logo

ప్రశాంతంగా ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్ష

జాతీయ ఉపకార వేతనాలకు నిర్వహించిన ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్ష జిల్లాలో ఆదివారం ప్రశాంతంగా సాగింది.

Published : 06 Feb 2023 02:19 IST

123 మంది గైర్హాజరు

నెల్లూరు : జడ్పీ పాఠశాలలో పరీక్ష తీరును పరిశీలిస్తున్న  
విద్యాశాఖ డైరెక్టర్‌ మువ్వా రామలింగం

నెల్లూరు (విద్య), న్యూస్‌టుడే : జాతీయ ఉపకార వేతనాలకు నిర్వహించిన ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్ష జిల్లాలో ఆదివారం ప్రశాంతంగా సాగింది. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 18 కేంద్రాలకు విద్యార్థులు ముందుగానే చేరుకున్నారు. పరీక్షకు 3,369 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 3,246 మంది హాజరయ్యారు. పరీక్షలను జాయింట్‌ డైరెక్టర్‌ మువ్వా రామలింగం, ఆర్జేడీ సుబ్బారావు, సమగ్రశిక్షా అభియాన్‌ ప్రాజెక్టు కోఆర్డినేటర్‌ సీహెచ్‌ ఉషారాణి పలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని