ఏటా ఎదురుచూపులే!
జిల్లాకు రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. కారణం.. కీలకమైన కొన్ని కేంద్ర సంస్థలు ఇక్కడ నెలకొనడడమే.
తాజా బడ్జెట్లోనూ రిక్తహస్తమే..
కేంద్ర సంస్థల్లో కొరవడిన పురోభివృద్ధి
వెంకటాచలం, న్యూస్టుడే: జిల్లాకు రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. కారణం.. కీలకమైన కొన్ని కేంద్ర సంస్థలు ఇక్కడ నెలకొనడడమే. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఆ సంస్థల అభివృద్ధి, సేవల విస్తృతం మాత్రం ఆశించిన తీరుగా లేదు. దీనికి కారణం నిధుల కొరత. వెంకటాచలం మండలంలో జాతీయ విద్యా పరిశోధనా సంస్థ, ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రం, దివ్యాంగుల ప్రాంతీయ సంయుక్త కేంద్రం తదితరాలు తలపెట్టారు. వీటిలో ఒక సంస్థ నిర్మాణానికి స్థలం కేటాయించకుండానే శిలాఫలకం వేయగా.. మరోదానికి స్థలం కేటాయించినా న్యాయపరమైన చిక్కులతో భవన నిర్మాణం నిలిచిపోయింది. ఇంకోదానికి భవనం ఉన్నా.. అత్తెసరు సౌకర్యాలు ఉండటంతో ఆశించిన మేర సేవలు అందడం లేదు. కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్లోనూ వీటి పురోభివృద్ధికి ప్రత్యేకంగా నిధులేమీ కేటాయించకపోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది.
ఎన్సీఈఆర్టీ.. శిలాఫలకానికే పరిమితం
వెంకటాచలం మండలం చవటపాళెం పంచాయతీ పరిధిలో ఎన్సీఈఆర్టీ (జాతీయ విద్యా పరిశోధనా శిక్షణ సంస్థ) ప్రాంతీయ కేంద్రం ఏర్పాటుకు 2016, డిసెంబరు 7న మాజీ ఉపరాష్ట్రపతి, నాటి కేంద్ర మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు, మరో కేంద్ర మంత్రి ప్రకాశ్ జవడేకర్లు శంకుస్థాపన చేశారు. కేంద్రం కోసం మొత్తం 50 ఎకరాల పొలం కేటాయించారు. అందులో పరిశోధనా సంస్థతో పాటు పాఠశాల కూడా ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. కానీ, అదంతా ఆరంభ శూరత్వం అన్నట్లుగానే మిగిలిపోయింది. భూసేకరణలో భాగంగా రైతులకు నగదు చెల్లించకపోగా- ఆ దిశగా ఇప్పటి వరకు కనీసం ముందడుగు పడలేదు. దీంతో ఆరేళ్లుగా శిలాఫలకానికే పరిమితమైంది. రెండు, మూడు దఫాలుగా కేంద్ర అధికారులు పరిశీలించి.. ఏర్పాట్లు చేస్తామని చెప్పినా.. చర్యలు తీసుకోలేదు. నేటికీ భూసేకరణ జరగలేదు. నిర్మాణం పూర్తి చేస్తే సుమారు 2వేల మంది విద్యార్థులకు ఉచితంగా విద్య అందడంతో పాటు విద్యా పరిశోధనలకు అవకాశం ఏర్పడుతుంది. ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి.
* తాజా బడ్జెట్లో ఈ సంస్థ ఏర్పాటు ఊసే లేదు. ఏటా ఎన్సీఈఆర్టీకి నిధులు కేటాయిస్తుందని ఆశగా చూడటం.. ఆ తర్వాత ఉసూరుమనడం షరా మామూలవుతోంది. ఇప్పటి వరకు స్థలం కొనుగోలు, భవనానికి, పాఠశాల ఏర్పాటుకు రూపాయి కూడా కేటాయించలేదు. ప్రస్తుత బడ్జెట్లోనూ నిధుల మంజూరు లేమితో సంస్థ ఏర్పాటుపై నీలినీడలు కమ్ముకున్నాయి.
అధ్యయన కేంద్రం.. సొంత భవనం లేని ధైన్యం
కర్ణాటక రాష్ట్రం మైసూరులోని ప్రాచీన తెలుగు విశిష్ఠ అధ్యయన కేంద్రం 2019, నవంబరు 13న జిల్లాకు తరలివచ్చింది. సొంత భవనం లేకపోవడంతో వెంకటాచలం మండలం ఎర్రగుంట వద్ద జాతీయ రహదారి పక్కనున్న స్వర్ణభారత్ ట్రస్టుకు చెందిన ఓ భవనాన్ని అద్దె లేకుండా తాత్కాలిక ప్రాతిపదికన ఇచ్చారు. మూడున్నరేళ్లు గడుస్తున్నా.. నేటి సొంత భవనం ఏర్పాటు కాలేదు. ఇటీవల ప్రభుత్వం సరస్వతీనగర్లో రహదారి పక్కన 5.05 ఎకరాల స్థలాన్ని అధ్యయన కేంద్రానికి కేటాయించింది. అందులో పనులు జరుగుతున్న సమయంలో కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో నిలిపివేశారు. ః సొంత భవనం లేని కారణంగా నిధులు రావడం లేదు. డాక్యుమెంటేషన్ జరగడం లేదు. సిబ్బంది, పరిశోధనా సౌకర్యాలు అవసరాల మేరకు లేవు. సొంత భవనం ఉంటే.. స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడంతో పాటు భాషాభివృద్ధికి విస్తృత పరిశోధనలు, డాక్యుమెంటేషన్, స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ప్రస్తుత బడ్జెట్లో ఈ కేంద్రానికి ప్రత్యేకంగా నిధులేమీ కేటాయించలేదు. మొదట కేంద్ర కార్యాలయానికి నిధులు కేటాయిస్తారని. అక్కడి నుంచి అధ్యయన కేంద్రాలకు నిధులు మంజూరు చేస్తారని అధికారులు చెబుతున్నారు. గత బడ్జెట్లోనూ నేరుగా నిధుల కేటాయింపులు లేవు.
సీఆర్సీలో.. అత్తెసరు వసతులు
కేంద్ర ప్రభుత్వం వెంకటాచలం మండలం ఎర్రగుంట వద్ద దివ్యాంగుల ప్రాంతీయ సంయుక్త కేంద్రం(సీఆర్సీ)ని ఏర్పాటు చేసింది. 2019లో రూ. 17.17 కోట్లతో భవన నిర్మాణం కూడా పూర్తి చేశారు. రాష్ట్రంలోని దివ్యాంగులకు ఉచితంగా వైద్య సేవలు అందించడంతో పాటు వారికి వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ, ప్రత్యేక డిప్లొమా కోర్సుల నిర్వహణ, ఉపాధి రంగాల్లో శిక్షణ ఇవ్వడం, దివ్యాంగులకు పరికరాలు ఉచితంగా ఇచ్చి.. వారిని ప్రోత్సహించడం ఈ కేంద్రం ప్రధాన లక్ష్యం. ఈ సంస్థ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తోంది. దాంతో కేంద్రమే నిధులు మంజూరు చేయాల్సి ఉంది.
* ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులకు సేవలందిస్తాంచాల్సి ఉండగా- సౌకర్యాల లేమి, అత్తెసరు నిధుల విడుదలతో కొన్ని ప్రాంతాల వారికే సేవలు అందుతున్నాయి. బయటి ప్రాంతాల వారికి వసతి లేకపోవడం.. రవాణా సౌకర్యాల లేమి తీవ్రంగా వేధిస్తోంది. తెలంగాణా సీఆర్సీలో ఉన్న వసతి సౌకర్యాలు కూడా ఇక్కడ లేకపోవడంతో దివ్యాంగులు ఇక్కడికి వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. వసతి భవనాలు, కాటేజీలు, రవాణా సౌకర్యాలు, ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దివ్యాంగులకు మెరుగైన, విస్తృతమైన సేవలు అందుతాయి. సీఆర్సీకి నేరుగా నిధులు కేటాయించలేదని.. కేంద్ర సంస్థకు కేటాయించిన నిధుల్లో.. ఇక్కడకు అవసరమైన మేరకు మంజూరు చేస్తారని అధికారులు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగదభిరామ.. జానకిరామ
[ 18-04-2024]
జిల్లా వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలను ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. నెల్లూరు దర్గామిట్టలోని శబరి శ్రీరామక్షేత్రం ఆధ్వర్యంలో బుధవారం శ్రీరామ స్థూపం ప్రాంగణంలో వేలాది మంది సమక్షంలో సీతారాముల కల్యాణోత్సవం నిర్వహించారు. -
20న సర్వేపల్లికి చంద్రబాబు రాక
[ 18-04-2024]
ప్రజాగళం పర్యటనలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు జిల్లాకు రానున్నారు. ఈ నెల 20వ తేదీ శనివారం మధ్యాహ్నం 3 గంటలకు సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరులో జరిగే సమావేశంలో పాల్గొననున్నారు. -
జిల్లాకు చేరుకున్న వ్యయ పరిశీలకులు
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల వ్యయ పరిశీలకులుగా నియమితులైన జ్యోతిమోయ్ బయ్లంగ్, కంచన్ రామ్ మీనా నెల్లూరుకు విచ్చేశారు. బుధవారం రాత్రి నగరంలోని ఓ హోటల్కు చేరుకున్నారు. -
పరిశ్రమలేమోగానీ.. తిప్పలు గుల్ల
[ 18-04-2024]
ఆత్మకూరు పారిశ్రామిక వాడలో పరిశ్రమల మాటేమోగానీ.. అది వైకాపా మట్టి మాఫియాకు కాసుల పంట పండిస్తోంది. ప్రస్తుతం ఇక్కడ రూ. 23.4 కోట్లతో రెండో విడత అభివృద్ధి పనులు చేపడుతున్నారు. -
అధికార అహం.. అరాచక పర్వం!
[ 18-04-2024]
వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో అరాచకాలు, ఆగడాలు నిత్యకృత్యమయ్యాయి. దౌర్జన్యాలు, దాడులు, వేధింపులు సర్వసాధారణంగా మారాయి. అధికార పార్టీ నేతలన్న అహంతో కొందరు వైకాపా నాయకులు చెలరేగిపోగా- వారి దందాలు, దౌర్జన్యాలకు కొందరు అమాయకులు బలైపోయారు. -
నామినేషన్లకు వేళాయే
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాలో ఒక లోక్సభ స్థానంతో పాటు ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు నోటిఫికేషన్ వెలువడనుంది. -
పోలీస్ బందోబస్తు
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ పర్యవేక్షణలో జిల్లా పోలీసు యంత్రాంగం నామినేషన్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. -
రైతు జపం.. ఏదో నెపం
[ 18-04-2024]
కౌలు రైతులకు కొత్త చట్టం తెచ్చామని జగన్మోహన్రెడ్డి చెబుతున్నా.. భూ యజమాని అంగీకారం లేనిదే సాగుదారు హక్కుపత్రాలు లభించని పరిస్థితి క్షేత్రస్థాయిలో కనిపిస్తోంది. -
కడలికి తూట్లు.. అక్రమార్కులకు కాసులు
[ 18-04-2024]
ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చింది. సహజ వనరులను ఇతర ప్రాంతాలకు తరలించడానికి వీల్లేదు. కానీ కొందరు సముద్రపు ఇసుకను తీసుకొచ్చి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. -
బేల్దారీ బేజారు
[ 18-04-2024]
భవన నిర్మాణ సామగ్రి ధరలు అసాధారణంగా పెరగడంతో వందల మంది అసంఘటిత రంగ కార్మికులు రోడ్డున పడుతున్నారు. ఒక పక్క వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో గ్రామాల్లో వ్యవసాయ పనులు దొరికే పరిస్థితి లేదు. -
వేసవి ప్రణాళిక లేదు.. అధికారి లేరు
[ 18-04-2024]
ఎండలు మండి పోతున్నాయి. జిల్లాలో బావులు, నీటి వనరులు అడుగంటుతున్నాయి. జనం దాహార్తితో అల్లాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో యుద్ధప్రాతిపదిక పనిచేయాల్సిన గ్రామీణ నీటి సరఫరా అధికారులు.. బదిలీపై వెళ్లిపోతున్నారు. -
అరాచకాల్లో దిట్ట జగన్: బీద
[ 18-04-2024]
హత్యలు, దాడులు, కబ్జాలు, అరాచకాల్లో దిట్ట జగన్ అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర విమర్శించారు. నెల్లూరు తెదేపా కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. -
మూడేళ్ల చదువు ఉపాధికి ఆదరువు
[ 18-04-2024]
పదో తరగతి తరువాత మూడేళ్ల చదువు.. అనంతరం ఉపాధి.. ఉన్నత చదువులు చదవాలనుకునే వారికి నేరుగా రెండో సంవత్సరంలో బీటెక్లో చేరే అవకాశం.. ఇది పాలిటెక్నిక్లో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు. -
చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యం: తెదేపా
[ 18-04-2024]
చంద్రబాబు సీఎం అయితే అభివృద్ధి జరుగుతుందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర పేర్కొన్నారు. బుధవారం రాత్రి బోగోలు మండలంలోని చెంచులక్ష్మీపురంలో యోహాన్ అతని అనుచరులు పార్టీలో చేరారు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!