మలి వయసులో.. మెరుపులు
వారు మలివయసులో ఉన్న మహిళలు.. కొందరు ఏడు పదులు దాటారు. అయినా ఆటల్లో ముందుంటున్నారు. వయసులో ఉన్న వారికి తీసిపోని విధంగా ప్రతిభ చూపుతున్నారు.
న్యూస్టుడే, కావలి
వారు మలివయసులో ఉన్న మహిళలు.. కొందరు ఏడు పదులు దాటారు. అయినా ఆటల్లో ముందుంటున్నారు. వయసులో ఉన్న వారికి తీసిపోని విధంగా ప్రతిభ చూపుతున్నారు. పోటీల్లో పతకాలు సాధిస్తూ కావలి ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఓ వైపు కుటుంబ బాధ్యతలు మోస్తూ, మరోవైపు క్రీడా పోటీల్లో పతకాలు సాధిస్తున్నారు. హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో ఈనెల 2న జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి బహుమతులందుకున్నారు. అఖిల భారత మాస్టర్ గేమ్స్ ఛాంపియన్ -2023 వెటరన్ క్రీడా పోటీల్లో కావలి వనితలు సత్తా చాటి బెస్ట్ టీం అవార్డు పొందారు.
రక్తదానంపై అవగాహన కల్పిస్తూ..
రెడ్క్రాస్లో ల్యాబ్ టెక్నీషియన్గా డాకారపు పద్మావతి నిత్యం రక్త సేకరణ, వితరణ కార్యక్రమాల్లో విధులు నిర్వహిస్తున్నారు. పోటీల్లో 50 సంవత్సరాల విభాగంలో ఘనత సాధించారు. ఈమె 110 మీటర్ల హర్డిల్స్, హేమర్త్రో, 1500 మీటర్ల పరుగు, ట్రిపుల్ జంప్, 4×400 రిలే పరుగులో బంగారు పతకాలు సాధించారు.మొత్తం ఏడు పతకాలు దక్కించుకున్నారు. రక్తదాన ప్రచారం చేస్తున్నారు. ఏడు పతకాలు సాధించారు.
సేవాతత్పరతకు చిరునామా
రెడ్క్రాస్ మహిళా విభాగం కన్వీనర్గా సుదీర్ఘకాలం సేవలందిస్తున్న పార్వతీశంకర్ 65 సంవత్సరాల విభాగంలో మూడు కిలోమీటర్ల నడక, హేమర్త్రోలో స్వర్ణాలు అందుకున్నారు. డిస్కస్త్రోలో రజితం, జావెలెన్త్రోలో కాంస్య పతకాలు పొందారు. రెడ్క్రాస్ తరఫున అనేక సందర్భాల్లో పేదలకు ఆహారం పంపిణీ, వస్త్రదానం వంటి కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించారు. ఈమె 29 పర్యాయాలు రక్తదానం చేశారు.
ఏడు పదులు దాటినా..
పట్టణంలోని జవహర్ భారతి కళాశాల విశ్రాంత ఫిజికల్ డైరెక్టర్ కోటేశ్వరమ్మకు ఏడు పదుల్లో ఉన్నారు. వెటరన్ జట్టుకు మార్గదర్శకం వహిస్తున్నారు. ఈమె షాట్పుట్, డిస్కస్ త్రో, హేమర్త్రో, 4×100 మీటర్ల పరుగు పోటీల్లో ప్రథమ స్థానాల్లో నిలిచి బంగారు పతకాలను సాధించారు. గతంలో పీడీగా ఎంతోమందిని ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దారు. విశ్రాంత జీవితంలోనూ కూడా ఓ క్రీడాకారిణిగా రాణిస్తున్నారు.
ఉపాధ్యాయురాలిగా రాణిస్తూ..
పట్టణానికి చెందిన ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయని ఏ.తులశమ్మ 55 సంవత్సరాల విభాగంలో లాంగ్జంప్, ట్రిపుల్ జంప్లో స్వర్ణ పతకాలు సాధించారు. హేమర్త్రోలో రజిత పథకాన్ని పొందారు. విద్యార్థులకు కూడా చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించాలని సూచిస్తున్నారు. వివిధ సేవా కార్యక్రమాల్లో నిత్యం పాల్గొంటున్నారు.
విశ్రాంత జీవితంలో..
విశ్రాంత ఉపాధ్యాయురాలిగా కావలివాసులకు సుపరిచితమైన కె. లలితమ్మ 65 సంవత్సరాల విభాగంలో వివిధ పోటీల్లో పాల్గొన్నారు. జావెలిన్త్రోలో రజితం, హేమర్త్రోలో కాంస్య పతకాలు సాధించారు. భవిష్యత్తులో కూడా పతకాలు సాధిస్తానని ఈమె చెబుతుంది. ఈమెకు గురువుగా కోటేశ్వరమ్మ వ్యవహరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కావలిలో లారీని ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి
[ 24-04-2024]
కావలి ముసునూరు టోల్ప్లాజా వద్ద లారీని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. -
ఇసుక తోడేళ్లు.. పెన్నమ్మ కన్నీళ్లు
[ 24-04-2024]
ఇసుక అక్రమ తవ్వకాలు... అయిదేళ్ల వైకాపా పాలనలో నిత్యం వినిపించిన మాట. అధికార పార్టీ నాయకుల అండదండలతో పెన్నమ్మను కుళ్లబొడవడంతో పాటు నిబంధనలకు నీళ్లొదిలి అడ్డగోలుగా తవ్వి తరలించారు. -
అయిదేళ్ల కథ.. గోషా ఆసుపత్రి వ్యథ!
[ 24-04-2024]
మహిళలకు ప్రత్యేకంగా ఆసుపత్రిని ఏర్పాటు చేసి.. అత్యాధునిక వైద్య సేవలు అందిస్తామని వైకాపా ప్రజాప్రతినిధులు, నాయకులు ఊకదంపుడు ఉపన్యాసాలు చేశారు. -
అమ్మో దారి.. గుండెజారి
[ 24-04-2024]
జిల్లాలోని ప్రముఖ పెంచలకోన క్షేత్రానికి వెళ్లే రోడ్డది.. అంతటి ప్రాధాన్యమున్న మార్గాన్ని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో భక్తులతో పాటు పర్యాటకులు అవస్థలు పడాల్సి వస్తోంది. -
వైకాపా నాయకుల చేతివాటం
[ 24-04-2024]
సచివాలయాలకు వచ్చిన నిధులతో అధికార పార్టీ నాయకులు అడ్డగోలుగా పనులు చేస్తున్నారు. నిబంధనలకు నీళ్లొదిలారు. అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో నిధులన్నీ వృథా అవుతున్నాయి. -
వైకాపా పాలనలో రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్థకం: తెదేపా
[ 24-04-2024]
గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్థకమైందని కావలి తెదేపా కూటమి అభ్యర్థి దగుమాటి కృష్ణారెడ్డి ఆరోపించారు. గురువారం మండలంలోని వెలుపోడు, కాట్రాయపాడు, ధర్మవరంలో పర్యటించారు. -
నిరుద్యోగికి నిరాశే..
[ 24-04-2024]
నెల్లూరు నగరం వెంకటేశ్వరపురంలో ఉన్న ప్రభుత్వ బాలుర పాలిటెక్నిక్ కళాశాలలో తెదేపా ప్రభుత్వం సీమెన్స్ సంస్థ ఆధ్వర్యంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం ఏర్పాటు చేసి విద్యార్థులకు టెక్నికల్ విద్యలో ఉచితంగా శిక్షణ అందించింది. -
మాటలే తప్ప.. పరిశ్రమలెక్కడ!
[ 24-04-2024]
సర్వేపల్లి, కోవూరు, ఆత్మకూరు నియోజకవర్గాల్లో పరిశ్రమల ఏర్పాటుకు భూములు సేకరించి నిరుపయోగంగా వదిలేశారు... వైకాపా అయిదేళ్ల పాలనలో అలంకార ప్రాయంగా మారాయి. -
హామీ ఇచ్చి.. కష్టాల్లో ముంచి
[ 24-04-2024]
పాదయాత్రలో 3,648 కిలోమీటర్లు నడిచా... ప్రజలు పడుతున్న కష్టాలు విన్నా... కళ్లారా చూశా... రాష్ట్రంలో సహాయం కోసం ఎదురుచూస్తున్న ప్రతి మనిషి, కుటుంబానికి ఒక మాట ఇస్తున్నా... నేను విన్నాను... నేను ఉన్నాను అని మాట ఇస్తున్నా... -
తెలుగుతమ్ముళ్ల జోష్
[ 24-04-2024]
ఇంటూరి సోదరులు.. తెదేపాలో రాజకీయంగా క్రియాశీలక నాయకులు. నువ్వా? నేనా? అన్నట్లుగా సీటు కోసం పోటీపడ్డారు. అయితే, ఒకరిని అదృష్టం వరిస్తే.. మరొకరిని నిరాశపరిచింది. -
ఎస్సై దురుసు ప్రవర్తనపై ఆందోళన
[ 24-04-2024]
దళిత మహిళపై ఎస్సై దురుసుగా ప్రవర్తించడంతో మాల మహాసభ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం పోలీసుస్టేషన్ ఎదురుగా బాధితులు ఆందోళన చేపట్టారు. -
యువకుడి దారుణ హత్య
[ 24-04-2024]
నెల్లూరులో యువకుడిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు బీవీ నగర్ రైల్వేగేటు సమీపంలోని వినాయక స్వామి గుడి వీధిలో నివాసం ఉండే దశరథ (28) పదో తరగతి వరకు చదువుకుని.
తాజా వార్తలు (Latest News)
-
సీఎం వస్తున్నారని.. సాగునీటి కాలువను పూడ్చేశారు
-
అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
-
గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి
-
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
-
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి: ఆర్బీఐకి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచన
-
అంటకాగితే.. అంతే రాణా..!