జీవో నెం.1.. వర్తించదా మరి?
‘జీవో నంబరు 1లోని నిబంధనలు ప్రతిపక్షాలకే కాదు.. అధికారంలో ఉన్న వైకాపాకూ వర్తిస్తాయి. వాటికి లోబడే వైకాపా సభలు నిర్వహించుకోవాల్సి ఉంటుంది’- ఇవీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాటలు.
రోడ్షోలో ఎంపీ ఆదాల, పక్కన మంత్రి గోవర్ధన్రెడ్డి, వేమిరెడ్డి,
బీద మస్తాన్రావు, ఆనం విజయకుమార్రెడ్డి తదితరులు
ఈనాడు డిజిటల్, నెల్లూరు: కార్పొరేషన్: ‘జీవో నంబరు 1లోని నిబంధనలు ప్రతిపక్షాలకే కాదు.. అధికారంలో ఉన్న వైకాపాకూ వర్తిస్తాయి. వాటికి లోబడే వైకాపా సభలు నిర్వహించుకోవాల్సి ఉంటుంది’- ఇవీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాటలు. జిల్లాలో మాత్రం అవేమీ కనిపించలేదు.ఆ జీవో మాకు వర్తించదని చెప్పకనే చెప్పారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఎంపికైన తర్వాత నగరానికి విచ్చేస్తున్న ఎంపీ ఆదాల ప్రభాకర్రెడ్డికి వైకాపా నాయకులు ఘన స్వాగతం పలికేందుకు భారీగా జన సమీకరణ చేశారు. రహదారులపై సభలు, సమావేశాలు, ర్యాలీలు, రోడ్డుషోలకు అనుమించరాదన్న నిబంధనను అపహాస్యం చేశారు. ఎలాంటి అనుమతి తీసుకోకుండా.. నగరం మధ్యలో నుంచి రోడ్షో నిర్వహించారు. డీజే పాటలతో పాటు బాణసంచా కాల్చారు. పతిచోటా వైకాపా నాయకుల తీరు.. మమ్మల్ని అడిగేవారు లేరనే తీరులో సాగింది. దాదాపు 4 కి.మీ. సాగిన ఈ ర్యాలీలో ఆదాలతో పాటు మంత్రి కాకాణి, అనిల్కుమార్యాదవ్, ఎంపీలు వేమిరెడ్డి…, బీద మస్తాన్రావు తదితరులు పాల్గొన్నారు.
కార్యకర్తలకు అండగా ఉంటా: ఆదాల ప్రభాకర్రెడ్డి, ఎంపీ
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని వైకాపా కార్యకర్తలకు అండగా ఉంటానని ఎంపీ ఆదాల ప్రభాకర్రెడ్డి అన్నారు. ర్యాలీ అనంతరం తన కార్యాలయంలో ఆయన మాట్లాడారు. కార్పొరేటర్లు మద్ధతు ఇవ్వడం అభినందనీయమన్నారు. ఎవరూ బయపడాల్సిన అవసరం లేదని.. ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే వెంటనే తమకు చెప్పాలని కోరారు. మంత్రి కాకాణి మాట్లాడుతూ.. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి నమ్మకద్రోహం చేసి వెళ్లిపోయారన్నారు. వచ్చే ఎన్నికల్లో వైకాపా అన్ని నియోజకవర్గాల్లో విజయకేతనం ఎగురవేస్తుందన్నారు. అనిల్కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. నెల్లూరు కంచుకోటను మళ్లీ గెలుచుకుంటామన్నారు. రెండుసార్లు టికెట్టు ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపిస్తే కోటంరెడ్డి వెళ్లిపోయాడన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. మేయర్గా తనను శ్రీధర్రెడ్డి చేశారని చెబుతున్నారని, జగన్ వల్లే ఆ పదవి దక్కిందనే విషయాన్ని మర్చిపోకూడదన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే విక్రమ్రెడ్డి, నుడా ఛైర్మన్ ముక్కాల ద్వారకనాథ్, వైకాపా నాయకులు ఆనం విజయకుమార్రెడ్డి, వైవి.రామిరెడ్డి, కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గడప గడపన జగన్నాటకం!
[ 25-04-2024]
అధికారంలోకి వచ్చిన మూడేళ్లపాటు దోచుకోవడమే విధిగా వైకాపా సాగించిన పాలనతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపించడంతో ‘గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రజలను నేరుగా కలుసుకోవడం.. వారి సమస్యలను తెలుసుకోవడం.. -
జలహిత మెరుగరు? జనఘోష పట్టదు!
