logo

హమ్మయ్యా.. పిల్లర్లు తొలగించారు

బోగోలు మండలం నాగులవరంలో నిర్మాణంలోని పాఠశాల భవన సముదాయంలో ముందుకు జరిగిన పిల్లర్లను ఆదివారం తొలగించారు.

Published : 06 Feb 2023 02:19 IST

నాగులవరం(బిట్రగుంట), న్యూస్‌టుడే: బోగోలు మండలం నాగులవరంలో నిర్మాణంలోని పాఠశాల భవన సముదాయంలో ముందుకు జరిగిన పిల్లర్లను ఆదివారం తొలగించారు. పక్కాగా కొత్త పిల్లర్లు నిర్మించేందుకు అవసరమైన ఆదేశాలు ఇచ్చారు. ఆదివారం ‘బాబోయ్‌..పిల్లర్లు ముందుకు జరిగాయి’ అనే శీర్షికన ఈనాడు ప్రచురించిన కథనానికి నాడు-నేడు జిల్లా ఇంజినీరింగు అధికారులు స్పందించారు. ఈఈ శ్రావణ్‌కుమార్‌, ఏఈ మస్తానయ్య ఆదివారం నాగులవరంలో రూ.1.91 కోట్లతో నిర్మించనున్న ఉన్నత పాఠశాల భవన పనులు పరిశీలించారు. ముందుకు జరిగిన పిల్లర్లను జేసీˆబీ యంత్ర సాయంతో పూర్తిగా తొలగించే పనులు పర్యవేక్షించారు. తప్పిదాలకు అవకాశం లేకుండా..నాణ్యతలో రాజీ పడకుండా పనులు చేయించాలని దిగువ శ్రేణి అధికారులకు సూచనలు ఇచ్చారు. ఆయన వెంట భవన నిర్మాణ కమిటీ బృందం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని