నిధులు దండి.. ప్రగతి లేదండి!
రాళ్లుతేలిన వావిళ్ల - అలగానిపాడు రోడ్డుఅన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా మారింది కేంద్ర నిధులతో జరుగుతున్న పనుల పరిస్థితి. జిల్లాలో వివిధ పథకాల ద్వారా ఏడాదిన్నర కిందట రూ.కోట్లు మంజూరయ్యాయి.
కేంద్ర పథకాల పనుల్లో మందగమనం
అధికారులు స్పందిస్తేనే పురోగతి
న్యూస్టుడే, నెల్లూరు (జడ్పీ)
రాళ్లుతేలిన వావిళ్ల - అలగానిపాడు రోడ్డుఅన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా మారింది కేంద్ర నిధులతో జరుగుతున్న పనుల పరిస్థితి. జిల్లాలో వివిధ పథకాల ద్వారా ఏడాదిన్నర కిందట రూ.కోట్లు మంజూరయ్యాయి. అప్పట్లో ఆర్భాటంగా మొదలైన పనులు నేటికీ పూర్తికాలేదు. అన్నీ పూర్తయినట్లు జిల్లా అధికారులు నివేదికలు అందజేయకపోవడంతో గత ఏడాది కేంద్రం నుంచి రావాల్సిన కొన్ని నిధులు సైతం ఆగిపోయాయి. దాంతో పల్లె రోడ్లకు ఇప్పట్లో మోక్షం కనిపించడం లేదు.
ఉమ్మడి జిల్లాలో 46 మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలోని పల్లెల్లో వివిధ పథకాల ద్వారా కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నా.. సకాలంలో పనులు పూర్తి కావడం లేదు. పూర్తయిన వాటికి బిల్లులు రాకపోవడంతో మిగతావి చేసేందుకు గుత్తేదారులు ముందుకు రావడం లేదు. దాంతో ఎక్కడి పనులక్కడే మందగించాయి. కొన్ని ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోలేదు. కేంద్ర నిధులను ఖర్చు చేయడం, పనులను పూర్తి చేయడంలో పంచాయతీరాజ్, ఇతర ఇంజినీరింగ్ శాఖ అధికారులు విఫలమవుతున్నారనే ఆరోపణలున్నాయి.
* జిల్లాలో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన మూడో విడత, ప్రధానమంత్రి ఆదర్శగ్రామ యోజన, పీఎం గ్రామ సడక్ ఇంటెన్సివ్ (రహదారుల నిర్వహణ నిధులు), నాబార్డు, 15వ ఆర్థిక సంఘం, తదితర కేంద్ర నిధులతో వివిధ పనులు సాగుతున్నాయి. వీటిలో అంతులేని జాప్యం నెలకొంది. వీటి వెనక కారణాలను గుర్తించి సరిదిద్ది వేగవంతం చేసేలా అధికారులు చర్యలు చేపట్టడం లేదు.
* ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన మూడో విడత పనులు 2021లో మంజూరయ్యాయి. మొత్తం రూ.67.36 కోట్లతో వివిధ గ్రామాల్లో 13 రోడ్ల పనులకు శ్రీకారం చుట్టారు. ఒకటిన్నర ఏడాది గడిచినా కేవలం అయిదు మాత్రమే పూర్తయ్యాయి. మిగతావి జరుగుతూనే ఉన్నాయి.
* ప్రధానమంత్రి సడక్ యోజన కింద రహదారుల నిర్వహణకు 2020-21లో రూ.7.89 కోట్లతో 13 పనుల నిర్వహణ, మరమ్మతులు చేయాల్సి ఉంది. ఇవి ప్రారంభమై ఏడాది పూర్తి కావొస్తున్నా ఒక్కటీ పూర్తికాలేదు.
* ఆదర్శ గ్రామాలను తీర్చిదిద్దేందుకు పీఎంఏపీవై 2021లో భాగంగా 15వ ఆర్థిక సంఘం, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు రూ.5.67 కోట్లతో 122 పనులు మంజూరయ్యాయి. వీటిని ప్రారంభించి దాదాపు ఏడాది కావొస్తోంది. ఇప్పటికీ కేవలం 73 పనులు మాత్రమే పూర్తయ్యాయి. మరో 19 పురోగతిలో ఉండగా.. 30 పనులను నేటికీ ప్రారంభించలేదు. నాబార్డు గ్రాంట్తో జరిగే అనేక పనుల్లోనూ జాప్యం నెలకొంది.
ప్రధాన కారణాలివీ..
బిల్లులు సకాలంలో మంజూరు కాకపోవడం, సిమెంటు, ఇసుక, స్టీలు ధరలు పెరగడం కూడా పనుల జాప్యానికి ప్రధాన కారణాలు. కొన్ని పనుల వద్ద స్థల వివాదాలు, తదితర సమస్యలున్నా వాటిని పరిష్కరించే నాథులు లేకపోవడం గమనార్హం.
అత్యవసర సేవలకు సుస్తీ
జిల్లాలోని మండలాలకు చెందిన 108 వాహనాలను మరమ్మతుల నిమిత్తం నెల్లూరు జీజీహెచ్ ఆసుపత్రిలోని షెడ్డుకు తరలిస్తున్నారు. బ్రేకు నిర్వహణ, తలుపులు, దీపాలు, ఇంజిన్, చక్రాలు, తదితర మరమ్మతుల్లో జాప్యం నెలకొంటోంది. అవసరమైన సామగ్రి వచ్చేందుకు నాలుగు రోజులు పడుతుండటంతో ఆయా మండలాల్లో వాహనాల్లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాహనాలను సకాలంలో బాగుచేస్తే అత్యవసర సేవలకు ఇబ్బందులు ఉండవని ప్రజలు కోరుతున్నారు.
న్యూస్టుడే, నెల్లూరు(నగరపాలకసంస్థ)
వేగవంతం చేస్తాం
పి.అశోక్కుమార్, పంచాయతీరాజ్ ఎస్ఈ
జిల్లాలో కేంద్ర ప్రభుత్వ నిధులతో అనేక పనులు మంజూరయ్యాయి. దాదాపు అన్నీ ప్రారంభమయ్యాయి. వివిధ కారణాలో కొన్ని వేగంగా సాగడం లేదు. ఆ లోపాలను గుర్తించాం. వాటిని అధిగమించి వేగవంతం చేస్తాం. బిల్లుల చెల్లింపుల్లో జాప్యాన్ని నివారిస్తాం. పనులన్నింటినీ త్వరలో పూర్తి చేశాం.
పీఎంఏజీవై బిల్లులన్నీ మంజూరు చేశాం
చిరంజీవి, జడ్పీ సీఈవో
ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన పనుల బిల్లులన్నీ ఇచ్చాం. ఇంకా కొన్ని పనులు పూర్తి చేయాల్సి ఉందని జడ్పీటీసీ సభ్యులు ఇటీవల సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. వాటిని కూడా పూర్తి చేయించి బిల్లులు అందిస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జనానికి ‘జగన్’ షాక్
[ 19-04-2024]
‘విద్యుత్తు రేట్లను పూర్తిగా తగ్గించేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా’.. అంటూ 2019, మే 30న ప్రమాణ స్వీకారం అనంతరం.. అదే వేదికపై నుంచి మొదటి ప్రసంగంలో తానిచ్చిన మాటను సీఎం జగన్మోహన్రెడ్డి తప్పారు. -
తొలి రోజు పది నామినేషన్లు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా గురువారం నామినేషన్ల ప్రక్రియ అట్టహాసంగా ప్రారంభమైంది. జిల్లాలో తొలిరోజు పది మంది అభ్యర్థులు 15 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
మాటల వంతెన.. చేతల వంచన!
[ 19-04-2024]
ప్రజల క్షేమమే లక్ష్యం.. వారి కష్టాలు తీరుస్తాం.. అండగా నిలుస్తామని పాదయాత్రలో జగన్ హామీలు ఇచ్చారు. ప్రజలు నమ్మి ఓట్లేసి గెలిపించారు. అయిదేళ్లు గడిచాయి. ఒక్క సమస్యా పరిష్కరించలేదు. -
బండేపల్లి.. బాధలు పట్టేదెవరికి?
