కానుక.. మూడు నెలలకోసారి!
నిరుపేద నవ దంపతులను ఆదుకునేందుకు కొత్త మార్గదర్శకాలతో గత ఏడాది అక్టోబరు ఒకటో తేదీన ప్రవేశపెట్టిన వైఎస్సార్ షాదీకా తోఫా, వైఎస్సార్ కల్యాణమస్తు పథకానికి జిల్లాలో ఆయా సచివాలయాల్లో 151 మంది దరఖాస్తు చేసుకున్నారు.
న్యూస్టుడే, నెల్లూరు (సంక్షేమం)
నిరుపేద నవ దంపతులను ఆదుకునేందుకు కొత్త మార్గదర్శకాలతో గత ఏడాది అక్టోబరు ఒకటో తేదీన ప్రవేశపెట్టిన వైఎస్సార్ షాదీకా తోఫా, వైఎస్సార్ కల్యాణమస్తు పథకానికి జిల్లాలో ఆయా సచివాలయాల్లో 151 మంది దరఖాస్తు చేసుకున్నారు. వధూవరులు పదో తరగతి ఉత్తీర్ణులు కావడంతో పాటు మరికొన్ని నిబంధనలతో ఎక్కువ మంది ఈ పథకానికి అర్హులు కాలేకపోయారు. అవగాహన లేకపోవడంతో పాటు సచివాలయాల్లో దీనిపై ప్రత్యేక దృష్టిసారించక పోవడంతో నాలుగు నెలల్లో ఈ పథకానికి తక్కువ మందే దరఖాస్తు చేశారు.
పదో తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి
వివాహాలు ఎక్కువ మంది చేసుకుంటున్నప్పటికీ నిబంధనలతో ఎక్కువ మంది అర్హత సాధించలేకపోతున్నారు. వధువు, వరుడు పదో తరగతి ఉత్తీర్ణత సాధించినట్లు ధ్రువీకరణ పత్రం, కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.10 వేలు, పట్టణాల్లో రూ.12 వేలు ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగి, ప్రభుత్వ పింఛనర్లు ఉండరాదు, నాలుగు చక్రాల వాహనాలు కలిగి ఉన్నా సాయం అందదు. నెలవారీ విద్యుత్తు వినియోగం ఏడాదికి సగటు 300 యూనిట్కు తక్కువ ఉండాలి. కుటుంబం ఆదాయ పన్ను చెల్లించరాదు. మాగాణి మూడెకరాలు, మెట్ట పదెకరాలు మించి ఉండరాదు.
సచివాలయాల్లో దరఖాస్తు
గత ఏడాది అక్టోబరు ఒకటో తేదీ తర్వాత వివాహం చేసుకున్న దంపతులు 60 రోజుల్లో ఆయా సచివాలయాల్లో డిజిటల్ అసిస్టెంట్కు దరఖాస్తు చేయాలి. దరఖాస్తులో పెళ్లి కార్డు, పెళ్లి ఫొటోలు, వివాహ ధ్రువపత్రం, వధువు, వరుడు, తల్లిదండ్రుల ఆధార్ కార్డులు, పదో తరగతి సర్టిఫికేట్, విభన్న ప్రతిభావంతులైతే సదరం సర్టిఫికేట్లు, కుల సర్టిఫికేట్లతో దరఖాస్తు చేయాల్సి ఉంది.
కొత్త పథకంలో భాగంగా..
ప్రభుత్వం మూడు నెలలకోసారి వధువు ఖాతాకు నేరుగా నిధులు జమ చేయనుంది. అక్టోబరు నుంచి డిసెంబరు వరకు దరఖాస్తు చేసుకున్న వారికి ఫిబ్రవరిలో నిధులు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంది. గత ఏడాది అక్టోబరు ఒకటో తేదీ తర్వాత పెళ్లి చేసుకున్న వారికే ఈ పథకాలు వర్తిస్తాయి. వైఎస్సార్ కల్యాణమస్తు పథకం కింద ఎస్సీ, ఎస్టీ కులానికి చెందిన వధువు అదే కులానికి చెందిన వారిని వివాహం చేసుకుంటే రూ.లక్ష, ఇతర కులానికి చెందిన వారిని పెళ్లి చేసుకుంటే రూ.1.20 లక్షలు అందిస్తోంది. బీసీ కులానికి చెందిన వధువు అదే కులస్థులను వివాహం చేసుకుంటే రూ.50 వేలు, ఇతర కులస్థులను చేసుకుంటే రూ.75 వేలు ఇస్తోంది. విభిన్న ప్రతిభావంతులైతే వధువు, వరుడులో ఏ ఒక్కరికి అంగ వైకల్యమున్నా రూ.1.50 లక్షలు మంజూరు చేస్తోంది. షాదీకా తోఫా పథకం కింద ముస్లిం వర్గీయులకు రూ.లక్ష ఇస్తారు. కులాంతర వివాహానికి సంబంధించి ప్రస్తావించలేదు. వధువు తరఫున కులాన్ని పరిగణనలోకి తీసుకుని నిధులు మంజూరు చేయనున్నారు. పెళ్లి కుమార్తె వయస్సు 18, వరుడి వయస్సు 21 ఏళ్లు ఉండాలి. ఇందులో మొదటి సారి వివాహం చేసుకున్న వారికే ఈ పథకాలు వర్తించనున్నాయి. వితంతు మహిళ వివాహం చేసుకుంటే వర్తించేలా సడలింపు ఇచ్చారు.
ఆరు దశల ప్రక్రియ తర్వాత..
ఇప్పటి వరకు వైఎస్సార్ షాదీకా తోఫా, వైఎస్సార్ కల్యాణమస్తు పథకాలకు 151 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆరు దశల ఎంపిక ప్రక్రియ పూర్తయిన తర్వాత అర్హులను గుర్తించడం జరుగుతుంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ పథకం వర్తిస్తుంది.
సాంబశివారెడ్డి, పీడీ, డీఆర్డీఏ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వెంకటేశ్వరలో టీవీఎస్ ప్రాంగణ ఎంపికలు
[ 25-04-2024]
కొడవలూరులోని వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం జరిగిన క్యాంపస్ ప్లేస్మెంట్లో 21 మంది ఎంపికయ్యారని కళాశాల ఛైర్మన్ డాక్టర్ గుణశేఖర్ తెలిపారు. -
చంద్రబాబు పాలనలో రాష్ట్ర యువతకు ఉపాధి
[ 25-04-2024]
తెదేపా అధినేత చంద్రబాబు పాలనలో రాష్ట్ర యువతకు ఉపాధి, మంచి రోజులు రానున్నాయని కోవూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థిని శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. -
గడప గడపన జగన్నాటకం!
[ 25-04-2024]
అధికారంలోకి వచ్చిన మూడేళ్లపాటు దోచుకోవడమే విధిగా వైకాపా సాగించిన పాలనతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపించడంతో ‘గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రజలను నేరుగా కలుసుకోవడం.. వారి సమస్యలను తెలుసుకోవడం.. -
జలహిత మెరుగరు? జనఘోష పట్టదు!
[ 25-04-2024]
జగన్ ప్రభుత్వ పాలనలో సహజ వనరుల దోపిడీ ఎంత విశృంకళంగా సాగిందో... జిల్లా జీవనాడిగా వినుతికెక్కిన సోమశిల జలాశయ సంరక్షణపై అంతే నిర్లక్ష్యం చూపింది. పాలనలో డొల్లతనానికి. -
వైకాపా ‘మందు’చూపు
[ 25-04-2024]
నిబంధనల ప్రకారం ఒక్కోమనిషికి మూడు సీసాలకు మించి మద్యం అమ్మకూడదు. ఒక వేళ పలుమార్లు వెళ్లి కొనుగోలు చేసినా.. పది, ఇరవైకి మించి ఉండవు. అలాంటిది.. -
కావలి సమీపంలో ఘోర ప్రమాదం
[ 25-04-2024]
వారంతా స్నేహితులు.. ఫ్యాన్సీ దుకాణంలోకి అవసరమైన ఇమిటేషన్ ఆభరణాల కొనుగోలుకు చెన్నై వెళ్లారు. అనంతరం కారులో వస్తున్నారు. అందరూ గాఢ నిద్రలోకి జారుకున్నారు. -
ఎన్నికల సందేహాలా.. కాల్ చేయండి
[ 25-04-2024]
ఎన్నికలకు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా నివృత్తి చేసుకోవచ్చని జిల్లా పోలీసు పరిశీలకులు అశోక్ టి దుధే ఒక ప్రకటనలో తెలిపారు. -
మే 2 నుంచి ఓటరు సమాచార స్లిప్పులు
[ 25-04-2024]
మే నెల రెండు నుంచి ఎనిమిదో తేదీ వరకు ఓటరు సమాచార స్లిప్పులు పంపిణీ చేయాలని కలెక్టర్ ఎం.హరినారాయణన్ అధికారులకు సూచించారు. -
తాగునీటి సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూమ్
[ 25-04-2024]
జిల్లాలో తాగునీటి సమస్యలు పరిష్కరించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఎం.హరినారాయణన్ ప్రకటనలో తెలిపారు. -
సర్వేపల్లిలో ప్రతిఘటనకు సిద్ధం
[ 25-04-2024]
సర్వేపల్లిలో మంత్రి కాకాణి ఆగడాలను ప్రతిఘటించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అన్నారు. వెంకటాచలంలో బుధవారం నామినేషన్ దాఖలు అనంతరం మాట్లాడారు. -
ప్రభుత్వం చెంతే ప్రతిపాదనలు
[ 25-04-2024]
ఎలాంటి విపత్తు ఎదురైనా ముందు గుర్తుకొచ్చేది అగ్నిమాపకశాఖ.. ఆ శాఖనే ప్రభుత్వం పట్టించుకుకోలేదు. వేసవిలో పెద్దసంఖ్యలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటుంటాయి. -
జగనన్న ఇల్లు.. రాలేదన్నా!
[ 25-04-2024]
నవరత్నాలు.. పేదలందరికీ ఇళ్లు. ఇదీ ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీ. ఇందుకు జగనన్న కాలనీలు నిర్మిస్తున్నామని ఘనంగా ప్రకటించారు. అధికారంలోకి వచ్చి అయిదేళ్లయింది. ఈ హామీ అమలుకాలేదు. -
దక్షిణ బజారు.. సమస్యలతో బేజారు
[ 25-04-2024]
పట్టణంలోని ప్రధాన కాలనీల్లోనూ మౌలిక వసతుల సమస్యలు స్థానికులను వేధిస్తున్నాయి. గత నాలుగేళ్లుగా మున్సిపాలిటీ అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదనేందుకు ఆయా... -
గుంతల రోడ్లు... పూడిన కాలువలు
[ 25-04-2024]
షబ్బీర్ కాలనీలో సీసీ రోడ్లు రాళ్లు తేలడటంతో చీకటిలో నడవాలంటే ఎక్కడ అదుపుతప్పి పడిపోతామోనని ఆందోళన చెందుతున్నారు. మురుగు కాలువలు చెత్తతో నిండినా సిబ్బంది శుభ్రం చేయటంలేదని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
30 వైడ్ బాడీ విమనాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM