logo

వైభవం.. కొండలరాయుని కల్యాణం

నెల్లూరు బాలాజీనగర్‌లో వికాస్‌ ప్రజాహిత సేవా సమితి వ్యవస్థాపకుడు కర్తం ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో శనివారం రాత్రి శ్రీదేవి భూదేవీ సమేత కల్యాణ వేంకటేశ్వరుని కల్యాణోత్సవం కనుల పండువగా నిర్వహించారు.

Published : 19 Mar 2023 03:25 IST

నెల్లూరు బాలాజీనగర్‌లో వికాస్‌ ప్రజాహిత సేవా సమితి వ్యవస్థాపకుడు కర్తం ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో శనివారం రాత్రి శ్రీదేవి భూదేవీ సమేత కల్యాణ వేంకటేశ్వరుని కల్యాణోత్సవం కనుల పండువగా నిర్వహించారు. వైఖానస ఆగమ ప్రవర నారాయణం దాశరథి స్వామి ఆధ్వర్యంలో వేద పండితులు పుష్పశోభిత వేదికపై కొలువు దీరిన స్వామివారికి కల్యాణోత్సవం, పుష్పయాగం శాస్త్రోక్తంగా జరిపించారు. ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి, మాజీ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌, నుడా ఛైర్మన్‌ ముక్కాల ద్వారకానాథ్‌, దిల్లీ తితిదే సలహా మండలి అధ్యక్షురాలు ప్రశాంతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

న్యూస్‌టుడే, నెల్లూరు(సాంస్కృతికం)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని