ఒక్క ఛాన్స్ అంటే.. రొంపిలోకి దించారు
వెండితెరపై ‘ఒక్క ఛాన్స్’ కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న మోడళ్లు, యువతులకు అవకాశాల ఆశ చూపి వ్యభిచార కూపంలోకి దించుతున్న ఇద్దరు నిందితులు పోలీసులకు చిక్కారు.
ఈనాడు - హైదరాబాద్: వెండితెరపై ‘ఒక్క ఛాన్స్’ కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న మోడళ్లు, యువతులకు అవకాశాల ఆశ చూపి వ్యభిచార కూపంలోకి దించుతున్న ఇద్దరు నిందితులు పోలీసులకు చిక్కారు. అంతర్జాతీయ వ్యభిచార ముఠా కేసులో సైబరాబాద్ మానవ అక్రమ రవాణా విభాగం అధికారులు తాజాగా ఈ ఇద్దర్నీ అరెస్టు చేశారు. వీరి నుంచి ఐదు చరవాణులు, పాస్పోర్టు, ఆధార్, పాన్కార్డులు, 10 డెబిట్, క్రెడిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, మానవ అక్రమ రవాణా విభాగం డీసీపీ కవిత ధార వివరాలు తెలిపారు. ఇందులో ఒకరు నెల్లూరు జిల్లావాసి.
నిందితుడు అసిస్టెంట్ డైరెక్టర్ : నెల్లూరు జిల్లా కావలికి చెందిన బోయిన సురేశ్(32) అలియాస్ కుమార్ శెట్టి అలియాస్ కరణ్ అలియాస్ సురేశ్ సిద్ధార్థ్ తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ దర్శకుడి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాడు. ఇతనికి 2017 చిత్రపరిశ్రమలో నందు అనే వ్యక్తి పరిచయమయ్యాడు. వ్యభిచారం నిర్వహణలో తేలిగ్గా డబ్బు సంపాదించొచ్చని నందు ద్వారా తెలుసుకున్న సురేశ్.. సొంతంగా ఇల్లు అద్దెకు తీసుకొని వ్యాపారం ప్రారంభించాడు. మోడళ్లు, విటుల మధ్య అనుసంధానం కోసం కాల్సెంటర్ ఏర్పాటు చేశాడు. ఇప్పటి వరకు సుమారు 500 మందిని ఈ కూపంలోకి దించినట్లు పోలీసులు గుర్తించారు. సురేశ్ గోవాలోనూ ఈ వ్యాపారం ప్రారంభించాడు. పరారీలో ఉన్న నిందితుడిని ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు బృందం అరెస్టు చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపాతోనే బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి
[ 29-03-2024]
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలోని నార్త్ రాజుపాలెంలో తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం శుక్రవారం జరిగింది. -
చంద్రబాబు ప్రజాగళం నేడే
[ 29-03-2024]
న్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబునాయుడు శుక్రవారం జిల్లాలో పర్యటించనున్నారు. కావలి పట్టణంతో పాటు.. ఉదయగిరి నియోజకవర్గం వింజమూరులో రోడ్షో, సభల్లో పాల్గొననున్నారు. -
ఘోరప్రమాదం.. పెళ్లింట విషాదం
[ 29-03-2024]
కుమార్తె పెళ్లి జరిపించి.. బాధ్యత తీర్చుకున్నానని ఆ తల్లి ఎంతో సంబరపడ్డారు. కుమారుడు, బంధువులతో కలిసి పెళ్లి వేడుక జ్ఞాపకాలతో ఆనందంగా కారులో స్వస్థలానికి తిరుగు ప్రయాణమయ్యారు. -
చెరువులను చెరబట్టారు!
[ 29-03-2024]
నగర, పట్టణ ప్రాంతాల్లో చెరువులు కనుమరుగవుతున్నాయి. గడిచిన అయిదేళ్లలో వైకాపా నాయకుల ధోరణితో గట్లు, కాలువలే కాదు.. శిఖం భూములు కూడా ప్లాట్లుగా మారిపోయాయి. చెరువులతో రూ. కోట్లలో స్థిరాస్తి వ్యాపారం జరుగుతోంది. -
వైకాపాకు మద్దతుగా వాట్సాప్లో స్టేటస్
[ 29-03-2024]
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వాలంటీరుపై వేటు పడింది. మనుబోలు మండలం కాగితాలపూరుకు చెందిన శ్రీనివాసులు వాలంటీరుగా పని చేస్తున్నారు. తన చరవాణిలో వైకాపాకు మద్దతుగా వాట్సాప్ స్టేటస్ పెట్టారు. -
ఎన్నికల శిక్షణకు గైర్హాజరైతే చర్యలు
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ అధికారులకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలకు గైర్హాజరైతే చర్యలు తప్పవని కలెక్టర్ ఎం.హరినారాయణన్ హెచ్చరించారు. -
బాలలకేదీ సురక్ష..?
[ 29-03-2024]
పేదరికం, పోషకాహారం లోపంతో ఎంతో మంది బాలలు అనారోగ్యంతో సతమతమవుతున్నారు. చదువులో వెనుకబడుతున్నారు. -
వైకాపా సమావేశంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు
[ 29-03-2024]
కందుకూరు వైకాపా అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్ గురువారం ఉలవపాడు మండలం చాగొల్లులో కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. -
ఆహ్లాదం.. హామీలకే పరిమితం
[ 29-03-2024]
ఆత్మకూరు పట్టణ ప్రజలు కాసింత సేదతీరటానికి ఏర్పాటు చేస్తామన్న ఉద్యానవనాలు హామీలు అమలుకు నోచుకోలేదు. జిల్లాలో ముఖ్య పట్టణాల్లో ఆత్మకూరుకు ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ గత పాలక వర్గం కాలంలో ఉద్యానవనాల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సాక్షి వదిన తర్వాత.. ధోనీ భయ్యా ఎత్తుకుంది నన్నే: రవీంద్ర జడేజా
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
-
దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