కొలువు కల... మోసగాళ్ల వల!
ఇటీవల కాలంలో ఈ తరహా మోసాలు అధికమవగా- ఎస్పీ కార్యాలయంలో జరిగే స్పందనలో తరచూ ఫిర్యాదులు అదే స్థాయిలో ఉంటున్నాయి.
పోలీసు ‘స్పందన’కు ఫిర్యాదుల వెల్లువ
* రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించాడు. ఎలాంటి ఆధారాలు లేకుండానే రూ. లక్షలు వసూలు చేశాడు. తీరా ఉద్యోగం ఇప్పించమని అడిగితే.. ఎవరికి చెప్పుకొంటావో చెప్పుకోమని బెదిరిస్తున్నాడు.
* ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి.. పక్కింట్లో ఉండే వ్యక్తి నమ్మించాడు. రూ. 1.50 లక్షలు ఇస్తే వస్తుందంటూ డబ్బు తీసుకున్నాడు. తీరా.. మోసం చేశాడు. ఏమని అడిగితే పలకడమే లేదు. కోవూరు పడుగుపాడుకు చెందిన ఓ నిరుద్యోగి.
జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన స్పందనలో ఎస్పీకి వచ్చిన ఫిర్యాదులు ఇవి.
న్యూస్టుడే, నెల్లూరు (నేర విభాగం)
ఇటీవల కాలంలో ఈ తరహా మోసాలు అధికమవగా- ఎస్పీ కార్యాలయంలో జరిగే స్పందనలో తరచూ ఫిర్యాదులు అదే స్థాయిలో ఉంటున్నాయి. ఈ విషయమై జిల్లా పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నా.. ప్రతి సోమవారం అర్జీలు మాత్రం ఆగడం లేదు. ధైర్యం చేసి ఫిర్యాదు చేయడానికి వస్తున్న వారు కొందరేనని.. బయటకు రాని వారు వేలల్లోనే ఉంటారనేది అంచనా.
నిరుద్యోగమే.. వారి ఆసరా
పారిశ్రామికంగా జిల్లా అభివృద్ధి చెందుతోంది. కృష్ణపట్నం పోర్టు, థర్మల్ ప్లాంట్లు, సెజ్లు, పారిశ్రామిక వాడలు, పలు ప్రైవేటు కంపెనీలు జిల్లాకు వస్తుండగా- సరిగ్గా, ఈ పరిస్థితినే కొందరు ఆసరాగా చేసుకుని ఉద్యోగాల వ్యాపారం చేస్తున్నారు. తమకు ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఉన్నాయని.. తాము ఎంత చెబితే అంతే.. కాకుంటే కాస్త ఖర్చవుతుందని నమ్మబలుకుతున్నారు. రూ. లక్షలు వసూలు చేసి పరారవుతున్నారు. ఇలా మోసపోతున్న నిరుద్యోగుల్లో ఎక్కువగా బీటెక్, ఎంటెక్, ఎంబీఏ తదితర ప్రొఫెషనల్ కోర్సులు చేసిన యువకులే ఉంటుండటం గమనార్హం. మాయమాటలతో నగదు ఇవ్వాలని మభ్యపెడతారు. ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ప్రాంగణ ఎంపికలు చేసేలా నటిస్తారు. సొమ్ము అందగానే అడ్డం తిరుగుతుండగా.. బాధితులు లబోదిబోమంటున్నారు.
గుర్తించుకోవాలి మరి
* ఇచ్చిన ఉద్యోగ ప్రకటన వెబ్సైట్ సరైనదో కాదో క్షుణ్నంగా పరిశీలించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ.. అందులో పేర్కొన్న మొబైల్ నంబర్లకు ఫోన్ చేసి వివరాలు తీసుకోకూడదు. స్వయంగా కార్యాలయాన్ని సంప్రదించాలి. అప్పుడే పూర్తి వివరాలు తెలుస్తాయి. * ఏ సంస్థ కూడా తమ ఉద్యోగుల నుంచి పని కల్పించేందుకు డబ్బు వసూలు చేయదు. నేను వెళ్లేది పని చేయడానికి.. మరి అలాంటప్పుడు నేనెందుకు డబ్బు చెల్లించాలి? అని ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.
అప్రమత్తత అవసరం
- సీహెచ్ విజయరావు, ఎస్పీ
ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం చేసే వ్యక్తుల పట్ల యువత, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగాలపై క్షేత్రస్థాయిలో ఆరా తీయాలి. సంస్థ ఎక్కడుంది? నిర్వాహకులు ఎవరు? తదితర అన్ని వివరాలు తెలుసుకోవాలి. ఉద్యోగాల పేరుతో జరిగే ప్రచారాలను నమ్మి మోసపోవద్దు.
‘ఓ వ్యక్తి.. బ్యాంకులో ఉద్యోగం ఇప్పిస్తామంటూ కావలికి చెందిన ముగ్గురు యువకులతో నమ్మబలికాడు. గుంటూరు, హైదరాబాద్లో బ్రాంచీలు ఉన్నాయంటూ ఇంటర్వ్యూలు సైతం నిర్వహించారు. ఒక్కో పోస్టుకు రూ. 1.80 లక్షలు వసూలు చేశాడు. అందులో తనకు రూ. 70 వేలు పర్సెంటేజీ అని బహిరంగంగానే ప్రచారం చేశాడు. తీరా ఉద్యోగాలు కాదు కదా! ఇంటర్వ్యూలు నిర్వహించిన ఆ బ్రాంచిలే మూతపడ్డాయి. గుంటూరు, హైదరాబాద్ ప్రాంతాల్లో తిరిగినా.. ఎలాంటి కార్యాలయం కనిపించలేదు. చివరకు తాము మోసపోయినట్లు తెలుసుకుని.. న్యాయం కోసం పోలీసుల చుట్టూ తిరుగుతున్నారు.’
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేజీఎఫ్-3 చూడాలంటే సర్వేపల్లికి రావాలి: చంద్రబాబు
[ 20-04-2024]
జగన్ పాలనలో కుంభకోణాలు తప్ప ఏమీ లేదని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. -
నిరుపేదలకు భోజనం ప్యాకెట్లు వితరణ
[ 20-04-2024]
కావలి పట్టణం కచ్చేరి మిట్ట నివాసి అళహరి.రామయ్య గారి జ్ఞాపకార్ధం ఆయన కుమారుడు అళహరి.రామక్రిష్ణ సంయుక్త సేవాసంస్థ ఆధ్వర్యంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర ద్వారా కావలి పట్టణం పరిసర ప్రాంతమైన బుడంగుంట గిరిజన కాలనీలో 100 మంది పేదలకు అన్నాదానం చేశారు. -
తెదేపాలో 30 కుటుంబాలు చేరిక
[ 20-04-2024]
కావలి రూరల్ మండలం రాజువారిచింతలపాలెం ఎస్సీ కాలనీకి చెందిన ఆరుమళ్ళ చిన మాలకొండయ్య ఆధ్వర్యంలో 30 కుటుంబాలు వైకాపాను వీడి తెదేపాలో చేరారు. -
అడ్డగోలు పోస్టులు పెడితే ఇబ్బందే
[ 20-04-2024]
చేతిలో చరవాణి ఉందని ఇష్టానుసారం పోస్టులు పెడితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రత్యర్థులపై పోస్టులు పెట్టడం.. సామాజిక వర్గాలను కించపరచడం... -
బాబు సీఎం అయ్యే వరకు పాదరక్షలు ధరించనని..!
[ 20-04-2024]
చంద్రబాబు సీఎం అయ్యే వరకు చెప్పులు వేసుకోనని దగదర్తి మండలంలోని కాట్రాయపాడుకు చెందిన తాళ్లూరు సుధాకర్నాయుడు ప్రతిన బూనారు. -
‘నీరో’ల పాలన
[ 20-04-2024]
ప్రజలకు సురక్షిత తాగునీరు అందించేందుకు తెలుగుదేశం ప్రభుత్వం 2018లో ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం తీసుకొచ్చింది. జిల్లా వ్యాప్తంగా శుద్ధజల కేంద్రాలను నిర్మించింది. -
జగన్ జమానాలో పప్పన్నం కష్టమే!
[ 20-04-2024]
‘2019 ఎన్నికల ముందు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో ఊరూరా తిరిగిన జగన్మోహన్రెడ్డి.. రేషన్ దుకాణాల్లో నిత్యావసర సరకులే దొరకడం లేదంటూ ప్రతిపక్షాలను తీవ్రంగా విమర్శించారు. -
నేడు పొదలకూరులో ప్రజాగళం
[ 20-04-2024]
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరులో జరిగే ప్రజాగళం సభలో పాల్గొననున్నారు. -
నిమ్మ రైతుకు జగన్ దగా
[ 20-04-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో హామీలే తప్ప వాటి అమలుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మెట్టప్రాం తం కావడంతో ఎక్కువ మంది వర్షాధారిత పంటలపైనే ఆధారపడి జీవిస్తున్నారు.. -
ఉత్తర కాలువపై ఉత్తుత్తి హామీ
[ 20-04-2024]
అయిదేళ్లయింది. ఇప్పటి వరకు హామీ నెరవేర్చేందుకు చేసిన కృషి ఏమీ లేదు. ఆయకట్టు రైతులకు చేకూరిన ప్రయోజనమూ ఏమీలేదు. -
రెండో రోజు ఎనిమిది నామినేషన్లు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా 8 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు. -
మాటలే.. పనుల్లేవ్!
[ 20-04-2024]
పట్టణంలో ప్రధానమైన ట్రంకురోడ్డు అభివృద్ధి చేస్తామని సీఎం జగన్, ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి పలుమార్లు హామీలు ఇచ్చారు. -
సర్పంచుల ఒత్తిడితోనే ఆర్థిక సంఘం నిధుల విడుదల
[ 20-04-2024]
రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసిన తరువాత రూ.988 కోట్లు విడుదల అయ్యాయని సర్పంచుల సంఘం కార్యనిర్వాహక కార్యదర్శి నాగేంద్ర ప్రసాద్ రెడ్డి తెలిపారు. -
ఆర్ఐ రోడ్డుకు జగన్ పోటు
[ 20-04-2024]
తీరంలో నాలుగు మండలాల ప్రజలు రాకపోకలు సాగించే ప్రధాన రహదారిపై ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించింది. -
పల్లె పాలనకు వైకాపా గ్రహణం
[ 20-04-2024]
వింజమూరు రవి పాఠశాల నుంచి నడిమూరు దేవతమహల్ సెంటర్ వరకు కాలువల్లో పూడిక పేరుకుపోయింది. -
తనిఖీలు విస్తృతం చేయండి: కలెక్టర్
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా సరిహద్దులు, ఇతర ప్రధాన మార్గాల్లో ఏర్పాటు చేసిన చెక్పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.హరినారాయణన్ అధికారులను ఆదేశించారు. -
కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి కుటుంబం ఆస్తి రూ.2.45 కోట్లు
[ 20-04-2024]
నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం తెదేపా అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి కుటుంబం ఆస్తుల విలువ రూ.2.45 కోట్లుగా అఫిడవిట్లో చూపించారు. -
అభ్యర్థుల వ్యయాలపై దృష్టి
[ 20-04-2024]
ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఖర్చులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నెల్లూరు పార్లమెంటు వ్యయ పరిశీలకులు జి.ప్రసాద్ దత్తాత్రేయ పేర్కొన్నారు. -
నామపత్రాల ధరావతు ఎందుకు పెంచారంటే..
[ 20-04-2024]
ఎన్నికల్లో పోటీ చేయాలంటే ముందుగా అభ్యర్థులు నామినేషన్లు వేయాల్సి ఉంటుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
వినీతాసింగ్ మృతిపై వదంతులు ..ఆమె ఏమన్నారంటే!
-
హామీలపై నిలదీస్తే అసహనమెందుకు?: హరీశ్రావు
-
బంగారం పేరుతో రూ.6.12 కోట్ల మోసం.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్టు
-
social look: వర్ష చీరకట్టు.. ప్రియాంక క్యూటు.. రష్మి హాటు..
-
నేను ఓటు వేశా.. మీరూ వేయండి..! ఎన్నికల వేళ విశాల్ ఇంకా ఏమన్నారంటే?