యువత.. ఆటల్లో ఘనత
యువత లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని చేరుకునేందుకు అహరహం శ్రమిస్తుంది. తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా చదువుకుంటూనే క్రీడల్లో పట్టు సాధిస్తున్నారు.
బాల్బ్యాడ్మింటన్ పోటీలు
న్యూస్టుడే, కావలి: యువత లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని చేరుకునేందుకు అహరహం శ్రమిస్తుంది. తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా చదువుకుంటూనే క్రీడల్లో పట్టు సాధిస్తున్నారు. పోటీల్లో పాల్గొని సత్తా చాటుతున్నారు. ఇలా జిల్లా, రాష్ట్రాన్ని దాటి జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్నారు. దేశవ్యాప్తంగా జరిగే పోటీల్లో ప్రతిభ చూపేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇలాంటి వారిలో ఇటీవల కావలి పట్టణంలో జరిగిన బాల్బ్యాడ్మింటన్ పోటీల్లో విజేతలై రాష్ట్ర జట్టుకు పలువురు ఎంపికయ్యారు. వీరి ప్రతిభపై కథనం.
క్రీడలంటే ప్రాణం
- పడాల సాంబశివ, జాతీయ స్థాయికి ఎంపికైన యువకుడు
విద్యాభ్యాసం: డిగ్రీ ద్వితీయ సంవత్సరం
తల్లిదండ్రులు: రాజు, దేవి, వ్యవసాయ కార్మికులు
క్రీడలంటే నాకు ఇష్టం. నేను చదువుకుంటూ బాల్ బ్యాడ్మింటన్లో సాధన చేశా. గతంలో 2017-18వ సంవత్సరంలో సబ్ జూనియర్ నేషనల్స్, స్టార్ ఇండియా పోటీల్లో జట్టును ప్రథమ స్థానంలో నిలపడంలో కృషి చేశా. అంతకుముందు 2020-21 జూనియర్ నేషనల్స్లోనూ జట్టును ద్వితీయ స్థానంలో నిలిపా. గత జనవరిలో జరిగిన అఖిల భారత క్రీడా పోటీల్లోనూ తృతీయ స్థానంలో ఉన్నాం. బెస్ట్ ఆటగాడిగా ప్రశంసాపత్రం లభించింది. క్రీడలకు ఇచ్చే రిజర్వేషన్ ద్వారా రైల్వే శాఖలో ఉద్యోగం సాధిస్తా.
జాతీయ స్థాయిలోనూ ప్రతిభ చాటుతా
- యాకా హిమబిందు, యువ క్రీడాకారిణి
విద్యాభ్యాసం: బీటెక్ ద్వితీయ సంవత్సరం
తండ్రి: శ్రీను, ఎలక్రీ¨్టషియన్
తల్లి: బుజ్జమ్మ, గృహిణి
త్వరలో జరిగే జాతీయ స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో సత్తా చాటుతా. రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తా. గతంలో సబ్జూనియర్స్ విభాగంలో జాతీయ స్థాయి పోటీల్లో ప్రథమ స్థానంలో జట్టును నిలిపాం. వివిధ క్రీడా పోటీల్లో కూడా పాల్గొంటున్నా. ఎప్పటికైనా ఒలింపిక్స్లో ఆడతా. దేశానికి క్రీడా ఖ్యాతి ఇనుమడింపజేయాలనేదే ధ్యేయం.
అంతర్జాతీయ పోటీల్లో రాణిస్తా
- ఎం.రాధా స్రవంతి
విద్యాభ్యాసం: డిగ్రీ ప్రథమ సంవత్సరం
తండ్రి- అప్పారావు, రైతు
తల్లి- రమణమ్మ, గృహిణి
నేను పదో తరగతి చదువుతున్నప్పుడే (2020వ సంవత్సరం) సబ్ జూనియర్ విభాగం నుంచి బాల్బ్యాడ్మింటన్ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్నా.. నాడు జట్టు ప్రథమస్థానంలో నిలిచింది. అప్పట్లో శ్రీలంకపై గెలుపొందాం. ఇప్పుడు 19 సంవత్సరాల లోపు జాతీయ స్థాయి క్రీడాకారిణిగా ఎంపిక కావడం సంతోషంగా ఉంది. తప్పక విజయం సాధిస్తాం. క్రీడా కోటాలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించి జీవితంలో స్థిరపడాలని ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గడప గడపన జగన్నాటకం!
[ 25-04-2024]
అధికారంలోకి వచ్చిన మూడేళ్లపాటు దోచుకోవడమే విధిగా వైకాపా సాగించిన పాలనతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపించడంతో ‘గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రజలను నేరుగా కలుసుకోవడం.. వారి సమస్యలను తెలుసుకోవడం.. -
జలహిత మెరుగురు? జనఘోష పట్టదు!
[ 25-04-2024]
జగన్ ప్రభుత్వ పాలనలో సహజ వనరుల దోపిడీ ఎంత విశృంకళంగా సాగిందో... జిల్లా జీవనాడిగా వినుతికెక్కిన సోమశిల జలాశయ సంరక్షణపై అంతే నిర్లక్ష్యం చూపింది. పాలనలో డొల్లతనానికి. -
వైకాపా మందుచూపు
[ 25-04-2024]
నిబంధనల ప్రకారం ఒక్కోమనిషికి మూడు సీసాలకు మించి మద్యం అమ్మకూడదు. ఒక వేళ పలుమార్లు వెళ్లి కొనుగోలు చేసినా.. పది, ఇరవైకి మించి ఉండవు. అలాంటిది.. -
కావలి సమీపంలో ఘోర ప్రమాదం
[ 25-04-2024]
వారంతా స్నేహితులు.. ఫ్యాన్సీ దుకాణంలోకి అవసరమైన ఇమిటేషన్ ఆభరణాల కొనుగోలుకు చెన్నై వెళ్లారు. అనంతరం కారులో వస్తున్నారు. అందరూ గాఢ నిద్రలోకి జారుకున్నారు. -
ఎన్నికల సందేహాలా.. కాల్ చేయండి
[ 25-04-2024]
ఎన్నికలకు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా నివృత్తి చేసుకోవచ్చని జిల్లా పోలీసు పరిశీలకులు అశోక్ టి దుధే ఒక ప్రకటనలో తెలిపారు. -
మే 2 నుంచి ఓటరు సమాచార స్లిప్పులు
[ 25-04-2024]
మే నెల రెండు నుంచి ఎనిమిదో తేదీ వరకు ఓటరు సమాచార స్లిప్పులు పంపిణీ చేయాలని కలెక్టర్ ఎం.హరినారాయణన్ అధికారులకు సూచించారు. -
తాగునీటి సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూమ్
[ 25-04-2024]
జిల్లాలో తాగునీటి సమస్యలు పరిష్కరించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఎం.హరినారాయణన్ ప్రకటనలో తెలిపారు. -
సర్వేపల్లిలో ప్రతిఘటనకు సిద్ధం
[ 25-04-2024]
సర్వేపల్లిలో మంత్రి కాకాణి ఆగడాలను ప్రతిఘటించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అన్నారు. వెంకటాచలంలో బుధవారం నామినేషన్ దాఖలు అనంతరం మాట్లాడారు. -
ప్రభుత్వం చెంతే ప్రతిపాదనలు
[ 25-04-2024]
ఎలాంటి విపత్తు ఎదురైనా ముందు గుర్తుకొచ్చేది అగ్నిమాపకశాఖ.. ఆ శాఖనే ప్రభుత్వం పట్టించుకుకోలేదు. వేసవిలో పెద్దసంఖ్యలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటుంటాయి. -
జగనన్న ఇల్లు.. రాలేదన్నా!
[ 25-04-2024]
నవరత్నాలు.. పేదలందరికీ ఇళ్లు. ఇదీ ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీ. ఇందుకు జగనన్న కాలనీలు నిర్మిస్తున్నామని ఘనంగా ప్రకటించారు. అధికారంలోకి వచ్చి అయిదేళ్లయింది. ఈ హామీ అమలుకాలేదు. -
దక్షిణ బజారు.. సమస్యలతో బేజారు
[ 25-04-2024]
పట్టణంలోని ప్రధాన కాలనీల్లోనూ మౌలిక వసతుల సమస్యలు స్థానికులను వేధిస్తున్నాయి. గత నాలుగేళ్లుగా మున్సిపాలిటీ అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదనేందుకు ఆయా... -
గుంతల రోడ్లు... పూడిన కాలువలు
[ 25-04-2024]
షబ్బీర్ కాలనీలో సీసీ రోడ్లు రాళ్లు తేలడటంతో చీకటిలో నడవాలంటే ఎక్కడ అదుపుతప్పి పడిపోతామోనని ఆందోళన చెందుతున్నారు. మురుగు కాలువలు చెత్తతో నిండినా సిబ్బంది శుభ్రం చేయటంలేదని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!