Kotamreddy: నాకు రఘురామ కంటే పదింతల వేధింపులు ఉంటాయి: కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి
గన్మెన్లను తొలగించడంపై వైకాపా తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి స్పందించారు. ప్రభుత్వ పెద్దలు చెప్పనిదే అలా జరగదన్నారు. ఇకపై ఒంటరిగా తిరుగుతానని.. భయపడేదే లేదని ఆయన వ్యాఖ్యానించారు.
నెల్లూరు: తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని.. ఈ పరిస్థితుల్లో అదనపు భద్రత కల్పించాల్సింది పోయి ఉన్న గన్మెన్లను తొలగిస్తారా? అని వైకాపా (YSRCP) తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి (Kotamreddy) ప్రశ్నించారు. ఎవరి ఆదేశాలతో ఈ పనిచేశారో తెలియదని.. కానీ ప్రభుత్వ పెద్దలు చెప్పనిదే ఇలా జరగదన్నారు. నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తనను మానసికంగా హింసించేందుకే గన్మెన్లను తొలగించారని కోటంరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
‘‘నాకు ప్రభుత్వం 2+2 గన్మెన్లను ఇచ్చింది. శనివారం ఇద్దరిని వాపసు తీసుకోవాలని ఆదేశించారు. ఎవరి ఆదేశాలతో ఈ పని చేశారో తెలియదు. ప్రభుత్వ పెద్దలు చెప్పనిదే అలా జరగదు. నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో నాకు అదనపు భద్రత కల్పించాలి. రక్షణ ఇవ్వాల్సింది పోయి ఉన్నవాళ్లని తొలగిస్తారా?నా ఇద్దరు గన్మెన్లను గౌరవంగా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తున్నా. మిగిలిన ఇద్దరు గన్మెన్లనూ మీకే గిఫ్ట్గా ఇస్తున్నా.. తీసుకోండి. ఇకపై ఎక్కడైనా ఒంటరిగా తిరుగుతా.. ఏం భయపడను. గన్మెన్లు చాలా బాధతో వెనక్కి వెళ్లారు.. వారికి అండగా ఉంటా. మానసికంగా బలహీనపడను.. రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళ్తా. నా గొంతు ఇంకా పెరుగుతుంది.. తగ్గేదే లే. నా భద్రత పర్యవేక్షించే పోలీసులు అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఎంపీ రఘురామకృష్ణరాజు కంటే పదింతల వేధింపులు నాకుంటాయి. నా ఖర్మ ఎలా ఉంటే అలాగే జరుగుతుంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!