చినుకా చినుకా ఎందుకు కురిశావ్
జిల్లాలో తొలి పంట సాగు చేసిన రైతులు ఇప్పటికే కష్టనష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నారు. దీనికి తోడు అకాల వర్షం వారి పాలిట అశనిపాతంలా మారింది.
దళారుల మాయాజాలం.. ధాన్యం ధరల పతనం
వ్యాపారుల ద్వారా ధాన్యం కొనుగోలు
ఉందిలే మంచి కాలం ముందుముందునా.. అంటూ కోతల ప్రారంభంలో అన్నదాతలు ఆనందించారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.17,500 కన్నా బహిరంగ మార్కెట్లో రూ.20 వేలు ఉండటంతో అందరూ అక్కడే విక్రయించారు. ఇంత వరకు బాగున్నా.. మూడురోజులుగా కురుస్తున్న వర్షాలకు మిల్లర్లు, దళారులు రంగంలోకి దిగారు. గంట గంటకూ ధర దిగ్గోస్తున్నారు. రూ.16,500 చొప్పున కొనుగోలు చేస్తూ నిలువునా దోచుకుంటున్నారు. కొనుగోలు కేంద్రాలు లేకపోవడం.. ధాన్యం నిల్వ చేసుకుని ధర వచ్చినప్పుడు విక్రయించుకునే వెసులుబాటు అన్నదాతలకు లేకపోవడం వారికి ఆసరాగా మారింది.
అల్లూరు మండలం ఇస్కపల్లిలో ఓ రైతు వద్ద పుట్టు ధాన్యం రూ.17,500 కొనుగోలు చేసేందుకు ఓ దళారీ శనివారం రాత్రి ఒప్పందం కుదర్చుకొని ఆదివారం ఉదయానికి రూ.17 వేలకు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో మరో గత్యంతరం లేక ఆ ధరకు రైతు విక్రయించారు.
అదే మండలంలో చింతగుంట రోడ్డులో పుట్టు ధాన్యం రూ.17,800 చొప్పున కొనుగోలు చేస్తానని ఓ రైతు వద్ద శనివారం రాత్రి దళారీ ఒప్పందం చేసుకొని ఆదివారం ఉదయానికి రూ.16,500 ధర తగ్గించాడు. ధాన్యాన్ని నిల్వ చేసుకునే సౌకర్యం లేక రైతు దక్కిందే ధర అనుకొని ధాన్యం అమ్మేశారు.
న్యూస్టుడే, సంగం: జిల్లాలో తొలి పంట సాగు చేసిన రైతులు ఇప్పటికే కష్టనష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నారు. దీనికి తోడు అకాల వర్షం వారి పాలిట అశనిపాతంలా మారింది. వ్యాపారులు, దళారులు, మిలర్లకు మాత్రం కాసులు కురిపిస్తోంది. ప్రభుత్వ మద్దతు ధరకు ధాన్యం విక్రయించుకునేందుకు అవసరమైన కొనుగోలు కేంద్రాల ఏర్పాటు నేటికీ జరగలేదు. రైతు భరోసా కేంద్రాల పరిధిలో బహుళ ప్రయోజనకర (మల్టీపర్పస్) గోదాముల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. 561 రైతు భరోసా కేంద్రాల పరిధిలో తొలిదశలో రూ.18 కోట్ల అంచనా వ్యయంతో మంజూరైన 48 గోదాముల నిర్మాణం ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. రెండో దశ, మూడో దశ నిర్మాణాలు నామమాత్రంగా ఉన్నాయి.
గతేడాది 10 లక్షల టన్నులు
జిల్లాలో తొలి పంట సమయంలో దాదాపు ఆరు లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేస్తే.. 17 లక్షల టన్నుల వరకు దిగుబడులు లభిస్తాయి. రైతులు తమ ఆహారం, విత్తన అవసరాలకు 2.5 లక్షల టన్నులు పోను గతేడాది కొనుగోలు కేంద్రాల ద్వారా కేవలం 4.5 లక్షల టన్నులు మాత్రమే మద్దతు ధరకు విక్రయించగా.. మిగతా 10 లక్షల టన్నుల ధాన్యాన్ని వ్యాపారులు, దళారులకు అతి తక్కువ ధరకు విక్రయించారు.
లాభపడిన వ్యాపారులు
గతేడాది తొలి పంట కాలంలో జిలకర మసూరీ రకం ధాన్యాన్ని రైతులు పుట్టి రూ.12 వేల కనిష్ఠ ధరకు అమ్ముకున్నారు. వ్యాపారులు భారీగా కొనుగోలు చేసి నిల్వ చేసి కేవలం మూడు నెలల వ్యవధిలో పుట్టిని రూ.25 వేల చొప్పున విక్రయించి అత్యధిక ఆదాయం పొందారు.
60 శాతం కోత కోయాల్సి ఉండగా..
జిల్లాలో ప్రస్తుతం 40 శాతం మాత్రమే కోతలు జరిగాయి. ఈనెల ప్రారంభంలో బీపీటీ (జిలకర మసూరీ), ఆర్ఎన్ఆర్ (సుగర్లెస్) వంటి రకాలకు ధర పలికింది. ఆ తర్వాత నుంచి జిలకర మసూరీ ధర తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం కోత కోయాల్సిన 60 శాతం పంటలో అత్యధికంగా నెల్లూరు మసూరీ రకం ఉంది. ఆ పంట కోతలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ మద్దతు ధర రూ.17,500గా ఉండగా.. ప్రస్తుతం దాన్ని రూ.14,300కి దళారులు తగ్గించారు.
నిల్వ చేసుకునే వసతి ఉంటే.. దళారుల బారిన పడకుండా రైతులు లాభాలను ఆర్జించాలంటే జిల్లాలో గోదాములు అందుబాటులో ఉండాలి. వాటిలో నామమాత్రం రుసుముతో నిల్వ చేసుకునే వెసులుబాటు కల్పించాలి. ధాన్యానికి రైతు బంధు పథకం ద్వారా సాయం అందిస్తే రైతులకు చేయూతగా ఉంటుంది. తద్వారా గిట్టుబాటు ధర వచ్చినప్పుడు రైతులు విక్రయించుకుని ప్రయోజనం పొందుతారు.
క్షేత్రస్థాయి పరిశీలన లేక..వాస్తవ స్థితిగతులు అత్యంత దారుణంగా ఉంటే అధికారులు మాత్రం క్షేత్రస్థాయిలో పరిశీలించడం లేదు. ఈనెల ప్రారంభంలో ఉన్న ధర ఇప్పటికీ అమలవుతుందని భావిస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక కాలయాపన చేస్తున్నారు. రైతు భరోసా కేంద్రాల పరిధిలో మల్టీపర్పస్ గోదాముల నిర్మాణాలను పూర్తి చేసి వాటిని రైతులకు అందుబాటులోకి తీసుకొస్తేనే రైతుల కడగండ్లు తీరుతాయి.
సిద్దీపురం సమీపంలో వర్షపునీరు ధాన్యం కిందకు
వెళ్లకుండా అడ్డుగా మట్టి కట్ట వేస్తున్న రైతు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన తెదేపా అభ్యర్థి
[ 24-04-2024]
అల్లూరు మండలంలో తెదేపా అభ్యర్థి కావ్యక్రిష్టారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
కావలిలో లారీని ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి
[ 24-04-2024]
కావలి ముసునూరు టోల్ప్లాజా వద్ద లారీని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. -
ఇసుక తోడేళ్లు.. పెన్నమ్మ కన్నీళ్లు
[ 24-04-2024]
ఇసుక అక్రమ తవ్వకాలు... అయిదేళ్ల వైకాపా పాలనలో నిత్యం వినిపించిన మాట. అధికార పార్టీ నాయకుల అండదండలతో పెన్నమ్మను కుళ్లబొడవడంతో పాటు నిబంధనలకు నీళ్లొదిలి అడ్డగోలుగా తవ్వి తరలించారు. -
అయిదేళ్ల కథ.. గోషా ఆసుపత్రి వ్యథ!
[ 24-04-2024]
మహిళలకు ప్రత్యేకంగా ఆసుపత్రిని ఏర్పాటు చేసి.. అత్యాధునిక వైద్య సేవలు అందిస్తామని వైకాపా ప్రజాప్రతినిధులు, నాయకులు ఊకదంపుడు ఉపన్యాసాలు చేశారు. -
అమ్మో దారి.. గుండెజారి
[ 24-04-2024]
జిల్లాలోని ప్రముఖ పెంచలకోన క్షేత్రానికి వెళ్లే రోడ్డది.. అంతటి ప్రాధాన్యమున్న మార్గాన్ని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో భక్తులతో పాటు పర్యాటకులు అవస్థలు పడాల్సి వస్తోంది. -
వైకాపా నాయకుల చేతివాటం
[ 24-04-2024]
సచివాలయాలకు వచ్చిన నిధులతో అధికార పార్టీ నాయకులు అడ్డగోలుగా పనులు చేస్తున్నారు. నిబంధనలకు నీళ్లొదిలారు. అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో నిధులన్నీ వృథా అవుతున్నాయి. -
వైకాపా పాలనలో రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్థకం: తెదేపా
[ 24-04-2024]
గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్థకమైందని కావలి తెదేపా కూటమి అభ్యర్థి దగుమాటి కృష్ణారెడ్డి ఆరోపించారు. గురువారం మండలంలోని వెలుపోడు, కాట్రాయపాడు, ధర్మవరంలో పర్యటించారు. -
నిరుద్యోగికి నిరాశే..
[ 24-04-2024]
నెల్లూరు నగరం వెంకటేశ్వరపురంలో ఉన్న ప్రభుత్వ బాలుర పాలిటెక్నిక్ కళాశాలలో తెదేపా ప్రభుత్వం సీమెన్స్ సంస్థ ఆధ్వర్యంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం ఏర్పాటు చేసి విద్యార్థులకు టెక్నికల్ విద్యలో ఉచితంగా శిక్షణ అందించింది. -
మాటలే తప్ప.. పరిశ్రమలెక్కడ!
[ 24-04-2024]
సర్వేపల్లి, కోవూరు, ఆత్మకూరు నియోజకవర్గాల్లో పరిశ్రమల ఏర్పాటుకు భూములు సేకరించి నిరుపయోగంగా వదిలేశారు... వైకాపా అయిదేళ్ల పాలనలో అలంకార ప్రాయంగా మారాయి. -
హామీ ఇచ్చి.. కష్టాల్లో ముంచి
[ 24-04-2024]
పాదయాత్రలో 3,648 కిలోమీటర్లు నడిచా... ప్రజలు పడుతున్న కష్టాలు విన్నా... కళ్లారా చూశా... రాష్ట్రంలో సహాయం కోసం ఎదురుచూస్తున్న ప్రతి మనిషి, కుటుంబానికి ఒక మాట ఇస్తున్నా... నేను విన్నాను... నేను ఉన్నాను అని మాట ఇస్తున్నా... -
తెలుగుతమ్ముళ్ల జోష్
[ 24-04-2024]
ఇంటూరి సోదరులు.. తెదేపాలో రాజకీయంగా క్రియాశీలక నాయకులు. నువ్వా? నేనా? అన్నట్లుగా సీటు కోసం పోటీపడ్డారు. అయితే, ఒకరిని అదృష్టం వరిస్తే.. మరొకరిని నిరాశపరిచింది. -
ఎస్సై దురుసు ప్రవర్తనపై ఆందోళన
[ 24-04-2024]
దళిత మహిళపై ఎస్సై దురుసుగా ప్రవర్తించడంతో మాల మహాసభ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం పోలీసుస్టేషన్ ఎదురుగా బాధితులు ఆందోళన చేపట్టారు. -
యువకుడి దారుణ హత్య
[ 24-04-2024]
నెల్లూరులో యువకుడిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు బీవీ నగర్ రైల్వేగేటు సమీపంలోని వినాయక స్వామి గుడి వీధిలో నివాసం ఉండే దశరథ (28) పదో తరగతి వరకు చదువుకుని.
తాజా వార్తలు (Latest News)
-
మోదీ పనితీరు అద్భుతం.. కొనియాడిన జేపీ మోర్గాన్ సీఈఓ
-
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్
-
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
నాలుగో రోజూ లాభాల్లో.. 22,400 ఎగువన నిఫ్టీ
-
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది