అర్హత సాధిస్తే ఉపకారం
పేద విద్యార్థుల ఉన్నత చదువులకు కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రతిభా ఉపకార వేతనం (నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్) పథకాన్ని అమలు చేస్తోంది.
నేడు ఎన్ఎంఎంఎస్ పరీక్ష
హాజరు కానున్న 3,369 మంది విద్యార్థులు
న్యూస్టుడే, నెల్లూరు (విద్య)
పేద విద్యార్థుల ఉన్నత చదువులకు కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రతిభా ఉపకార వేతనం (నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్) పథకాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా విద్యార్థులకు నిర్వహిసున్న ప్రవేశ పరీక్షను ఏటా పెద్ద సంఖ్యలో రాస్తున్నారు. మంచి మార్కులు వస్తే ఈ సాయం అందుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఈ పథకాన్ని 2008 నుంచి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఆదివారం ఈ పరీక్ష జిల్లా వ్యాప్తంగా నెల్లూరు, కావలి, ఆత్మకూరు, కందుకూరు రెవెన్యూ డివిజన్లలో నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖాధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం 18 కేంద్రాల్లో 3,369 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరగనుంది.
నాలుగేళ్లపాటు సాయం
ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న 8వ తరగతి విద్యార్థులకు ఎన్ఎంఎంఎస్ పరీక్ష రాసే అవకాశం ఉంది. ఇప్పటికే దరఖాస్తులు చేసుకున్న విద్యార్థులకు ఆయా పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించి పరీక్షకు సిద్ధం చేశారు. అర్హత పొందిన విద్యార్థులకు రిజర్వేషన్ ప్రకారం పథకం వర్తింపజేస్తారు. 9, 10, ఇంటర్ రెండేళ్లు, ఐటీఐ చదివితే ఏడాదికి రూ.12 వేలు చొప్పున నాలుగేళ్లపాటు ఉపకార వేతనం అందుతుంది.
ఏర్పాట్లు పూర్తి
గ్లోరికుమారి, ఇన్ఛార్జి విద్యాశాఖాధికారిణి
జిల్లాలోని 18 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తున్నాం. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరుగుతుంది. నెల్లూరులో ఆరు, కావలిలో అయిదు, ఆత్మకూరులో నాలుగు, కందుకూరులో మూడు కేంద్రాలను ఏర్పాటు చేశాం. జిల్లా వ్యాప్తంగా 3,369 మంది పరీక్షకు హాజరు కానున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు
[ 29-03-2024]
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు.. ఎవరికీ రక్షణ లేదని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. నెల్లూరు జిల్లా కావలిలో నిర్వహించిన ‘ప్రజాగళం’ సభలో ఆయన ప్రసంగించారు. -
పేదల ఆకలి తీరుస్తున్న ఆదర్శ దంపతులు
[ 29-03-2024]
నెల్లూరు పట్టణవాసులు, సంయుక్త సేవా సంస్థ నిర్వాహకులు శ్రీనివాసరావు, లలిత దంపతులు తమ కుమారుడు జై సాయిరామ్ జ్ఞాపకార్థం పేదల ఆకలిని తీరుస్తున్నారు. -
తెదేపాతోనే బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి
[ 29-03-2024]
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలోని నార్త్ రాజుపాలెంలో తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం శుక్రవారం జరిగింది. -
చంద్రబాబు ప్రజాగళం నేడే
[ 29-03-2024]
న్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబునాయుడు శుక్రవారం జిల్లాలో పర్యటించనున్నారు. కావలి పట్టణంతో పాటు.. ఉదయగిరి నియోజకవర్గం వింజమూరులో రోడ్షో, సభల్లో పాల్గొననున్నారు. -
ఘోరప్రమాదం.. పెళ్లింట విషాదం
[ 29-03-2024]
కుమార్తె పెళ్లి జరిపించి.. బాధ్యత తీర్చుకున్నానని ఆ తల్లి ఎంతో సంబరపడ్డారు. కుమారుడు, బంధువులతో కలిసి పెళ్లి వేడుక జ్ఞాపకాలతో ఆనందంగా కారులో స్వస్థలానికి తిరుగు ప్రయాణమయ్యారు. -
చెరువులను చెరబట్టారు!
[ 29-03-2024]
నగర, పట్టణ ప్రాంతాల్లో చెరువులు కనుమరుగవుతున్నాయి. గడిచిన అయిదేళ్లలో వైకాపా నాయకుల ధోరణితో గట్లు, కాలువలే కాదు.. శిఖం భూములు కూడా ప్లాట్లుగా మారిపోయాయి. చెరువులతో రూ. కోట్లలో స్థిరాస్తి వ్యాపారం జరుగుతోంది. -
వైకాపాకు మద్దతుగా వాట్సాప్లో స్టేటస్
[ 29-03-2024]
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వాలంటీరుపై వేటు పడింది. మనుబోలు మండలం కాగితాలపూరుకు చెందిన శ్రీనివాసులు వాలంటీరుగా పని చేస్తున్నారు. తన చరవాణిలో వైకాపాకు మద్దతుగా వాట్సాప్ స్టేటస్ పెట్టారు. -
ఎన్నికల శిక్షణకు గైర్హాజరైతే చర్యలు
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ అధికారులకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలకు గైర్హాజరైతే చర్యలు తప్పవని కలెక్టర్ ఎం.హరినారాయణన్ హెచ్చరించారు. -
బాలలకేదీ సురక్ష..?
[ 29-03-2024]
పేదరికం, పోషకాహారం లోపంతో ఎంతో మంది బాలలు అనారోగ్యంతో సతమతమవుతున్నారు. చదువులో వెనుకబడుతున్నారు. -
వైకాపా సమావేశంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు
[ 29-03-2024]
కందుకూరు వైకాపా అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్ గురువారం ఉలవపాడు మండలం చాగొల్లులో కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. -
ఆహ్లాదం.. హామీలకే పరిమితం
[ 29-03-2024]
ఆత్మకూరు పట్టణ ప్రజలు కాసింత సేదతీరటానికి ఏర్పాటు చేస్తామన్న ఉద్యానవనాలు హామీలు అమలుకు నోచుకోలేదు. జిల్లాలో ముఖ్య పట్టణాల్లో ఆత్మకూరుకు ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ గత పాలక వర్గం కాలంలో ఉద్యానవనాల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్రెడ్డి
-
టీసీఎస్లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐలో శిక్షణ
-
సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
-
లోక్సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్