[ 25-04-2024]
జగన్ ప్రభుత్వ పాలనలో సహజ వనరుల దోపిడీ ఎంత విశృంకళంగా సాగిందో... జిల్లా జీవనాడిగా వినుతికెక్కిన సోమశిల జలాశయ సంరక్షణపై అంతే నిర్లక్ష్యం చూపింది. పాలనలో డొల్లతనానికి. -
వైకాపా ‘మందు’చూపు
[ 25-04-2024]
నిబంధనల ప్రకారం ఒక్కోమనిషికి మూడు సీసాలకు మించి మద్యం అమ్మకూడదు. ఒక వేళ పలుమార్లు వెళ్లి కొనుగోలు చేసినా.. పది, ఇరవైకి మించి ఉండవు. అలాంటిది.. -
కావలి సమీపంలో ఘోర ప్రమాదం
[ 25-04-2024]
వారంతా స్నేహితులు.. ఫ్యాన్సీ దుకాణంలోకి అవసరమైన ఇమిటేషన్ ఆభరణాల కొనుగోలుకు చెన్నై వెళ్లారు. అనంతరం కారులో వస్తున్నారు. అందరూ గాఢ నిద్రలోకి జారుకున్నారు. -
ఎన్నికల సందేహాలా.. కాల్ చేయండి
[ 25-04-2024]
ఎన్నికలకు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా నివృత్తి చేసుకోవచ్చని జిల్లా పోలీసు పరిశీలకులు అశోక్ టి దుధే ఒక ప్రకటనలో తెలిపారు. -
మే 2 నుంచి ఓటరు సమాచార స్లిప్పులు
[ 25-04-2024]
మే నెల రెండు నుంచి ఎనిమిదో తేదీ వరకు ఓటరు సమాచార స్లిప్పులు పంపిణీ చేయాలని కలెక్టర్ ఎం.హరినారాయణన్ అధికారులకు సూచించారు. -
తాగునీటి సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూమ్
[ 25-04-2024]
జిల్లాలో తాగునీటి సమస్యలు పరిష్కరించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఎం.హరినారాయణన్ ప్రకటనలో తెలిపారు. -
సర్వేపల్లిలో ప్రతిఘటనకు సిద్ధం
[ 25-04-2024]
సర్వేపల్లిలో మంత్రి కాకాణి ఆగడాలను ప్రతిఘటించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అన్నారు. వెంకటాచలంలో బుధవారం నామినేషన్ దాఖలు అనంతరం మాట్లాడారు. -
ప్రభుత్వం చెంతే ప్రతిపాదనలు
[ 25-04-2024]
ఎలాంటి విపత్తు ఎదురైనా ముందు గుర్తుకొచ్చేది అగ్నిమాపకశాఖ.. ఆ శాఖనే ప్రభుత్వం పట్టించుకుకోలేదు. వేసవిలో పెద్దసంఖ్యలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటుంటాయి. -
జగనన్న ఇల్లు.. రాలేదన్నా!
[ 25-04-2024]
నవరత్నాలు.. పేదలందరికీ ఇళ్లు. ఇదీ ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీ. ఇందుకు జగనన్న కాలనీలు నిర్మిస్తున్నామని ఘనంగా ప్రకటించారు. అధికారంలోకి వచ్చి అయిదేళ్లయింది. ఈ హామీ అమలుకాలేదు. -
దక్షిణ బజారు.. సమస్యలతో బేజారు
[ 25-04-2024]
పట్టణంలోని ప్రధాన కాలనీల్లోనూ మౌలిక వసతుల సమస్యలు స్థానికులను వేధిస్తున్నాయి. గత నాలుగేళ్లుగా మున్సిపాలిటీ అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదనేందుకు ఆయా... -
గుంతల రోడ్లు... పూడిన కాలువలు
[ 25-04-2024]
షబ్బీర్ కాలనీలో సీసీ రోడ్లు రాళ్లు తేలడటంతో చీకటిలో నడవాలంటే ఎక్కడ అదుపుతప్పి పడిపోతామోనని ఆందోళన చెందుతున్నారు. మురుగు కాలువలు చెత్తతో నిండినా సిబ్బంది శుభ్రం చేయటంలేదని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు