వివాహిత అనుమానాస్పద మృతి
పెళ్లైన ఆరునెలలకే ఆ యువతికి నూరేళ్లునిండాయి. కోటి ఆశలతో ఆత్తారింట్లో అడుగుపెట్టిన యువతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు.
మృతురాలు దివ్య (పెళ్లినాటి చిత్రం)
గుడ్లూరు, న్యూస్టుడే: పెళ్లైన ఆరునెలలకే ఆ యువతికి నూరేళ్లునిండాయి. కోటి ఆశలతో ఆత్తారింట్లో అడుగుపెట్టిన యువతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఈ ఘటన మండలంలోని రావూరులో శనివారం రాత్రి జరిగింది. కందుకూరు డీఎస్పీ శ్రీనివాసులు అందించిన వివరాల ప్రకారం దగదర్తి మండలం బోడగుడిపాడు గ్రామానికి చెందిన పోలుబోయిన రఘురాములు కుమార్తె దివ్య (21)ను గుడ్లూరు మండలం రావూరుకు చెందిన గొల్లప్రోలు సుబ్బారావు కుమారుడు వెంకట రాజేంద్రకు ఇచ్చి గత సంవత్సరం ఆగస్టులో పెళ్లి చేశారు. పెళ్లి సమయంలో ఎకరా మాగాణి, 18 సవర్ల బంగారం, రూ.50 వేల నగదు వరకట్నంగా ఇచ్చారు. ఆపై అత్తగారింటికి వచ్చినప్పటి నుంచి అదనంగా నగదు తీసుకు రావాలంటూ అత్త రామతులసమ్మ, భర్త రాజేంద్ర వేధించారన్నారు. ఈ నేపథ్యంలో యువతి అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకుని మృతిచెందారన్నారు. దివ్య తండ్రి రఘురాములు ఇచ్చిన ఫిర్యాదుతో భర్త, అత్తపై వరకట్న వేధింపులతోపాటు హత్యాయత్నం కింద కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ వివరించారు.
పెళ్లి అయినప్పటి నుంచి అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని దివ్య తండ్రి రఘురాములు ఆరోపించారు. దీంతో దివ్య రెండు మూడుసార్లు పుట్టింటికి వచ్చిందన్నారు. శనివారం రాత్రి మీ అమ్మాయి ఉరివేసుకుని చనిపోయిందంటూ ఫోన్ చేసి చెప్పారన్నారు. తాము వచ్చి చూసేసరికి గాయాలతో కుర్చీలో కూర్చోబెట్టిన మృతదేహాన్ని చూపించారన్నారు. భర్త రాజేంద్ర, అత్త పరారయ్యారన్నారు. దీనిపై గుడ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పారు. తాము ఇచ్చినట్లు ఫిర్యాదు తీసుకోలేదన్నారు. దీంతో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు స్టేషను వద్ద వేచి ఉన్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. దివ్య సొంతూరు నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన బంధువులు రాజేంద్రపై దాడికి ప్రయత్నించారు. దివ్యకు ఎడమచేయి కొద్దిగా పనిచేయదని, ఆమె స్వయంగా ఫ్యానుకు చీర వేసుకుని ఎలా ఉరి వేసుకుంటుందని కుటుంబసభ్యులు ప్రశ్నించారు. మృతదేహాన్ని అలానే ఉంచకుండా కిందకు దించి కుర్చీలో కూర్చోబెట్టారన్నారు. గుడ్లూరు పోలీసులు కేసు నమోదులో జాప్యం చేశారని వాపోయారు. కేసు నమోదులో జాప్యం చోటుచేసుకోలేదని గుడ్లూరు సీఐ సుబ్బారావు తెలిపారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది మృతదేహాన్ని శ్మశానానికి తరలించి అంత్యక్రియలు పూర్తి చేయించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కావలిలో లారీని ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి
[ 24-04-2024]
కావలి ముసునూరు టోల్ప్లాజా వద్ద లారీని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. -
ఇసుక తోడేళ్లు.. పెన్నమ్మ కన్నీళ్లు
[ 24-04-2024]
ఇసుక అక్రమ తవ్వకాలు... అయిదేళ్ల వైకాపా పాలనలో నిత్యం వినిపించిన మాట. అధికార పార్టీ నాయకుల అండదండలతో పెన్నమ్మను కుళ్లబొడవడంతో పాటు నిబంధనలకు నీళ్లొదిలి అడ్డగోలుగా తవ్వి తరలించారు. -
అయిదేళ్ల కథ.. గోషా ఆసుపత్రి వ్యథ!
[ 24-04-2024]
మహిళలకు ప్రత్యేకంగా ఆసుపత్రిని ఏర్పాటు చేసి.. అత్యాధునిక వైద్య సేవలు అందిస్తామని వైకాపా ప్రజాప్రతినిధులు, నాయకులు ఊకదంపుడు ఉపన్యాసాలు చేశారు. -
అమ్మో దారి.. గుండెజారి
[ 24-04-2024]
జిల్లాలోని ప్రముఖ పెంచలకోన క్షేత్రానికి వెళ్లే రోడ్డది.. అంతటి ప్రాధాన్యమున్న మార్గాన్ని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో భక్తులతో పాటు పర్యాటకులు అవస్థలు పడాల్సి వస్తోంది. -
వైకాపా నాయకుల చేతివాటం
[ 24-04-2024]
సచివాలయాలకు వచ్చిన నిధులతో అధికార పార్టీ నాయకులు అడ్డగోలుగా పనులు చేస్తున్నారు. నిబంధనలకు నీళ్లొదిలారు. అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో నిధులన్నీ వృథా అవుతున్నాయి. -
వైకాపా పాలనలో రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్థకం: తెదేపా
[ 24-04-2024]
గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్థకమైందని కావలి తెదేపా కూటమి అభ్యర్థి దగుమాటి కృష్ణారెడ్డి ఆరోపించారు. గురువారం మండలంలోని వెలుపోడు, కాట్రాయపాడు, ధర్మవరంలో పర్యటించారు. -
నిరుద్యోగికి నిరాశే..
[ 24-04-2024]
నెల్లూరు నగరం వెంకటేశ్వరపురంలో ఉన్న ప్రభుత్వ బాలుర పాలిటెక్నిక్ కళాశాలలో తెదేపా ప్రభుత్వం సీమెన్స్ సంస్థ ఆధ్వర్యంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం ఏర్పాటు చేసి విద్యార్థులకు టెక్నికల్ విద్యలో ఉచితంగా శిక్షణ అందించింది. -
మాటలే తప్ప.. పరిశ్రమలెక్కడ!
[ 24-04-2024]
సర్వేపల్లి, కోవూరు, ఆత్మకూరు నియోజకవర్గాల్లో పరిశ్రమల ఏర్పాటుకు భూములు సేకరించి నిరుపయోగంగా వదిలేశారు... వైకాపా అయిదేళ్ల పాలనలో అలంకార ప్రాయంగా మారాయి. -
హామీ ఇచ్చి.. కష్టాల్లో ముంచి
[ 24-04-2024]
పాదయాత్రలో 3,648 కిలోమీటర్లు నడిచా... ప్రజలు పడుతున్న కష్టాలు విన్నా... కళ్లారా చూశా... రాష్ట్రంలో సహాయం కోసం ఎదురుచూస్తున్న ప్రతి మనిషి, కుటుంబానికి ఒక మాట ఇస్తున్నా... నేను విన్నాను... నేను ఉన్నాను అని మాట ఇస్తున్నా... -
తెలుగుతమ్ముళ్ల జోష్
[ 24-04-2024]
ఇంటూరి సోదరులు.. తెదేపాలో రాజకీయంగా క్రియాశీలక నాయకులు. నువ్వా? నేనా? అన్నట్లుగా సీటు కోసం పోటీపడ్డారు. అయితే, ఒకరిని అదృష్టం వరిస్తే.. మరొకరిని నిరాశపరిచింది. -
ఎస్సై దురుసు ప్రవర్తనపై ఆందోళన
[ 24-04-2024]
దళిత మహిళపై ఎస్సై దురుసుగా ప్రవర్తించడంతో మాల మహాసభ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం పోలీసుస్టేషన్ ఎదురుగా బాధితులు ఆందోళన చేపట్టారు. -
యువకుడి దారుణ హత్య
[ 24-04-2024]
నెల్లూరులో యువకుడిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు బీవీ నగర్ రైల్వేగేటు సమీపంలోని వినాయక స్వామి గుడి వీధిలో నివాసం ఉండే దశరథ (28) పదో తరగతి వరకు చదువుకుని.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
-
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
-
మనసుకీ వ్యాయామం ముఖ్యమే.. వేదాంత అధిపతి హెల్త్ టిప్స్
-
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్