logo

‘ప్రభుత్వాలు ప్రజలను దగా చేస్తున్నాయి’

నమ్మించి దగా చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ప్రజలు అర్థం చేసుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు చేవూరు దేవకుమార్‌రెడ్డి అన్నారు.

Published : 09 Feb 2023 01:22 IST

విద్యార్థినులకు కరపత్రాలు ఇస్తున్న దేవకుమార్‌రెడ్డి, తదితరులు

నెల్లూరు(జడ్పీ), న్యూస్‌టుడే : నమ్మించి దగా చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ప్రజలు అర్థం చేసుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు చేవూరు దేవకుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆపార్టీ ఆధ్వర్యంలో 19వ డివిజన్‌లో చేయిచేయి కలుపుదాం అనే నినాదంతో నాయకులు ఇంటింటి పాదయాత్ర నిర్వహించారు. వివిధ కార్యాలయాలు, వ్యాపార సంస్థలు, విద్యార్థులకు కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా దేవకుమార్‌రెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా దోపిడీ జరుగుతోందన్నారు. బ్యాంకుల నుంచి రూ.కోట్లను అదానీకి కేంద్ర ప్రభుత్వం కట్టబెడుతోందని విమర్శించారు. స్థానిక సమస్యలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా పార్టీ మహిళ అధ్యక్షురాలు లతారెడ్డి, నెల్లూరు గ్రామీణ నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఉడతా వెంకట్రావ్‌, ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు పవన్‌కుమార్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని