ఎకో టూరిజం ప్రాజెక్టులకు ప్రాధాన్యం
రాష్ట్రంలో రానున్న ఆరు నెలల్లో వంద ఎకో టూరిజం ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని గుంటూరు చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు శ్రీనివాసులురెడ్డి తెలిపారు.
సీసీఎఫ్ శ్రీనివాసులురెడ్డి
డీఎఫ్వోలతో కలిసి మాట్లాడుతున్న సీసీఎఫ్ శ్రీనివాసులురెడ్డి
ఉదయగిరి, న్యూస్టుడే: రాష్ట్రంలో రానున్న ఆరు నెలల్లో వంద ఎకో టూరిజం ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని గుంటూరు చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు శ్రీనివాసులురెడ్డి తెలిపారు. డీఎఫ్వో చంద్రశేఖర్, స్క్వాడ్ డీఎఫ్వో మారుతీప్రసాద్తో కలిసి సోమవారం ఆయన ఉదయగిరి అటవీశాఖ రేంజి కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జాతీయ రహదారులు, ప్రజలు ఎక్కువగా సందర్శించే ప్రాంతాల్లో ఎకో టూరిజం ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వీటి వల్ల అడవుల పరిరక్షణతో పాటు ఆదాయం, ప్రజలకు ఆహ్లాదం కలుగుతుందన్నారు. జిల్లాలో రూ. 29 కోట్లతో ఉదయగిరి అటవీరేంజ్ పరిధిలో సిద్దేశ్వరం, ఉదయగిరి దుర్గంతో పాటు ఆత్మకూరు, కావలి, నెల్లూరు, మైపాడు బీచ్, పెంచలకోన ప్రాంతాల్లో ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తారన్నారు. అటవీశాఖ నిధులతో పాటు సీఎస్ఆర్, ప్రభుత్వ నిధులు కేటాయిస్తారన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధానికి పటిష్ఠమైన నిఘా ఏర్పాటు చేశామని.. వేసవిలో ఎర్రచందనం నరికే కూలీలు అడవిలోకి ప్రవేశిస్తే.. గుర్తించేందుకు వీలుగా డ్రోన్ సాంకేతికతను వినియోగిస్తున్నామన్నారు. వేసవిలో అడవులు అగ్నికి ఆహుతి కాకుండా ముందస్తు చర్యలు చేపట్టామని, సిబ్బందితో రెండు నెలలు పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఎర్రచందనం నరికే తమిళ కూలీలు ఎక్కువగా ఏలూరు, కొయంబత్తూరు, సేలం ప్రాంతాల నుంచి వస్తారని.. వారిని నిరోధించేందుకు ఆయా రైల్వేస్టేషన్లలో నిఘా పెట్టామన్నారు. జిల్లాలో 250 హెక్టార్లలో ప్లాంటేషన్ను ఏర్పాటు చేయడంతో పాటు మూడు వేల హెక్టార్లలో పనులు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రేంజ్ అధికారి టి.ఉమా మహేశ్వరరెడ్డి, డీఆర్వో శ్రీనివాసులు, సిబ్బంది పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అడ్డగోలు పోస్టులు పెడితే ఇబ్బందే
[ 20-04-2024]
చేతిలో చరవాణి ఉందని ఇష్టానుసారం పోస్టులు పెడితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రత్యర్థులపై పోస్టులు పెట్టడం.. సామాజిక వర్గాలను కించపరచడం... -
బాబు సీఎం అయ్యే వరకు పాదరక్షలు ధరించనని..!
[ 20-04-2024]
చంద్రబాబు సీఎం అయ్యే వరకు చెప్పులు వేసుకోనని దగదర్తి మండలంలోని కాట్రాయపాడుకు చెందిన తాళ్లూరు సుధాకర్నాయుడు ప్రతిన బూనారు. -
‘నీరో’ల పాలన
[ 20-04-2024]
ప్రజలకు సురక్షిత తాగునీరు అందించేందుకు తెలుగుదేశం ప్రభుత్వం 2018లో ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం తీసుకొచ్చింది. జిల్లా వ్యాప్తంగా శుద్ధజల కేంద్రాలను నిర్మించింది. -
జగన్ జమానాలో పప్పన్నం కష్టమే!
[ 20-04-2024]
‘2019 ఎన్నికల ముందు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో ఊరూరా తిరిగిన జగన్మోహన్రెడ్డి.. రేషన్ దుకాణాల్లో నిత్యావసర సరకులే దొరకడం లేదంటూ ప్రతిపక్షాలను తీవ్రంగా విమర్శించారు. -
నేడు పొదలకూరులో ప్రజాగళం
[ 20-04-2024]
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరులో జరిగే ప్రజాగళం సభలో పాల్గొననున్నారు. -
నిమ్మ రైతుకు జగన్ దగా
[ 20-04-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో హామీలే తప్ప వాటి అమలుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మెట్టప్రాం తం కావడంతో ఎక్కువ మంది వర్షాధారిత పంటలపైనే ఆధారపడి జీవిస్తున్నారు.. -
ఉత్తర కాలువపై ఉత్తుత్తి హామీ
[ 20-04-2024]
అయిదేళ్లయింది. ఇప్పటి వరకు హామీ నెరవేర్చేందుకు చేసిన కృషి ఏమీ లేదు. ఆయకట్టు రైతులకు చేకూరిన ప్రయోజనమూ ఏమీలేదు. -
రెండో రోజు ఎనిమిది నామినేషన్లు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా 8 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు. -
మాటలే.. పనుల్లేవ్!
[ 20-04-2024]
పట్టణంలో ప్రధానమైన ట్రంకురోడ్డు అభివృద్ధి చేస్తామని సీఎం జగన్, ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి పలుమార్లు హామీలు ఇచ్చారు. -
సర్పంచుల ఒత్తిడితోనే ఆర్థిక సంఘం నిధుల విడుదల
[ 20-04-2024]
రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసిన తరువాత రూ.988 కోట్లు విడుదల అయ్యాయని సర్పంచుల సంఘం కార్యనిర్వాహక కార్యదర్శి నాగేంద్ర ప్రసాద్ రెడ్డి తెలిపారు. -
ఆర్ఐ రోడ్డుకు జగన్ పోటు
[ 20-04-2024]
తీరంలో నాలుగు మండలాల ప్రజలు రాకపోకలు సాగించే ప్రధాన రహదారిపై ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించింది. -
పల్లె పాలనకు వైకాపా గ్రహణం
[ 20-04-2024]
వింజమూరు రవి పాఠశాల నుంచి నడిమూరు దేవతమహల్ సెంటర్ వరకు కాలువల్లో పూడిక పేరుకుపోయింది. -
తనిఖీలు విస్తృతం చేయండి: కలెక్టర్
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా సరిహద్దులు, ఇతర ప్రధాన మార్గాల్లో ఏర్పాటు చేసిన చెక్పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.హరినారాయణన్ అధికారులను ఆదేశించారు. -
కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి కుటుంబం ఆస్తి రూ.2.45 కోట్లు
[ 20-04-2024]
నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం తెదేపా అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి కుటుంబం ఆస్తుల విలువ రూ.2.45 కోట్లుగా అఫిడవిట్లో చూపించారు. -
అభ్యర్థుల వ్యయాలపై దృష్టి
[ 20-04-2024]
ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఖర్చులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నెల్లూరు పార్లమెంటు వ్యయ పరిశీలకులు జి.ప్రసాద్ దత్తాత్రేయ పేర్కొన్నారు. -
నామపత్రాల ధరావతు ఎందుకు పెంచారంటే..
[ 20-04-2024]
ఎన్నికల్లో పోటీ చేయాలంటే ముందుగా అభ్యర్థులు నామినేషన్లు వేయాల్సి ఉంటుంది.