[ 19-04-2024]
కనుపూరు కాలువ పరిధిలోని బండేపల్లి బ్రాంచి కెనాల్ ఆయకట్టు కింద సుమారు 25వేల ఎకరాలకుపైనే సాగు ఉండగా- ఆయకట్టు చెరువులకు సాగునీరందక ఏటా రైతులు ఇబ్బంది పడే పరిస్థితి. -
సమన్వయంతో పనిచేయండి: ఎస్పీ
[ 19-04-2024]
జిల్లాలో పోలీసులు, సెబ్ అధికారులు సమన్వయంతో పనిచేసి ఎన్నికల్లో అక్రమ మద్యం, నగదును ఇతర ప్రలోభాలకు అడ్డుకట్ట వేయాలని ఎస్పీ కె.ఆరిఫ్ హఫీజ్ ఆదేశించారు. -
జగన్.. మహిళా మార్టులు ఏవీ!
[ 19-04-2024]
స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు మండలానికో చేయూత మహిళా మార్టు ఏర్పాటు చేస్తామని గతంలో రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేసింది. -
జగనన్నా.. హామీ మరిచావా!
[ 19-04-2024]
కావలిలో నాన్న హయాంలో నిలిచిన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయించే బాధ్యత నాదని సీఎం జగన్ హామీ ఇచ్చిరు. ఇందుకు రూ.80 కోట్ల వరకు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఈప్రాంతంలోని వారంతా సంతోషించారు. -
రూ.5 కోట్ల బంగారు, వెండి ఆభరణాల పట్టివేత
[ 19-04-2024]
వైయస్ఆర్ జిల్లా గోపవరం మండలంలోని పీపీకుంట చెక్పోస్టు వద్ద గురువారం రూ.5 కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాలను ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్, బద్వేలు గ్రామీణ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి పట్టుకున్నారు. -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
[ 19-04-2024]
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పాలకా.. మా బాధలు కనవా!
[ 19-04-2024]
పట్టణంలోని సంతోష్నగర్లో ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారు. కాలనీలో 700 కుటుంబాలు ఉన్నాయి. రోడ్లు, కాలువలు సక్రమంగా లేవు. చిరుజల్లులు పడినా కుంటలను తలపించేలా నీరు నిలుస్తోంది. -
ఇటు చేరికలు.. అటు ప్రచారం
[ 19-04-2024]
మండల పరిధి విరువూరు, కృష్ణంరాజుపల్లె, కొండాయపాలెం, పంచాయతీల్లో తెదేపా మండల కన్వీనర్ చండ్రా మధుసూదన్రావు ఆధ్వర్యంలో గురువారం తెదేపా అభ్యర్థి కాకర్ల సురేష్ ప్రచారం నిర్వహించారు. -
మెము రైలులో దోపిడీ దొంగల బీభత్సం
[ 19-04-2024]
విజయవాడ-గూడూరు మెము రైల్లో ముగ్గురు దుండగులు ప్రయాణికుల వద్ద చరవాణులు, నగదు లాక్కొని దౌర్జన్యానికి దిగిన ఘటన కొండూరుసత్రం వద్ద జరిగింది. -
కోడ్ పట్టని మద్యం దుకాణం ఉద్యోగి
[ 19-04-2024]
ఎన్నికల నిబంధనలను ప్రభుత్వ ఉద్యోగులు కొందరు ఉల్లంఘిస్తున్నారు. స్థానిక మద్యం దుకాణం సెల్స్మెన్ ఆయుబ్ రెండ్రోజుల క్రితం ముఖ్యమంత్రి జగన్ వీడియోలను వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేయటంపై స్థానికంగా విమర్శలు వ్యక్తమయ్యాయి. -
ఆటో బోల్తా- 14 మంది కూలీలకు గాయాలు
[ 19-04-2024]
మండలంలోని తెట్టు రహదారిపై గురువారం ఉదయం ఆటో బోల్తా పడి 14 మందికి గాయాలయ్యాయి. బోగోలు మండలం వెంకటేశ్వరపురం, కావలి మండలం అన్నగారిపాలెం గ్రామాల కూలీలు వలేటివారిపాలెంలో మిరపకాయల కోతకు ఆటోలో వస్తున్నారు. -
24లోగా ఓటర్ల తుది జాబితా
[ 19-04-2024]
జిల్లాలో పెండింగ్లో ఉన్న ఓటరు దరఖాస్తులను ఈనెల 24వ తేదీ లోగా పరిష్కరించి తుది ఓటరు జాబితాను ప్రచురిస్తామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.హరినారాయణన్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి