సమాచారం మేరకు వీఆర్వో కేశవరావు సంఘటన స్థలాన్ని పరిశీలించి రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై వీరేంద్రబాబు కేసు నమోదు చేసి తహసీల్దార్‌ సమక్షంలో శవపరీక్ష నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని