కనిపించకుండా పోయిన బిడ్డ.. 20 నెలల తర్వాత దొరికాడు
మూడేళ్ల బుడతడు.. తండ్రి వెనుకాలే అడుగులేసిన బిడ్డ.. కనిపించకుండా పోయాడు. అనేక మలుపుల అనంతరం 20 నెలల తర్వాత.. ఆ ఇంటికి అనూహ్యంగా చేరడంతో కన్నవారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
కుమారుడిని ముద్దాడుతున్న తల్లి
కలువాయి, న్యూస్టుడే: మూడేళ్ల బుడతడు.. తండ్రి వెనుకాలే అడుగులేసిన బిడ్డ.. కనిపించకుండా పోయాడు. అనేక మలుపుల అనంతరం 20 నెలల తర్వాత.. ఆ ఇంటికి అనూహ్యంగా చేరడంతో కన్నవారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ సంఘటన కలువాయి మండలం ఉయ్యాలపల్లిలో చోటు చేసుకుంది.
నాడు తప్పిపోయి.. దండు బుజ్జయ్య, వరలక్ష్మమ్మలకు ముగ్గురు కుమారులు. వారిలో రెండో బిడ్డ సంజు. జూన్ 29, 2021వ తేదీ ఉదయం 9 గంటలకు ఇంటి నుంచి బయటకు వచ్చాడు. బుజ్జయ్య రోజు మాదిరి మేకలు తోలుకుని అడవికి వెళ్లగా.. సంజు తండ్రిని అనుసరిస్తూ.. వెనుకాలే వెళ్లాడు. ఆ విషయం బుజ్జయ్య గమనించలేదు. బిడ్డ ఎంత సేపటికీ కనిపించకపోవడంతో చుట్టుపక్కలంతా గాలించారు. నాడు పోలీసులు కూడా నెల రోజుల పాటు అడవిని జల్లెడపట్టారు.
నిన్న తెలిసి.. రాజంపేటకు చెందిన ఓ మహిళ.. ఇటీవల కలువాయి మండలం తోపుగుంట ఎస్టీ కాలనీలోని బంధువుల ఇంటికి వచ్చింది. ఆమె వస్తూ వస్తూ ఓ బాలుడిని వెంట తీసుకొచ్చింది. చుట్టుపక్కల వాళ్లు ఆ బాబు ఎవరని ఆరా తీయగా.. ఉయ్యాలపల్లి వద్ద తన మరిదికి దొరికాడని చెప్పింది. ఆ తర్వాత ఆమె మళ్లీ పిల్లాడిని తీసుకుని తమ ఊరికి వెళ్లిపోయింది.
నేడు దరిచేరి.. ఆ సమాచారం ఆదివారం బాధిత తల్లిదండ్రులకు చేరింది.వారు తమ బిడ్డ అయి ఉండొచ్చేమోనన్న ఆశతో రాజంపేటకు తరలివెళ్లారు. అక్కడి వారు.. ఇటుక రాయి పని కోసం పామూరు వెళుతూ బాలుడిని సైతం తీసుకువెళ్లారని తెలిసింది. దాంతో సోమవారం కృష్ణంపల్లి గ్రామంలో ఇటుక రాయి పని వద్దకు వెళ్లారు. ఆ బాలుడు తమ బిడ్డేనని గుర్తించి.. ఇంటికి తీసుకువచ్చారు.
ఆనందానికి అవధులు లేవు.. ‘బిడ్డను ఎవరైనా తీసుకువెళ్లి ఉంటారనే అనుమానం ఉండేది. అదే నిజమైంది. దేవుడు మాయందు ఉన్నాడు. మా ఆనందానికి అవధులు లేవు.
తల్లిదండ్రులు బుజ్జయ్య, వరలక్ష్మమ్మ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రబాబు ప్రజాగళం నేడే
[ 29-03-2024]
న్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబునాయుడు శుక్రవారం జిల్లాలో పర్యటించనున్నారు. కావలి పట్టణంతో పాటు.. ఉదయగిరి నియోజకవర్గం వింజమూరులో రోడ్షో, సభల్లో పాల్గొననున్నారు. -
ఘోరప్రమాదం.. పెళ్లింట విషాదం
[ 29-03-2024]
కుమార్తె పెళ్లి జరిపించి.. బాధ్యత తీర్చుకున్నానని ఆ తల్లి ఎంతో సంబరపడ్డారు. కుమారుడు, బంధువులతో కలిసి పెళ్లి వేడుక జ్ఞాపకాలతో ఆనందంగా కారులో స్వస్థలానికి తిరుగు ప్రయాణమయ్యారు. -
చెరువులను చెరబట్టారు!
[ 29-03-2024]
నగర, పట్టణ ప్రాంతాల్లో చెరువులు కనుమరుగవుతున్నాయి. గడిచిన అయిదేళ్లలో వైకాపా నాయకుల ధోరణితో గట్లు, కాలువలే కాదు.. శిఖం భూములు కూడా ప్లాట్లుగా మారిపోయాయి. చెరువులతో రూ. కోట్లలో స్థిరాస్తి వ్యాపారం జరుగుతోంది. -
వైకాపాకు మద్దతుగా వాట్సాప్లో స్టేటస్
[ 29-03-2024]
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వాలంటీరుపై వేటు పడింది. మనుబోలు మండలం కాగితాలపూరుకు చెందిన శ్రీనివాసులు వాలంటీరుగా పని చేస్తున్నారు. తన చరవాణిలో వైకాపాకు మద్దతుగా వాట్సాప్ స్టేటస్ పెట్టారు. -
ఎన్నికల శిక్షణకు గైర్హాజరైతే చర్యలు
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ అధికారులకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలకు గైర్హాజరైతే చర్యలు తప్పవని కలెక్టర్ ఎం.హరినారాయణన్ హెచ్చరించారు. -
బాలలకేదీ సురక్ష..?
[ 29-03-2024]
పేదరికం, పోషకాహారం లోపంతో ఎంతో మంది బాలలు అనారోగ్యంతో సతమతమవుతున్నారు. చదువులో వెనుకబడుతున్నారు. -
వైకాపా సమావేశంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు
[ 29-03-2024]
కందుకూరు వైకాపా అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్ గురువారం ఉలవపాడు మండలం చాగొల్లులో కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. -
ఆహ్లాదం.. హామీలకే పరిమితం
[ 29-03-2024]
ఆత్మకూరు పట్టణ ప్రజలు కాసింత సేదతీరటానికి ఏర్పాటు చేస్తామన్న ఉద్యానవనాలు హామీలు అమలుకు నోచుకోలేదు. జిల్లాలో ముఖ్య పట్టణాల్లో ఆత్మకూరుకు ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ గత పాలక వర్గం కాలంలో ఉద్యానవనాల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేశారు.